Ellora caves UNESCO: ఎల్లోరా గుహలకు కొత్త హంగులు.. పర్యాటకులను ఆకర్షించడానికి..
Ellora caves UNESCO: మహారాష్ట్రలోని ఔరంగాబాద్ జిల్లాలో ఉన్నఎల్లోరా గుహలు కొత్త హంగులు అందడానికి భారత పురావస్తు శాఖ సిద్దమైంది. ఇక్కడ హైడ్రాలిక్ లిఫ్ట్ను ఏర్పాటు చేయాలని అధికారులు యోచిస్తున్నారు. దీంతో హైడ్రాలిక్ లిఫ్ట్ కలిగి ఉన్న దేశంలోనే మొదటి స్మారక చిహ్నంగా నిలువనున్నది.
Ellora caves UNESCO: భారత దేశంలో చారిత్రక ప్రాధాన్యత కలిగిన పలు ప్రాంతాలను యునైటెడ్ నేషన్స్ ఎడ్యుకేషనల్, సైంటిఫిక్ అండ్ కల్చరల్ ఆర్గనైజేషన్ (యునెస్కో) ప్రపంచ వారసత్వ ప్రదేశాలుగా గుర్తించింది. వీటిలో మహారాష్ట్రలోని ఔరంగాబాద్ జిల్లాలో ఉన్న ఎల్లోరా గుహలు చాలా ప్రత్యేకమైనవి. ఈ ఎల్లోరా గుహలు దేశంలోనే హైడ్రాలిక్ లిఫ్ట్ను కలిగి ఉన్న తొలి స్మారక చిహ్నంగా అవతరించనుందని భారత పురావస్తు శాఖ తెలిపింది. ఈ విషయాన్ని భారత పురావస్తు శాఖ (ఏఎస్ఐ) సీనియర్ అధికారి ఆదివారం వెల్లడించారు.
ఔరంగాబాద్ నగరం నుండి దాదాపు 30 కి.మీ దూరంలో ఉన్న ఎల్లోరా గుహలు.. ప్రపంచంలోని అతిపెద్ద రాతితో చేసిన ఆలయ సముదాయాలలో ఒకటి. ఈ ఆలయ సముదాయంలో హిందూ, బౌద్ధ మరియు జైన శిల్పాలు ఉన్నాయి. ఈ గుహాలను చూడటానికి నిత్యం వేలాది మంది పర్యటకులు విచ్చేస్తారు. ఇందులో విదేశీ పర్యటకులే అత్యధికంగా ఉండటం విశేషం.
500 మీటర్ల విస్తీర్ణంలో విస్తరించి ఉన్న ఎల్లోరా గుహలను పర్యాటకులకు అనుకూలంగా మార్చేందుకు ASI అనేక ప్రాజెక్టులను చేపడుతున్నదని ఔరంగాబాద్ సర్కిల్ సూపరింటెండెంట్ ఆర్కియాలజిస్ట్ మిలన్ కుమార్ చెప్పారు. ఈ ఆలయ సముదాయంలోని 34 గుహలలో 16 గుహ చాలా ముఖ్యమైనదని ఆయన చెప్పారు. కైలాస గుహగా ప్రసిద్ధి చెందిన ఇది. రెండు అంతస్తుల నిర్మాణం. గుహ పైకి ఎక్కి వీక్షణలు చూడాలంటే పర్యాటకులు మెట్లు ఎక్కాలి లేదా ర్యాంప్ పైకి వెళ్లాలి. అయితే.. యాత్రికులకు అనువుగా.. సులభంగా ఉండటానికి ఈ గుహకు రెండు వైపులా చిన్న లిఫ్టులను ఏర్పాటు చేయాలని ఏఎస్ఐ ప్రతిపాదించినట్లు ఆయన తెలిపారు.
ఈ లిఫ్టులను ఏర్పాటు చేయడానికి ఎటువంటి నిర్మాణ కార్యకలాపాలు ఉండవని అధికారి తెలిపారు.9 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఓ యంత్రాంగం ఏర్పాటు చేస్తామనీ, ఇందులో వీల్ చైర్ ఉన్న వ్యక్తి సులభంగా మొదటి అంతస్తుకు వెళ్లవచ్చు. ఈ చర్య ఎల్లోరాను ఎఎస్ఐ కింద లిఫ్ట్ సౌకర్యం కలిగిన మొదటి ప్రపంచ వారసత్వ ప్రదేశంగా మారుస్తుంది, ఈ నెల ప్రారంభంలో ఈ ప్రాజెక్టుకు ఉన్నతాధికారులు ఆమోదం తెలిపారని చెప్పారు.
లైటింగ్ ఏర్పాటు
పర్యాటకులు కూడా పై నుంచి కైలాస గుహను చూసేందుకు అవకాశం ఉంటుందని తెలిపారు. కైలాష్ గుహ అనేది కొండలతో చుట్టుముట్టబడిన నిర్మాణం. దీని కోసం ఎగువ కొండపై ఒక మార్గం తయారు చేయబడుతుంది. ASI కొన్ని పెయింటింగ్లకు లైటింగ్ను అమర్చాలని, కొన్ని భాగాలలో పరిరక్షణ పనులను చేపట్టాలని యోచిస్తున్నట్లు అధికారి తెలిపారు.
ఎల్లోరా గుహలను రోజుకు అంతర్జాతీయ ప్రయాణికులతో సహా 2,000 నుండి 3,000 మంది సందర్శకులు ఈ ప్రాంతానికి విచ్చేస్తారని తెలిపారు. ఎల్లోరాలో టిక్కెట్ కౌంటర్ల సంఖ్యను పెంచాలని, గైడ్లను నియమించాలనుకునే సందర్శకుల కోసం కేంద్రీకృత కౌంటర్ను ఏర్పాటు చేయాలని ప్లాన్ చేస్తున్నామని తెలిపారు. కాంప్లెక్స్కు ప్రవేశ, నిష్క్రమణ పాయింట్ల వద్ద సెల్ఫీ పాయింట్లతో కొన్ని ల్యాండ్స్కేపింగ్ చేయడానికి కూడా ప్లాన్ చేస్తున్నామని తెలిపారు. పర్యాటకులు అనుభవాన్ని మరింత ఆహ్లాదకరంగా మార్చాలనేదే తమ ప్రయత్నమని అధికారి చెప్పారు.
అలాగే.. శానిటరీ ప్యాడ్ డిస్పోజల్ మెషిన్లతో కూడిన మూడు నుండి నాలుగు టాయిలెట్ బ్లాక్లను ఏర్పాటు చేయాలని ASI యోచిస్తోందనీ, గుహ ప్రాంగణంలో ఎలక్ట్రిక్ వాహనాల సేవ వచ్చే నెలలో ప్రారంభమవుతుందని ఆయన చెప్పారు. ఈ ప్రాజెక్టులన్నీ మంజూరు, అమలు వివిధ దశలలో ఉన్నాయనీ, పూర్తి చేయడానికి ఒక సంవత్సర కాలం పట్టవచ్చని అధికారి చెప్పారు.