Asianet News TeluguAsianet News Telugu

అరెస్టు: రాత్రంతా ఎన్సీబీ లాకప్ లోనే రియా చక్రవర్తి

బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మృతితో సంబంధం ఉన్న డ్రగ్ కేసులో అరెస్టయిన నటి రియా చక్రవర్తి మంగళవారం రాత్రంతా ఎన్సీబీ లాకప్ లోనే గడిపారు. ఆమెను పది గంటలకు జైలుకు తరలిస్తారు.

Rhea Chakraborthy spends night in NCB lockup, to be sent to jail at 10am
Author
Mumbai, First Published Sep 9, 2020, 9:44 AM IST

ముంబై: బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ మృతికి సంబంధించిన మాదక ద్రవ్యాల కేసులో అరెస్టయిన నటి రియా చక్రవర్తి మంగళవారం రాత్రి అంతా నేషననల్ కంట్రోల్ బ్యూరో (ఎన్సీబీ) లాకప్ లోనే గడిపారు. మూడు రోజుల విచారణ తర్వాత రియాను ఎన్సీబీ అధికారులు మంగళవారం సాయంత్రం 3.30 గంటల తర్వాత అరెస్టు చేశారు. 

డ్రగ్స్ సిండికేట్ లో రియా చురుకైన సభ్యురాలని, సుశాంత్ సింగ్ కోసం డ్రగ్స్ కొనుగోలు చేసిందని ఎన్సీబీ ప్రకటించింది. రియాకు ముందు ఎన్సీబీ అధికారులు ఆమె సోదరుడు సౌవిక్ చక్రవర్తిని, సుశాంత్ హోం మేనేజర్ శామ్యూల్ మిరండాను, ఆయన ఇంటి పనిమనిషి దీపేశ్ సావంత్ ను అరెస్టు చేశారు. 

మూడు కేంద్ర సంస్థలు ఒంటరి మహిళను వేధిస్తున్నారని, డ్రగ్స్ కు వ్యసనానికి బానిసైన మానసిక రోజిని ప్రేమించినందుకు ప్రేమించినందుకు ఆ పని చేస్తున్నాయని రియా తరఫు న్యాయవాది సతీష్ మనేషిండే అన్నారు. 

అరెస్టు చేసిన తర్వాత రియాకు వైద్యపరీక్షలు నిర్వహించారు. కోవిడ్ పరీక్షలు చేయించారు. రియాను ఎన్డీపిఎస్ లోని 2ఏ, 21, 22,29, 28 సెక్షన్ల కింద అరెస్టు చేసినట్లు ఎన్సీబీ డిప్యూటీ డైరెక్టర్ కేపీఎస్ మల్హోత్రా ప్రకటించారు. రియాకు కోర్టు బెయిల్ ఇవ్వడానికి నిరాకరించింది. ఆమెకు ్ఈ నెల 22వ తేదీ వరకు కస్టడీ విధిస్తూ ఆదేశాలు జారీ చేసింది. ఆమెను బుధవారం 10 గంటలకు జైలుకు తరలించనున్నారు.

డ్రగ్స్ కు సంబంధించి ఆమె ఎన్సీబీ విచారణలో 25 మంది సినీ ప్రముఖల పేర్లను రియా వెల్లడించినట్లు తెలుస్తోంది. డ్రగ్స్ కేసులో విచారణ నిమిత్తం ఎన్సీబీ రియాను తమ కస్టడీకి కోరే అవకాశం ఉంది. రియా సూచనలతోనే తాను సుశాంత్ రాజ్ పుత్ కు డ్రగ్స్ సరఫరా చేసినట్లు సోవిక్ ఎన్సీబీ విచారణలో తెలిపాడు. 

కాగా, సుశాంత్ సింగ్ రాజ్ పుత్ తో కలిసి తాను గంజాయి దట్టించిన సిగరెట్లు తాగేదాన్నని రియా చక్రవర్తి నేషనల్ క్రైమ్ బ్యూరో (ఎన్ సీబీ) ముందు అంగీకరించింది. విచారణ సందర్భంగా ఆమె ఆ విషయాన్ని వెల్లడించింది. 

సుశాంత్ సింగ్ 2016 నంచి డ్రగ్స్ తీసుకుంటున్నాడని విచారణలో ఆమె చెప్పింది. రియా ఇంటి నుంచి స్వాధీనం చేసుకున్న ఎలక్ట్రానిక్ పరికరాల ద్వారా ఆ విషయాన్ని రాబట్టారు. రియా పాత మొబైల్ ఫోన్, ల్యాప్ టాప్, ట్యాబ్లెట్ ల ఫోరెన్సిక్ పరీక్షల్లో ఎన్ సీబీ పలు విషయాలు తెలిశాయి. 

రియా 2017, 2018, 2019ల్లో డ్రగ్స్ సర్కిల్ లో చాలా చురుగ్గా ఉన్నట్లు ఆమె ఇంటి నుంచి స్వాధీనం చేసుకున్న గాడ్జెట్స్ ద్వారా వెల్లడైంది. ఆ గాడ్జెట్స్ నుంచి దర్యాప్తు సంస్థలు మత్తుపదార్థాలకు సంబంధించిన పలు ఫొటోగ్రాప్ లను, వీడియోలను, వాట్సప్ సందేశాలను, ఎస్ఎంస్ లను రాబట్టారు. 

వీడియోల్లో, ఫొటోల్లో పలువురు బాలీవుడ్ ప్రముఖుల పేర్లు ఉన్నాయి. వారి గురించి ఎన్ సీబీ ఆరా తీస్తోంది. వారిని ఎన్ సీబీ అధికారులు విచారిస్తారా లేదా అనేది తెలియదు. 

కాగా, సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మృతి కేసులో డ్రగ్స్ కు సంబంధించి పలు అరెస్టులు జరుగుతాయని భావిస్తున్నారు. సుశాంత్ పని మనిషి నీరజ్ కు సంబంధించి రియా, సౌవిక్, శామ్యూల్ కొన్ని విషయాలు వెల్లడించారు. దాంతో నీరజ్ ను ప్రశ్నించాలని ఎన్ సీబీ అధికారులు భావిస్తు్నారు. సీఎ శ్రుతి మోడీకి కూడా సమన్లు జారీ చేసే అవకాశాలున్నట్లు చెబుతున్నారు. 

ఎన్ సీబీ అడిగిన పలు ప్రశ్నలకు సోమవారంనాటి విచారణలో సరైన సమాధానాలు ఇవ్వలేదు. డ్రగ్స్ ఇంటికే వచ్చేవా, డ్రగ్స్ కొనుగోలుకు ఎవరి డబ్బులు వాడేవారు, ముంబైలోని హోటల్లో సుశాంత్ డ్రగ్స్ తీసుకునేవాడా వంటి ప్రశ్నలకు ఆమె జవాబులు ఇవ్వలేదు. 

Follow Us:
Download App:
  • android
  • ios