MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Business
  • 8th pay commission: ఉద్యోగులకు పండగలాంటి వార్త.. రూ. 18 వేలున్న కనీస జీతం ఎంత కానుందో తెలుసా.?

8th pay commission: ఉద్యోగులకు పండగలాంటి వార్త.. రూ. 18 వేలున్న కనీస జీతం ఎంత కానుందో తెలుసా.?

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల జీతాల సవరణ కోసం 8వ వేతన సంఘం 2027లో అమలులోకి రానున్న విష‌యం తెలిసిందే. జీతాల పెరుగుద‌ల‌కు సంబంధించిన ఇప్ప‌టి వ‌ర‌కు అధికారిక ప్ర‌క‌ట‌న మాత్రం రాలేదు. అయితే ఆగ‌స్టు 15న ప్ర‌క‌ట‌న వ‌చ్చే అవ‌కాశం ఉంది. 

1 Min read
Narender Vaitla
Published : Aug 05 2025, 12:46 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
వేతన పెంపుపై తాజా అంచనాలు
Image Credit : ChatGpt AI/Adobe stock

వేతన పెంపుపై తాజా అంచనాలు

8వ వేతన కమిషన్ కింద సుమారు 50 లక్షల కేంద్ర ఉద్యోగులు, 65 లక్షల పెన్షనర్లకు వేతనాలు పెరగనున్నాయి. కనీస ప్రాథమిక వేతనం రూ.18,000 నుంచి నేరుగా రూ.51,000కి పెరుగుతుందని ఆశలు పెట్టుకున్నారు. కానీ తాజా అంచనాల ప్రకారం కనీస ప్రాథమిక వేతనం రూ.30,000 వరకు మాత్రమే పెరగవచ్చని తెలుస్తోంది. సగటు వేతన పెంపు 13% ఉండవచ్చని అంచనా వేస్తున్నారు.

DID YOU
KNOW
?
ఫిట్‌మెంట్ ఫ్యాక్ట‌ర్
8వ పే కమిషన్ ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్ 2.86 ఉంటే, కనీస జీతం రూ.18,000 నుంచి రూ.51,480కి పెరగవచ్చు. పెన్షన్ రూ.9,000 నుంచి రూ.25,740కి పెరుగుతుంది.
25
ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్‌లో మార్పు
Image Credit : Getty

ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్‌లో మార్పు

వేతన పెంపులో కీలకమైన అంశం ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్. 7వ వేతన కమిషన్‌లో ఇది 2.57గా ఉండేది. 8వ కమిషన్‌లో ఇది 1.8గా ఉండవచ్చని కోటక్ ఈక్విటీస్ నివేదిక చెబుతోంది. దీని వల్ల వేతనాల్లో పెద్దగా పెరుగుదల ఉండదనే అభిప్రాయాలు వ్య‌క్త‌మ‌తవుతున్నాయి.

Related Articles

Related image1
Smart TV: అస‌లు ధ‌ర రూ. 48 వేలు డిస్కౌంట్‌లో రూ. 18 వేలు.. 43 ఇంచెస్ టీవీపై భారీ ఆఫ‌ర్
Related image2
హైదరాబాదీలు జర పైలం... ఈరోజు కూడా భారీ వర్షం. ఈ సమయంలో బయటకు రాకండి.
35
అమలు టైమ్‌లైన్
Image Credit : Gemini AI

అమలు టైమ్‌లైన్

ప్రభుత్వం 2025 జనవరిలో కమిషన్ ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించింది. కానీ Terms of Reference (ToR) ఇంకా ఖరారు కాలేదు. సభ్యుల నియామకం కూడా జరగలేదు. నివేదిక సమర్పణకు సుమారు 1.5 ఏళ్లు పడవచ్చు. ఆమోదం, అమలు కలిపి మరో 3–9 నెలలు పట్టే అవకాశం ఉంది. ఫలితంగా 2026 చివర్లో లేదా 2027 ప్రారంభంలోనే కొత్త వేతనాలు అమల్లోకి వచ్చే అవకాశం ఉంది.

45
ప్ర‌భుత్వంపై ఎంత భారం ప‌డ‌నుంది.?
Image Credit : our own

ప్ర‌భుత్వంపై ఎంత భారం ప‌డ‌నుంది.?

8వ వేతన కమిషన్ అమలు వల్ల ప్రభుత్వంపై రూ.2.4 లక్షల కోట్లు నుంచి రూ.3.2 లక్షల కోట్లు వరకు భారం పడవచ్చు. ఇది దేశ జీడీపీ లో 0.6%–0.8% వరకు ఉంటుంది. ముఖ్యంగా గ్రేడ్-సి ఉద్యోగులు (మొత్తం కేంద్ర ఉద్యోగుల్లో 90%) ఎక్కువ లాభం పొందుతారు.

55
ఆర్థిక ప్రభావం
Image Credit : our own

ఆర్థిక ప్రభావం

వేతనాలు పెరగడం వల్ల వినియోగ వస్తువులు, ఆటోలు, గృహోపకరణాలపై ఖర్చులు పెరగవచ్చు. జాతీయ పొదుపులు పెరిగే అవకాశం ఉంది. స్టాక్ మార్కెట్, బ్యాంకు డిపాజిట్లు, ఇతర ఆస్తుల్లో పెట్టుబడులు కూడా పెరిగే అవకాశం ఉంది.

About the Author

NV
Narender Vaitla
నరేందర్ వైట్లకు ప్రింట్‌, డిజిటల్ మీడియాలో 8 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రస్తుతం ఏసియా నెట్ న్యూస్ తెలుగులో సీనియర్ సబ్ ఎడిటర్‌గా సేవందిస్తున్నారు. 2015లో సాక్షి దినపత్రిక ద్వారా జర్నలిజంలోకి అడుగుపెట్టారు. అనంతరం 2019లో ఈనాడు డిజిటల్‌ విభాగంలో సబ్‌ ఎడిటర్‌గా, 2020లో టీవీ9 తెలుగులో (డిజిటల్‌) సీనియర్‌ సబ్‌ ఎడిటర్‌గా పని చేశారు. లైఫ్‌స్టైల్‌, టెక్నాలజీ, హ్యుమన్‌ ఇంట్రెస్ట్‌ వంటి తదితర విభాగాలకు చెందిన వార్తలు రాస్తుంటారు.
వ్యాపారం
పర్సనల్ పైనాన్స్
ఉద్యోగాలు, కెరీర్

Latest Videos
Recommended Stories
Related Stories
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2025 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved