Asianet News TeluguAsianet News Telugu

మూఢ నమ్మకానికి పసికందు బలి.. న్యూమోనియా సోకిందని 51 సార్లు కడుపుపై వేడి ఇనుప రాడ్ తో పొడవడంతో చిన్నారి మృతి..

మధ్యప్రదేశ్ లో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. న్యుమోనియాకు ట్రీట్ మెంట్ చేసే నెపంతో ఓ తాంత్రికుడు పసి పాప కడుపుపై వేడి ఇనుప రాడ్ తో పొడిచాడు. దీంతో బాలిక మరణించింది. 

A three-month-old baby died after being hit with a hot iron rod on her stomach 51 times because of pneumonia.
Author
First Published Feb 4, 2023, 9:17 AM IST

దేశం అనేక రంగాల్లో ఎంతో అభివృద్ధి చెందుతున్నా.. ఇంకా కొన్ని విషయాల్లో వెనకబడే ఉంది. ముఖ్యంగా మూఢ విశ్వాసాలను పారదోలడంలో వెనకబడే ఉన్నామని పలు సందర్భాల్లో నిరూపితమవుతూనే ఉంది. తాజాగా మధ్యప్రదేశ్ లో వెలుగులోకి వచ్చిన ఓ ఘటన ఇంకా మన మెదళ్లలో ఈ అంద విశ్వాసాలు పాతుకుపోయే ఉన్నాయని నిరూపిస్తోంది. వైద్య రంగంలో పెను మార్పులు సంభవించి, ఆధునిక చికిత్స అనేక మందికి అందుబాటులోకి వచ్చిన ఈ తరుణంలో కూడా మూఢ నమ్మకానికి ఓ పసికందు బలైంది. 

బాలికను ఇంటికి పిలిచి, సింధూరందిద్ది, తాళి కట్టాడు.. పెళ్లైపోయిందంటూ అత్యాచారం... ఓ మైనర్ బరితెగింపు...

న్యుమోనియాతో బాధపడుతున్న మూడు నెలల చిన్నారికి వ్యాధిని నయం చేయడానికి ఓ తాంత్రికుడు చికిత్స పేరుతో కడుపుపై వేడి ఇనుప రాడ్ తో పొడిచాడు. ఇలా ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 51 సార్లు ఇలాగే చేశాడు. దీంతో ఆ చిన్నారి చనిపోయింది. ఈ ఘటన మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని గిరిజనులు అధికంగా షాదోల్ జిల్లాలో చోటు చేసుకుంది.

సింగ్‌పూర్ కథౌటియా గ్రామానికి చెందిన రుచితా కోల్ అనే మూడు నెలల నవజాత శిశువు కొన్ని రోజులుగా శ్వాసకోష సంబంధిత వ్యాధి అయిన న్యూమోనియాతో బాధపడుతోంది. అయితే ఆ చిన్నారి తల్లిదండ్రులు చికిత్స కోసం డాక్టర్లను సంప్రదించకుండా.. మూఢనమ్మకంతో ఓ తాంత్రికుడు ఆశ్రయించారు. అతడు చికిత్స పేరుతో ఓ విచిత్ర పనికి పూనుకున్నాడు. ఓ ఇనుప రాడ్ ను తీసుకొని, అది ఎర్రగా మారేంత వరకు అగ్నిలో వేడి చేశాడు. తరువాత దానితో ఆ పాప కడుపుపై 51 సార్లు పొడిచాడు.

అనుమానంతో భార్యను చంపి, పట్టుబడకుండా ఉండాలని గుంతతవ్వి పూడ్చి.. సమాధిమీద మొక్కలు పెంచిన భర్త.. చివరికి..

దీంతో బాలిక శరీరానికి గాయాలు అయ్యాయి. తరువాత తేరుకున్న కుటుంబ సభ్యులు షాడోల్ లోని గవర్నమెంట్ మెడికల్ కాలేజీలో చేర్పించారు. అయితే అప్పటికే బాలిక పరిస్థితి విషమించింది. అప్పటి నుంచి చికిత్స పొందుతున్న బాలిక 15 రోజుల తరువాత హాస్పిటల్ మరణించింది. ఈ ఘటనపై ఆ జిల్లా కలెక్టర్ వందనా వైద్ మాట్లాడుతూ.. ‘‘న్యుమోనియాతో బాధపడుతున్న ఓ బాలికకు ఓ తాంత్రికుడు చికిత్స చేసే నెపంతో వేడి రాడ్ తో కాల్చాడు. దీంతో ఆమె పరిస్థితి క్షీణించింది.’’ అని తెలిపారు. స్థానిక అంగన్‌వాడీ కార్యకర్త ఆమె తల్లికి కౌన్సెలింగ్ చేసి, ఇనుపరాడ్ తో చికిత్స చేయించుకోవద్దని అభ్యర్థించారని తెలిపారు. 

బాబోయ్.. గురువును చంపి రక్తం తాగాడు.. క్షుద్రశక్తుల కోసం ఓ మంత్రగాడి ఘాతుకం..

కాగా.. మధ్యప్రదేశ్‌లోని అనేక గిరిజన ప్రాబల్య ప్రాంతాలలో న్యుమోనియాకు చికిత్స చేయడానికి ఇలా వేడి ఇనుప రాడ్ తో పొడిపించుకోవడం సర్వసాధారణం. ఈ ఘటనపై బీజేపీ అధికార ప్రతినిధి డాక్టర్ హితేష్ వాజ్‌పేయి మాట్లాడుతూ.. ‘‘ ఇలాంటి పద్ధతులు ఇప్పటికీ ప్రబలంగా ఉన్నాయి. తాజాగా ఘటనపై కేసు నమోదు చేసి, కఠిన చర్యలు తీసుకోవాలని నేను ఆ ప్రాంత చీఫ్ మెడికల్ ఆఫీసర్‌ను అభ్యర్థిస్తున్నాను’’ అని బీజేపీ అధికార ప్రతినిధి డాక్టర్ హితేష్ వాజ్‌పేయి అన్నారు.

Follow Us:
Download App:
  • android
  • ios