కాళ్లు, చేతులు కట్టేసి 14 ఏళ్ల బాలికపై గ్యాంగ్ రేప్.. ఇద్దరు అరెస్టు: అసోం పోలీసులు
అసోంలో మైనర్ బాలికపై గ్యాంగ్ రేప్ జరిగింది. 14 ఏళ్ల బాలికను కాళ్లు, చేతులు కట్టేసి సామూహిక అత్యాచారం చేశారు. ఆ ఇద్దరు నిందితులను గుర్తించారు. వారిని అరెస్టు చేసినట్టు అసోం పోలీసులు వివరించారు.
న్యూఢిల్లీ: అసోంలో దారుణం జరిగింది. ఓ మైనర్ బాలిక పై ఇద్దరు దుండగులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఫిబ్రవరి 3వ తేదీ నుంచి కనిపించకుండా పోయిన ఆ బాలిక అపస్మారక స్థితిలో దిబ్రుగడ్లో కనిపించింది. ఈ మేరకు పోలీసులు ఆదివారం వెల్లడించారు.
దిబ్రుగడ్ ఎస్పీ శ్వేతాంక్ మిశ్రా విలేకరులతో మాట్లాడుతూ ఈ కేసుకు సంబంధించి ఇద్దరు నిందితులను అరెస్టు చేసినట్టు వివరించారు. భాయ్జాన్ అలీ, సఫర్ అలీలుగా నిందితులను గుర్తించినట్టు చెప్పారు.
‘14 ఏళ్ల బాలికను ఇద్దరు దుండగులు గ్యాంగ్ రేప్ చేశారు. ఆ ఇద్దరు నిందితులను భాయ్జాన్ అలీ, సఫర్ అలీలుగా గుర్తించాం. ఆ ఇద్దరినీ అరెస్టు చేశాం. మైనర్ బాలిక అతాబారీ టీ గార్డెన్ దగ్గర అపస్మారక స్థితిలో లభించింది’ అని వివరించారు.
నిందితులను పోక్సో యాక్ట్లోని సెక్షన్ 376 కింద విచారిస్తామని ఎస్పీ వివరించారు. ‘ఆమె రెండు చేతులు, కాళ్లను తాళ్లతో కట్టేశారు. ఆమెను గ్యాంగ్ రేప్ చేసినట్టు అనుమానిస్తున్నాం. ఆమె ఫిబ్రవరి 3వ తేదీ నుంచి కనిపించడం లేదు. పోక్సో యాక్ట్ 2012లోని సెక్షన్ 376 కింద నిందితులను విచారిస్తాం’ అని వివరించారు.