భారతదేశం 2025లో 79వ స్వాతంత్ర దినోత్సవాన్ని జరుపుకోబోతోంది. ఈ ఏడాది థీమ్ – ‘Honouring Freedom, Inspiring the Future’. ఇంతకీ ఈ థీమ్ ఎలాంటి సందేశాన్ని ఇస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం.
KNOW
స్వాతంత్ర దినోత్సవ ప్రాముఖ్యత
ఆగస్టు 15 భారతదేశ రాజకీయ చరిత్రలో అత్యంత కీలకమైన రోజు. 190 సంవత్సరాల బ్రిటిష్ వలస పాలన అనంతరం 1947 ఆగస్టు 15న స్వాతంత్రం సాధించింది. ఈ రోజు దేశవ్యాప్తంగా ఉత్సాహంగా, దేశభక్తితో వేడుకలు జరుపుకుంటారు.
ఎర్రకోట నుంచి ప్రధాన మంత్రి ప్రసంగం
ప్రతి సంవత్సరం న్యూఢిల్లీ ఎర్రకోట వద్ద ప్రధాన మంత్రి జాతీయ పతాకాన్ని ఎగరవేసి జాతిని ఉద్దేశించి ప్రసంగిస్తారు. ఈ సంప్రదాయాన్ని దేశపు తొలి ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ ప్రారంభించారు. 2025లో కూడా ఈ వేడుకలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రసంగం చేయనున్నారు.
థీమ్ 2025 – ‘Honouring Freedom, Inspiring the Future’
ప్రతి సంవత్సరం రక్షణ మంత్రిత్వ శాఖ, MyGov ప్లాట్ఫారమ్తో కలిసి స్వాతంత్ర దినోత్సవ థీమ్ను ప్రకటిస్తుంది. ఈ ఏడాది థీమ్ – ‘స్వేచ్ఛను గౌరవిద్దాం, భవిష్యత్తుకు ప్రేరణ ఇస్తాం’. ఇది త్యాగాలను స్మరించడంతో పాటు కొత్త తరాలకు ఉత్సాహాన్ని నింపేలా ఉంటుంది.
ఉగ్రవాదంపై సందేశం
పహల్గామ్లో తీవ్రవాదుల దాడులు, ఆ తర్వాత భారత్ ఆపరేషన్ సింధూర్ నిర్వహించడం వంటి నేపథ్యంలో ఈ స్వాతంత్ర దినోత్సవం మరింత ప్రాధాన్యం సంతరించుకుంది. ఈ సందర్భంలో ఉగ్రవాదానికి వ్యతిరేకంగా ప్రధాన మంత్రి స్పష్టమైన సందేశం ఇవ్వనున్నారని తెలుస్తోంది.
స్వేచ్ఛ గురించి పలువురు ప్రముఖులు చెప్పిన కొటేషన్స్
మార్టిన్ లూథర్ కింగ్ జూనియర్:
“పీడకుడు స్వేచ్ఛను స్వయంగా ఇవ్వడు; పీడితులు దానిని డిమాండ్ చేయాలి.”
మహాత్మా గాంధీ:
“తప్పు చేసే స్వేచ్ఛ లేకపోతే ఆ స్వేచ్ఛకు విలువ లేదు.”
బాబ్ మార్లే:
“జీవితాంతం ఖైదీగా ఉండే కంటే, స్వేచ్ఛ కోసం పోరాడుతూ మరణించడం మేలు.”
దలైలామా:
“ఎంత బలంగా వినియోగించినా క్రూరశక్తి మనిషి స్వేచ్ఛా ప్రవృత్తిని అణిచివేయదు.”
నోమ్ చోమ్స్కీ:
“స్వేచ్ఛకు సహజప్రవృత్తి ఉందని నమ్మితే, మార్పు సాధించే అవకాశాలు ఉంటాయి. మెరుగైన ప్రపంచం నిర్మించడానికి మీరు సహకరించే అవకాశం కూడా ఉంటుంది.”
