పాక్ ఆక్రమిత కశ్మీర్‌లోని ఉగ్రవాద స్థావరాలను భారత సైన్యం ధ్వంసం చేసింది. ఆపరేషన్ సింధూర్ పేరిట జరిగిన ఈ దాడిలో 100కు పైగా ఉగ్రవాదులు మృతి చెందారు. ఈ దాడి నేపథ్యంలో చోటుచేసుకున్న టాప్ 10 పరిణామాలను ఇక్కడ చూద్దాం. 

Operation Sindoor : పాకిస్తాన్ తో పాటు పాక్ ఆక్రమిత కశ్మీర్‌లోని 9 ఉగ్ర స్థావరాలను భారత్ ధ్వంసం చేసింది. లష్కరే తొయిబా, జైషే మహమ్మద్, హిజ్బుల్ ముజాహిదీన్ లాంటి ఉగ్రవాద సంస్థల స్థావరాలపై భారత సైన్యం దాడి చేసింది. ఆపరేషన్ సింధూర్ పేరిట జరిగిన ఈ సైనిక చర్యలో 100+ మంది ఉగ్రవాదులు మరణించినట్లు సమాచారం. ఆపరేషన్ సింధూర్ కు సంబంధించి టాప్ 10 అప్డేట్స్ ఇవే.

1- జైషే మహమ్మద్ చీఫ్ మౌలానా మసూద్ అజార్ కుటుంబంలోని 10 మందితో పాటు నలుగురు సహచరులు ఆపరేషన్ సింధూర్‌లో మరణించినట్లు ధృవీకరించారు.

2- ఆపరేషన్ సింధూర్ తర్వాత తమ ప్రాంతంలో 26 మంది మరణించారని, 46 మంది గాయపడ్డారని పాకిస్తాన్ ఒప్పుకుంది.

3- నియంత్రణ రేఖ వద్ద పాకిస్తాన్ భారీ కాల్పులు జరిపింది. జమ్మూ కాశ్మీర్‌లో ముగ్గురు భారతీయులు మరణించారు.

4- పాకిస్తాన్ కాల్పుల్లో పుంచ్ జిల్లాలో ఒక మహిళ, ఆమె కూతురు గాయపడ్డారు.

5- ఆపరేషన్ సింధూర్ తర్వాత భారత్‌లో 200+ విమానాలు రద్దు చేయబడ్డాయి. శ్రీనగర్, లేహ్, అమృత్‌సర్, చండీగఢ్ లాంటి 18 విమానాశ్రయాలు తాత్కాలికంగా మూసివేయబడ్డాయి.

6- ఆపరేషన్ గురించి చర్చించడానికి ప్రభుత్వం మే 8న ఉదయం 11 గంటలకు సర్వపక్ష సమావేశం ఏర్పాటు చేసింది.

7- NSA అజిత్ దోవల్ పలు దేశాల జాతీయ భద్రతా సలహాదారులకు ఆపరేషన్ గురించి సమాచారం అందించారు.

8- అమెరికా పరిస్థితిని పర్యవేక్షిస్తోందని, శాంతియుత పరిష్కారం కోసం పిలుపునిచ్చిందని అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో అన్నారు.

9- ఆపరేషన్ తర్వాత కేంద్ర హోంమంత్రి అమిత్ షా జాతీయ భద్రతా సమావేశానికి అధ్యక్షత వహించారు.

10- భారత్-పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. రెండు దేశాల సైన్యాలు అప్రమత్తంగా ఉన్నాయి. భారత సైనిక విమానాలు శ్రీనగర్, కాశ్మీర్ లోయలో నిరంతరం గస్తీ తిరుగుతున్నాయి.