Asianet News TeluguAsianet News Telugu

బాలికను ఇంటికి పిలిచి, సింధూరందిద్ది, తాళి కట్టాడు.. పెళ్లైపోయిందంటూ అత్యాచారం... ఓ మైనర్ బరితెగింపు...

ఓ మైనర్ బాలుడు, తనతో పరిచయం ఉన్న మైనర్ బాలిక మెడలో పసుపుతాడు కట్టి, అత్యాచారానికి పాల్పడ్డాడు. విషయం తెలియడంతో పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నారు. 

boy married girl secretly and attempted rape in madhya pradesh - bsb
Author
First Published Feb 4, 2023, 8:39 AM IST

మధ్యప్రదేశ్ : ఓ బాలుడు  తనతో స్నేహం చేసిన బాలికను ఇంటికి పిలిచి తాళి కట్టాడు. ఆ తర్వాత ఆమె మీద అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ షాకింగ్ ఘటన మధ్యప్రదేశ్లో చోటుచేసుకుంది. దీనికి సంబంధించిన వివరాల్లోకి వెళితే..  పదో తరగతి చదువుతున్న ఓ బాలిక తన ఇంటికి దగ్గర్లో ఉన్న.. తన ఏజ్ గ్రూపులో ఉన్న బాలుడితో స్నేహం చేసింది. అతనితో గంటల తరబడి ఫోన్లో మాట్లాడుతుండేది. తెలిసి తెలియని వయసు, టీనేజీ ఉడుకు రక్తం.. తాను చేస్తున్న పని ఎక్కడికి దారితీస్తుందో ఊహించనీయలేదు. దాంతో వారిద్దరి మధ్య కాస్త చనువు ఎక్కువగానే ఏర్పడింది.

ఈ చనువుతోనే ఒకరోజు బాలిక, బాలుడి ఇంటికి వెళ్ళింది. ఫోన్లో గంటల తరబడి మాట్లాడుకున్న తర్వాత ఇద్దరు ఏకాంతంగా కలవడంతో.. బాలుడు అడ్వాంటేజ్ తీసుకోవాలనుకున్నాడు.  దీనికోసం బాలికను నమ్మించాలని.. ఆమె నుదుటన సింధూరం దిద్ది మెడలో పసుపు తాడు కట్టాడు. ఇక మనిద్దరికీ పెళ్లి అయిపోయింది.. నువ్వు నా భార్యవు.. అంటూ ఆమె మీద అత్యాచారం చేశాడు. ఇది జరిగిన చాలా రోజుల తర్వాత బాలిక ఆ విషయాన్ని తన అమ్మమ్మకు చెప్పుకొచ్చింది.  ఆమె తన అల్లుడికి విషయం చెప్పడంతో..  బాలిక తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

తననుంచి విడిగా ఉంటోందని.. నడివీధిలో భార్యను రాడ్డుతో మోది దారుణ హత్య.. ఓ భర్త ఘాతుకం..

ఈ షాకింగ్ ఘటన మధ్యప్రదేశ్లోని ఇండోర్కు సమీపంలోని ఓ గ్రామంలో జరిగింది. పదవ తరగతి చదువుతున్న పదహారేళ్ల మైనర్ బాలిక.. తన ఇంటికి దగ్గరలోనే ఉండే 17 ఏళ్ల ఓ అబ్బాయితో పరిచయం పెంచుకొని, స్నేహం చేసింది. ఈ క్రమంలో వీరిద్దరూ రోజు ఫోన్లో గంటల తరబడి మాట్లాడుకునేవారు. అలా ఆ పరిచయంతో నిరుడు ఫిబ్రవరిలో ఓ రోజు అతని ఇంటికి వెళ్ళింది. ఆ సమయంలో బాలుడి ఇంట్లో ఎవరూ లేరు. ఇది అడ్వాంటేజ్ గా తీసుకున్న బాలుడు.. ఆమె  నుదుటిన సింధూరం దిద్ది, మెడలో పసుపు తాడు కట్టేశాడు. 

ఆ తర్వాత మనిద్దరికీ పెళ్లి అయిపోయింది అని చెప్పాడు. ఇప్పుడు మనిద్దరం భార్యాభర్తల అయినట్టే అంటూ ఆమె మీద అత్యాచారానికి పాల్పడ్డాడు. అయితే తాము ఇంకా మైనర్లే కాబట్టి విషయం ఎవరికీ చెప్పొద్దని చెప్పాడు. ఆ తర్వాత కూడా పదేపదే ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ క్రమంలో ఇటీవల ఓ సందర్భంలో తన అమ్మమ్మతో మాట్లాడుతూ బాలిక తనకు పెళ్లి అయిపోయింది అని చెప్పింది. ఇంకా చదువుకుంటున్న ఆ బాలిక చెప్పిన మాటలకు అమ్మమ్మ షాక్ అయింది.  

వెంటనే ఆమెను అనునయించి విషయం మొత్తాన్ని తెలుసుకుంది.  ఆ విషయాలన్నీ కుటుంబ సభ్యులకు తెలియజేసింది. అది విని షాక్ అయినా కుటుంబ సభ్యులు వెంటనే పోలీసులను ఆశ్రయించారు.  బాలిక తండ్రి ఫిర్యాదు మేరకు పోలీసులు సదరు మైనర్ బాలుడి మీద ఫోక్సొ చట్టం కింద కేసు నమోదు చేసి.. అతడిని అదుపులోకి తీసుకున్నారు. అయితే నిందితుడైన బాలుడు కూడా మైనర్ కావడంతో జువైనల్ హోమ్ కు తరలించారు. 

Follow Us:
Download App:
  • android
  • ios