మరో రెండు కులాలకు ఎస్టీ హోదా.. బిల్లును ఆమోదించిన రాజ్యసభ..
తమిళనాడు రాష్ట్రంలో ఉన్న నరికురవన్, కురివిక్కరన్ వర్గాలకు ఎస్టీ హోదా రానుంది. ఈ మేరకు రూపొందించిన బిల్లును రాజ్యసభ గురువారం ఆమోదించింది. ఈ బిల్లు త్వరలోనే రాష్ట్రపతి ఆమోదానికి వెళ్లనుంది.
తమిళనాడులోని నరికురవన్, కురివిక్కరన్ వర్గాలకు షెడ్యూల్డ్ తెగ హోదా కల్పించే బిల్లు కోసం ఆ రాష్ట్ర ప్రభుత్వం చేసిన ప్రయత్నాలు గురువారం రాజ్యసభలో విజయవంతమయ్యాయి. దీంతో మరో రెండు కులాలకు ఎస్టీ హోదా వచ్చినట్టైంది.
ఈ మేరకు గురువారం రాజ్యాంగ (షెడ్యూల్డ్ తెగల) ఆర్డర్ (రెండో సవరణ) బిల్లు- 2022 ను కేంద్ర గిరిజన వ్యవహారాల మంత్రి అర్జున్ ముండా రాజ్యసభలో ప్రవేశపెట్టారు. దీనిని సభ వాయిస్ ఓటు ద్వారా ఆమోదించింది. తమిళనాడు రాష్ట్రంలోని షెడ్యూల్డ్ తెగల (ఎస్టీ) జాబితాలో ఈ రెండు వర్గాలను చేర్చాలని ఆ రాష్ట్ర ప్రభుత్వం చేసిన సూచన ప్రకారం ఈ బిల్లు రూపుదిద్దుకుంది.
కీచక ప్రొఫెసర్.. విద్యార్థిని శారీర సంబంధం పెట్టుకోలేదని పరీక్షల్లో ఫెయిల్ చేశాడు..
ఈ బిల్లుపై రాజ్యసభలో మంత్రి ముండా మాట్లాడుతూ.. దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తరువాత కూడా కమ్యూనిటీలు తమ హక్కులను కోల్పోతున్నాయని అన్నారు. తమిళనాడుకు చెందిన మరికొన్ని కులాలను ఎస్టీ జాబితాలో చేర్చేందుకు అర్హత కలిగి ఉన్నాయని అన్నాడీఎంకెకు చెందిన ఎం తంబిదురై పేర్కొంటూ ఈ బిల్లుకు ఆయన మద్దతు తెలిపారు.
డ్రైనేజ్ పైపుల పని చేస్తుంటే కూలిన మట్టిపెళ్లలు.. ముగ్గురు వలస కూలీలు సజీవ సమాధి...
ఈ సందర్భంగా మరో ఎంపీ తిరుచి శివ మాట్లాడుతూ.. మత్స్యకారులను గిరిజన వర్గాల జాబితాలో చేర్చాల్సిన అవసరం ఉందని అన్నారు. అలాగే వామికి, వడుగ, కురుబా వంటి ఇతర వర్గాలను కూడా ఈ సమూహాలలో చేర్చాలని పేర్కొన్నారు. ‘‘ఏడు దశాబ్దాల స్వాతంత్ర్యం అనంతరం, గణతంత్ర రాజ్యంగా మారిన తరువాత, ఇప్పుడు మనం కొన్ని సమాజాలను తెగల పరిధిలోకి తీసుకురావాలనుకుంటున్నాము.’’ అని అన్నారు.
ఈ బిల్లుకు డీఎంకే నుంచి ఎస్.మహ్మద్ అబ్దుల్లా, బీజేపీ నుంచి కె.లక్ష్మణ్, వైసీపీ నుంచి రాయగా కృష్ణయ్య, డీఎంకే నుంచి కేఆర్ఎన్ రాజేశ్ కుమార్ కూడా మద్దతు తెలిపారు.