Asianet News TeluguAsianet News Telugu

ఇంట్లోకి చొరబడి భర్తను, పిల్లలను నిర్బంధించి మహిళపై గ్యాంగ్ రేప్

ఒడిశాలో ఘోరమైన సంఘటన జరిగింది. అర్థరాత్రి ముగ్గురు దుండగులు దౌర్జన్యంగా ఇంట్లోకి ప్రవేశించారు. భర్తను, ఇద్దరు పిల్లలను విపరీతంగా కొట్టారు. మహిళపై సామూహిక అత్యాచారం చేసి పారిపోయారు.

Odisha woman gangraped at home; husband, kids beaten up
Author
Kendrapara, First Published Jun 30, 2019, 8:34 AM IST

కటక్‌: ఒడిశాలో ఘోరమైన సంఘటన జరిగింది. అర్థరాత్రి ముగ్గురు దుండగులు దౌర్జన్యంగా ఇంట్లోకి ప్రవేశించారు. భర్తను, ఇద్దరు పిల్లలను విపరీతంగా కొట్టారు. మహిళపై సామూహిక అత్యాచారం చేసి పారిపోయారు.

ఆ సంఘటన ఒడిశా రాష్ట్రం కేంద్రపడ జిల్లా నికిరియా ప్రాంతంలో జరిగింది. నికిరియా ప్రాంతంలో దంపతులు తమ ఇద్దరు పిల్లలతో కలిసి ఓ ఇంట్లో నివాసం ఉంటున్నారు. శుక్రవారం అర్ధరాత్రి ముగ్గురు దుండగులు వారింటి తలుపు తట్టారు. 

తలుపులు తీయగానే సుకుంటూ లోనికి దౌర్జన్యంగా ప్రవేశించారు.  భర్త, పిల్లలపై ముగ్గురూ దాడి చేశారు. ఆ తర్వాత వారిని నిర్బంధించి మహిళపై సామూహిక అత్యాచారం చేసి పారిపోయారు. విషయం తెలుసుకున్న గ్రామస్థులు, గాయపడిన భర్త, పిల్లలను ఆసుపత్రికి తరలించారు.

Follow Us:
Download App:
  • android
  • ios