Asianet News TeluguAsianet News Telugu

నాడు యుద్ద స్థావరం.. నేడు విమానాశ్రయం .. లీలాబరి ఎయిర్‌ఫీల్డ్ చరిత్ర

Lilabari airfield: లీలాబరి ఎయిర్‌ఫీల్డ్ .. అస్సాంలోని ఉత్తర లఖింపూర్ జిల్లాలోని చిన్న ఎయిర్‌ఫీల్డ్. ఈశాన్య సరిహద్దు ఏజెన్సీ (NEFA)లోని లోతట్టు ప్రాంతంలో దీనిని ఏర్పాటు చేశారు. ప్రస్తుతం సాధారణ విమానాశ్రయంగా కొనసాగుతోంది. అయితే.. గతంలో భారతీయ వైమానిక దళానికి, కళింగ ఎయిర్‌వేస్, ఇండియన్ ఎయిర్‌లైన్స్ కు ఎంతో అనుబంధముందని IAF చరిత్రకారుడు అంచిత్ గుప్తా అంటున్నారు. ఈ సోర్టీ ఎంతో తెలుసుకుందాం.. 

The colourful history of Lilabari airfield KRJ
Author
First Published May 5, 2023, 10:23 PM IST

Lilabari airfield: భారతీయ వైమానిక దళానికి ఎంతగానో ఉపయుక్తంగా ఉన్న అస్సాం లీలాబరి ఎయిర్‌ఫీల్డ్ కు ప్రత్యేక చరిత్ర ఉందనే చెప్పాలి. అస్సాంలోని ఉత్తర లఖింపూర్ జిల్లాలోని భారత వాయుసేన చేత నిర్మించబడింది. అంతకంటే ముందు ఈ ప్రాంతం యుద్ద వేదికగా పేరుగావించింది. రెండవ ప్రపంచ యుద్ధం,బర్మా యుద్ద సమయంలో ఈ ప్రాంతం వైమానిక దళ (US/కామన్వెల్త్) స్దావరంగా ఉండేది.  ఈ యుద్ధానంతరం ఈ ప్రాంతాన్ని నవీకరించాలని భారత వాయుసేన భావించింది. వాయుసేన సిఫార్సుల మేరకు 1951లో అస్సాంలోని లీలాబరి ప్రాంతంలో ఎయిర్‌స్ట్రిప్‌లను నిర్మించాలని భారత ప్రభుత్వం నిర్ణయించింది. 

లీలాబరీలో విభిన్న వాతావరణం ఉండటం కూడా ఈ నిర్ణయం తీసుకోవడానికి కారణమైందని పలువురు భావిస్తారు. హిమాలయాలు,బ్రహ్మపుత్ర మధ్య ఉండే మైదాన ప్రాంతంలో  నిర్మితమైన ఈ ఎయిర్‌ఫీల్డ్ ఉత్తర లఖింపూర్ పట్టణానికి ఈశాన్యంగా 8 కి.మీ దూరంలో, సముద్ర మట్టానికి 101 మీటర్ల ఎత్తులో ఉంటుంది. The colourful history of Lilabari airfield KRJ

ఈ ఎయిర్‌ఫీల్డ్ ను 1953లో ఇండియన్ ఎయిర్‌లైన్స్ స్వాధీనం చేసుకుంది. కానీ, రన్‌వే సరిగా లేకపోవడం, ప్రతికూల వాతావరణం ఉండటంతో విమాన రాకపోకలకు అంతరాయం, అడ్డంకులు ఏర్పడేవి. దీంతో 1958లో పక్కా రన్‌వే నిర్మించాలని కేంద్రం నిర్ణయించింది. ఈ మేరకు పనులు నవీకరణ పనులు ప్రారంభం కాగా.. 1960 చివరిలో పూర్తయింది.

ఈ ఎయిర్‌ఫీల్డ్ అందుబాటులోకి రావడంతో అరుణాచల్‌ సైనికీకరణ (NEFA) ప్రక్రియ ప్రారంభమైంది.. అంటే అస్సాం రైఫిల్స్ ను వైమానిక దళంగా మార్చే అడుగులు పడ్డాయి. ఈ ప్రక్రియ రియర్ ఎయిర్‌ఫీల్డ్ సప్లై ఆర్గనైజేషన్ (RASO)తో ప్రారంభమైంది. ఈ క్రమంగా NEFA ద్వారా మానవరహిత అధునాతన ఆయుధాల సరఫరా ప్రారంభమైంది. అదే సమయంలో బ్రహ్మపుత్రకు ఉత్తరం, దక్షిణంగా రైలు అనుసంధానం చేయబడింది. ఈ ఎయిర్ పోర్టు సామర్థ్యం పెరగడంతో కేంద్రప్రభుత్వం 1960లో మూడు నుండి ఐదు సంవత్సరాల వరకు NEFA సప్లై డ్రాప్ కాంట్రాక్ట్‌తో కళింగ ఎయిర్‌వేస్ అప్పగించింది. అదే సమయంలో  IAF సరఫరా డ్రాప్ మిషన్‌లకు అనుబంధంగా ఉన్న 59 స్క్వాడ్రన్ , 49 స్క్వాడ్రన్‌లను జోర్హాట్‌కు తరలించింది.

The colourful history of Lilabari airfield KRJ

ఇదిలా ఉంటే.. 1962 భారత్ చైనా యుద్ద సమయంలో ఎదురైన అనుభవాలు అత్యున్నతమైన వైమానిక వ్యవస్థ ఏర్పాటుకు దారి తీశాయి. బ్రహ్మపుత్ర (దక్షిణ, తేజ్‌పూర్ మినహా)వెంబడి స్థావరాల నిర్మాణంపై IAF అనుకూలంగా స్పందించింది. జోర్హాట్ (1952), తేజ్‌పూర్ (1959), చబువా (1962), గౌహతి (1963), మోహన్‌బారి (1964)లలో స్థావరాలు ఏర్పాటు చేయబడ్డాయి. కానీ రెండు పరిణామాలు IAFకి లీలాబరీ ఎయిర్ ఫీల్డ్ అభివ్రుద్దికి దారితీశాయి. మొదటిది.. 1965లో కామెంగ్, సుబంసిరి , సియాంగ్ జిల్లాలకు సమీపంలో ఉత్తర లఖింపూర్‌లో నూతన భూ-ఆధారిత CPOను పరిపాలన సృష్టించింది. రెండవది 1966లో DGCA అన్ని విమానాలను లోడ్ చేయగల సామర్థ్యంతో కొత్త రన్‌వేను రూపొందించింది. తొలుత NEFA కాంట్రాక్ట్ ను కళింగ ఎయిర్‌లైన్స్‌కు ఇవ్వడంలో ప్రజల్లో వ్యతిరేకత వచ్చింది. ప్రజల ఒత్తిడి, పార్లమెంటులో తీవ్రమైన వాదనల మధ్య ప్రభుత్వం NEFA కాంట్రాక్ట్ ను భారత వైమానిక దళానికి ఇచ్చింది.

NEFAలో IAF వైమానిక దళ సామార్థ్యాన్ని పెంచే అవకాశం కోసం ఈస్టర్న్ ఎయిర్ కమాండ్ హెడ్‌క్వార్టర్స్ చూసింది. బ్రహ్మపుత్రకు ఉత్తరాన ఉన్న ఏకైక స్థావరాన్ని లీలాబరి నుండి నిర్వహించేందుకు IAFని అనుమతించాలని HQ ప్రభుత్వానికి సూచించింది. ఈ ప్రాంతాన్ని ప్రత్యేకంగా నిర్వహించేందుకు .. డకోటాను నిర్వహిస్తున్న 43 స్క్వాడ్రన్‌ను జోర్హాట్‌కు తరలించింది. లిలాబరి ఎయిర్ ఫీల్డ్ నుండి ఈస్టర్న్ ఎయిర్ కమాండ్ ను ఆపరేట్ చేయడం వల్ల సంవత్సరానికి 5,000 విమాన ప్రయాణ గంటలు ఆదా అవుతాయని, అలాగే.. బేస్ నెట్‌వర్క్‌ని విస్తరించడంలో సహాయపడుతుందని విశ్వసించింది. కానీ లిలాబరికి పరిమిత రహదారి సౌకర్యాలు ఉండటంతో పరిపాలనాపరమైన సవాళ్లు వచ్చాయి.

The colourful history of Lilabari airfield KRJ 

ఈ సవాళ్లను ఎదుర్కొవడానికి సరళమైన సరిహద్దు ఏర్పాటు చేశారు. విమానయాన కార్యకలాపాలకు అనుగుణంగా.. మెచుకా (తవాంగ్, వెస్ట్ కమెంగ్, ఈస్ట్ కమెంగ్, పక్కే కేసాంగ్, పౌపుమ్ పారే, కురుంగ్, క్రా దాడి, అప్పర్ సుబంసారి జిల్లాలు) పశ్చిమాన ఉన్న సరిహద్దు మండలాలకు లిలాబరి ఎయిర్ ఫీల్డ్ సేవలు ప్రారంభమయ్యాయి. అలాగే.. మోహన్‌బారి నుండి తూర్పున జోర్హాట్‌తో పలు ప్రాంతాలు వైమానిక శాశ్వత  స్థావరంగా మారాయి. ఈ క్రమంలో లిలాబరి ఎయిర్ ఫీల్డ్ లో 1800 మీటర్ల టార్మాక్ రన్‌వే , సివిలియన్ ఎయిర్-ట్రాఫిక్ కంట్రోలర్ (ఒక సివిల్ కంట్రోలర్), హై-ఫ్రీక్వెన్సీ రేడియో, నాన్-డైరెక్షనల్ బెకన్, ఒక చిన్న ట్రైలర్-టైప్ ఫైర్ ట్రాలీ, ఒక సివిల్ టెర్మినల్ ఏర్పాటు చేయబడ్డాయి. అలాగే..ఎయిర్‌ఫీల్డ్ వద్ద  3 విమానాలకు పార్కింగ్ వసతి కల్పించింది. యుద్దసమయంలో ప్రతి విమానం ఐదు సార్లు దాడి చేసి బేస్‌కు తిరిగి వస్తుంది. 

కానీ.. తరువాత  కొన్ని రోజుల తరువాత రెండు డకోటా విమానాలు లిలాబరీ ఎయిర్ పోర్టు సమీపంలో కూలిపోయాయి. ప్రతికూల వాతావరణ పరిస్థితులు, రక్షణ లేమి కారణంగా లిలాబరీ నుండి కార్యకలాపాలను నిలిపివేయాలని ఏప్రిల్ 1975 లో భారత వాయుసేన (IAF) సూచించింది. జోర్హాట్‌కు తిరిగి వెళ్లాలని నిర్ణయించుకుంది. దశలవారీగా డకోటాలు, వైమానిక స్థావరాలను పెంచడంలో కార్యాచరణ,ఆర్థిక సవాళ్లతో లిలాబరీ నుంచి విమానాలను ఆపరేట్ చేయడం భద్రతా సవాలుగా పరిగణించింది. 

సంవత్సరాలు గడిచేకొద్దీ రోడ్డు రవాణా గణనీయంగా మెరుగుపడింది. ఈ ప్రాంతంలో గతంలో కంటే.. వాయు రవాణా అవసరం గణనీయంగా తగ్గింది. లీలాబరి ఇప్పుడు సాధారణ పౌర విమానయాన కేంద్రంగా మారింది. 1960-90లలో ఈశాన్య ప్రాంతంలో పెద్ద సంఖ్యలో IAF సిబ్బంది  కోసం సేవలందించిన లిలాబరి ఎయిర్ ఫీల్డ్ చిరకాల జ్ఞాపకంగా మిగిలిపోయింది.  కలకత్తా-గుహతి-తేజ్‌పూర్-జోర్హాట్-లీలాబరి-మోహన్‌బరీని కలుపుతూ ఇండియన్ ఎయిర్‌లైన్స్ ఫోకర్ F-27 సర్వీస్‌తో అనుసంధానించబడింది.  

Follow Us:
Download App:
  • android
  • ios