యువతిపై ముగ్గురు మైనర్ల గ్యాంగ్ రేప్.. అరెస్ట్..
అత్యాచారానికి గురైన యువతి ఓ సంస్థలో కేటరర్ గా పని చేస్తోంది. శుక్రవారం సాయంత్రం పని ముగించుకుని ఇంటికి వస్తుండగా ఆమెతో పనిచేసే ఓ యువకుడు తనతో కొంచెం పని ఉందని.. మాట్లాడాలి అని చెప్పి ఆమెను ఇంటికి వెళ్లకుండా ఆపేశాడు. ఆ తర్వాత ఆమెకు ఏవో మాయమాటలు చెప్పి యువతిని తీసుకెళ్లి ఓ మురికివాడలోని చిన్న గదిలో బంధించాడు.
ముంబై : mumbaiలో దారుణ ఘటన జరిగింది. womanపై Minor boys సామూహిక లైంగిక దాడికి పాల్పడ్డారు. ముంబై ఈస్ట్రన్ ఉపనగరం గోవండీ ప్రాంతంలో ఓ యువతిపై నలుగురు వ్యక్తులు gang rapeకి తెగబడ్డారు. స్థానిక శివాజీ నగర్ ఏరియాలోని మట్టీరోడ్డులో శనివారం తెల్లవారుఝామున నాలుగున్నర గంటలకు ఈ ఘటన జరిగినట్లు పోలీసులు నిర్ధారించారు.
ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. అత్యాచారానికి గురైన యువతి ఓ సంస్థలో కేటరర్ గా పని చేస్తోంది. శుక్రవారం సాయంత్రం పని ముగించుకుని ఇంటికి వస్తుండగా ఆమెతో పనిచేసే ఓ యువకుడు తనతో కొంచెం పని ఉందని.. మాట్లాడాలి అని చెప్పి ఆమెను ఇంటికి వెళ్లకుండా ఆపేశాడు. ఆ తర్వాత ఆమెకు ఏవో మాయమాటలు చెప్పి యువతిని తీసుకెళ్లి ఓ మురికివాడలోని చిన్న గదిలో బంధించాడు.
అనంతరం అతని స్నేహితులకు సమాచారం అందించాడు. అతని ఫోన్ కాల్ తో అక్కడికి చేరుకున్న స్నేహితులతో కలిసి నలుగురు వ్యక్తులు యువతిపై పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డారు. ఆ తర్వాత అక్కడి నుంచి పారిపోయారు. వెంటనే బాధితురాలు అక్కడినుంచి తప్పించుకుంది. జరిగిన ఘటనపై పోలీసులకు సమాచారం అందించింది. దీంతో అక్కడికి చేరుకున్న పోలీసులు ఆ యువతిని వైద్య పరీక్షల నిమిత్తం స్థానిక ఆసుపత్రికి తరలించారు. నిందితులపై ఐపీసీ సెక్షన్ 376 ప్రకారం కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. అయితే అత్యాచారానికి పాల్పడిందంతా మైనర్లే కావడం ఆందోళన కలిగించే విషయం.
ఇదిలా ఉండగా, ఆదివారం ఛత్తీస్ ఘఢ్ లో ఇలాంటి ఘటనే వెలుగుచూసింది. ఒంటరిగా సమీపంలోని దేవాలయానికి వెళ్లి వస్తున్న బాలికను కిడ్నాప్ చేసిన దుండగులు.. సామూహిక లైంగికదాడికి పాల్పడ్డారు. ఈ ఘటన ఛత్తీస్గఢ్ లో చోటుచేసుకుంది. గురువారం చోటుచేసుకున్న ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బాధితురాలి తల్లిదండ్రులు ఈ ఘటనపై పోలీసులను ఆశ్రయించడంతో నలుగురు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
Chhattisgarh లో చోటుచేసుకున్న ఈ లైంగికదాడది ఘటన గురించి పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. Bilaspur లో నివాసముంటున్న 13 సంవత్సరాల బాలిక ప్రతిరోజు గుడికి వెళ్లి వస్తుండేది. మద్యం సేవించి జులాయిగా తిరిగే నలుగురు వ్యక్తులు ఆమెను గమనించసాగారు. ఈ క్రమంలోనే గురువారం నాడు గుడికి వెళ్లి ఇంటికి తిరిగి వస్తున్న బాధిత బాలికను వెంబడించి.. ఆ నలుగురు నిందితులు కిడ్నాప్ చేశారు. అరవకుండ నోరు మూసి.. సమీపంలోని పొలానికి బలవంతంగా తీసుకెళ్లారు.
ఈ తర్వాత ఆ మైనర్ బాలికపై సామూహిక లైంగిక దాడికి పాల్పడ్డారు. అనంతరం అక్కడి నుంచి నిందితులు పారిపోయారు. చాలా సమయం వరకు బాదితురాలు అపస్మారక స్థితిలోనే ఉండిపోయింది. బాలిక ఇంటికి రాకపోవడంతో అప్పటికే ఆమె తల్లిదండ్రులు వెతకడం ప్రారంభించారు. ఈ క్రమంలోనే బాలికపడివున్న ప్రాంతానికి చేరుకున్నారు. నడవలేని స్థితిలో ఉన్న బాలిక ఒంటిపై తీవ్రమైన గాయాలు ఉన్నాయి. జరిగిన విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పడంతో వారు పోలీసుల ను ఆశ్రయించారు. కేసు నమోదుచేసుకన్న పోలీసులు.. నిందితులను పట్టుకున్నారు.