ఢిల్లీలో దారుణం : ఆటో ఎక్కిన యువతిపై గ్యాంగ్ రేప్..! డ్రైవర్ అరెస్ట్ !!
ఈ దారుణ ఘటన ఢిల్లీలో చోటు చేసుకుంది. పట్టపగలు పనికోసం బైటికి వచ్చి ఆటో ఎక్కిన యువతిపై సామూహిక అత్యాచారం జరగడంతో తీవ్రభయాందోళనలు నెలకొన్నాయి. బాధితురాలు ఫిర్యాదులో తెలిపిన వివరాల ప్రకారం... యూపీలోని కు చెందిన ఆమె పని నిమిత్తం ఢిల్లీ వచ్చింది.
న్యూ ఢిల్లీ : మహిళల రక్షణ (Women Protection) కోసం ఎన్ని చట్టాలు తీసుకొస్తున్న వారిపై జరుగుతున్న అఘాయిత్యాలు (Molestation) మాత్రం ఆగడం లేదు. తాజాగా ఆటో ఎక్కిన యువతిపై డ్రైవర్ తో సహా ముగ్గురు వ్యక్తులు సామూహిక లైంగికదాడికి (Gang Rape) పాల్పడటం కలకలం రేపింది.
ఈ దారుణ ఘటన ఢిల్లీలో చోటు చేసుకుంది. పట్టపగలు పనికోసం బైటికి వచ్చి ఆటో ఎక్కిన యువతిపై సామూహిక అత్యాచారం జరగడంతో తీవ్రభయాందోళనలు నెలకొన్నాయి. బాధితురాలు ఫిర్యాదులో తెలిపిన వివరాల ప్రకారం... యూపీలోని కు చెందిన ఆమె పని నిమిత్తం ఢిల్లీ వచ్చింది.
pandora papers leak: సీబీడీటీతో విచారణకు కేంద్రం ఆదేశం
శనివారం ఉదయం కశ్మీరీ గేట్ కు వెళ్లేందుకు ఖజురిఖాస్లో 27 యేళ్ల ఆ మహిళ ఐటిఓ ప్రాంతంలో ఆటో ఎక్కింది. అయితే ఆ సమయంలో ఆటోడ్రైవర్ మహిళ చెప్పిన ప్రదేశానికి కాకుండా యమునా బ్రిడ్జ్ సమీపంలోని ఓ రూమ్కు తీసుకెళ్లి అక్కడ అతనితో పాటు మరో ముగ్గురు తనపై సామూహిక లైంగిక దాడికి పాల్పడ్డారని తెలిపింది.
ఆ తరువాత తనని ఆటోడ్రైవర్ కశ్మీరీ గేట్ వద్ద వదిలేసి పరారైనట్లు ఫిర్యాదులో పేర్కొంది. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఆటోడ్రైవర్ ను అరెస్టు చేయగా మిగిలిన నిందితుల కోసం పోలీసులు గాలిస్తున్నారు. బాధితురాలిని వైద్య పరీక్షల నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.