కారుణ్య నియామకం హక్కు కాదు.. ఒక రాయితీ మాత్రమే - సుప్రీంకోర్టు
కారుణ నియామకం హక్కు కాదని సుప్రీంకోర్టు పేర్కొంది. ఆకస్మాత్తుగా చనిపోయిన ఉద్యోగి కుటుంబానికి ఆర్థిక భరోసా కల్పించేందుకే ఈ నియామకాలని తెలిపింది.
కారుణ్య ప్రాతిపదికన నియామకం అనేది హక్కు కాదని, ఒక రాయితీ మాత్రమే అని సుప్రీంకోర్టు చెప్పింది. ఈ కారుణ్య నియామకాల లక్ష్యం బాధిత కుటుంబాన్ని ఆకస్మిక ఆర్థిక సంక్షోభం నుంచి గట్టెక్కించడం మాత్రమే అని తెలిపింది. ఫర్టిలైజర్స్ అండ్ కెమికల్స్ ట్రావెన్కోర్ లిమిటెడ్, ఇతరులను కారుణ్య ప్రాతిపదికన నియమించేందుకు ఒక మహిళ కేసును పరిగణనలోకి తీసుకోవాలని సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పును ధృవీకరించిన కేరళ హైకోర్టు డివిజన్ బెంచ్ తీర్పును సుప్రీంకోర్టు గత వారం పక్కన పెట్టింది.
దుర్గాపూజను చూసి ఇంటికి తిరిగివస్తున్న మైనర్పై సామూహిక అత్యాచారం
మహిళ తండ్రి ఫెర్టిలైజర్స్ అండ్ కెమికల్స్ ట్రావెన్కోర్ లిమిటెడ్లో ఉద్యోగం చేస్తున్నాడని, 1995 ఏప్రిల్లో విధుల్లో ఉండగా మరణించాడని జస్టిస్లు ఎంఆర్ షా, కృష్ణ మురారిలతో కూడిన ధర్మాసనం పేర్కొంది. ఆయన మరణించే సమయంలో, అతని భార్య సేవ చేస్తున్నందున కారుణ్య ప్రాతిపదికన నియామకానికి అర్హత లేదని పేర్కొంది. ‘‘ ఉద్యోగి మరణించినప్పటి నుండి 24 సంవత్సరాల వ్యవధి తరువాత, ప్రతివాది కారుణ్య ప్రాతిపదికన నియామకానికి అర్హులు కాదు’’ అని బెంచ్ పేర్కొంది.
తెరవెనుకగా బీజేపీకి పనిచేస్తున్న ప్రశాంత్ కిషోర్: జేడీ(యూ)
ఉద్యోగి 1995లో మరణించినప్పుడు, అతడి కుమార్తె మైనర్ అని సుప్రీంకోర్టు పేర్కొంది. మెజారిటీ వయస్సు వచ్చిన తర్వాత, ఆమె కారుణ్య ప్రాతిపదికన నియామకం కోసం దరఖాస్తు చేసిందని తెలిపింది. అయితే ఉద్యోగి మరణించిన సుమారు 14 సంవత్సరాల తరువాత, అతడి కుమార్తె కారుణ్య ప్రాతిపదికన అపాయింట్మెంట్ కోసం దరఖాస్తును సమర్పించిందని చెప్పింది. అత్యున్నత న్యాయస్థానం గతంలో తాను ఇచ్చిన తీర్పులను ప్రస్తావిస్తూ.. ధర్మాసనం నిర్దేశించిన చట్టం ప్రకారం, కారుణ్య నియామకం అనేది పబ్లిక్ సర్వీసెస్లో సాధారణ నియమావళికి మినహాయింపు అని, కట్టుబట్టలతో మరణించిన అతడి కుటుంబానికి ఆధారంగా ఉంటుందని తెలిపింది.
తెలంగాణకు ఒక్క మెడికల్ కాలేజీ ఇవ్వని కేంద్రం: బీజేపీ సర్కారుపై హరీశ్ రావు ఫైర్
అలాంటి సందర్భాలలో స్వచ్ఛమైన మానవతా దృక్పథంతో ఆ కుటుంబ నుంచి అర్హులైన ఒకరికి లాభదాయకమైన ఉపాధిని అందించాలని నియామాలు ఉన్నాయని కోర్టు పేర్కొంది. కాగా.. కారుణ్య ప్రాతిపదికన నియామకంపై సర్వోన్నత న్యాయస్థానం నిర్దేశించిన చట్టం, రాజ్యాంగంలోని ఆర్టికల్ 14, 16 ప్రకారం అన్ని ప్రభుత్వ ఖాళీలకు సమాన అవకాశం కల్పించాల్సి ఉంటుంది. రాజ్యాంగంలోని ఆర్టికల్ ఈ 14 చట్టం ముందు సమానత్వం, ఆర్టికల్ 16 ప్రభుత్వ ఉద్యోగ విషయాలలో సమాన అవకాశాలను తెలియజేస్తుంది.