90 వసంతాల భారత వైమానిక దళం.. యుద్దరంగంలో దిగితే.. వీరోచిత పోరాాటమే.. ఎయిర్ఫోర్స్ బలాబలాలు
యుద్ధ సమయాల్లో తక్షణమే రంగంలోకి దిగి దేశాన్ని కాపాడే ఇండియన్ ఎయిర్ఫోర్స్ 90వ వార్షికోత్సవాన్ని ఘనంగా జరుపుకుంటోంది. భారత గగనతలాన్ని కంటికి రెప్పలా కాపలా కాస్తోన్న వైమానిక దళాన్ని 1932 అక్టోబర్ 8న ఏర్పడింది. గత 90 ఏళ్లలో భారత వైమానిక దళం ఎన్నో ఎన్నో మైలు రాళ్లను దాటుకుంటూ ప్రస్తుతం ప్రపంచంలో అమెరికా, చైనా, రష్యా తర్వాత నాల్గవ అతిపెద్ద వైమానిక దళంగా అవతరించింది.
భారత రక్షణ రంగంలోని త్రివిధ దళాల్లో ప్రతి దళం ప్రత్యేకమే. వాటి సేవలు అమోఘం, అనిర్వచనీయం. రక్షణ రంగంలో కీలక పాత్ర పోషిస్తున్న వైమానిక దళానికి కాస్త ప్రత్యేక స్థానం ఉందనే చెప్పాలి. ప్రస్తుతం వైమానిక దళంలో 1.70 లక్షల మంది సిబ్బంది ఉన్నారు. ఈ దళంలో 1300పైగా యుద్ధ విమానాలు, ఐదు ఆపరేషనల్ కమాండింగ్ కేంద్రాలు, 1,130 కంబాట్, 1,700 నాన్- కంబాట్ ఎయిర్క్రాఫ్ట్లు ఉన్నాయి.
స్వాతంత్య్రానికి పూర్వం 1932 అక్టోబరు 8న ఏర్పడిన వైమానిక దళం బ్రిటన్ తరుపున రెండో ప్రపంచ యుద్ధంలో పాల్గొని వీరోచతంగా పోరాటం చేసింది. స్వాతంత్రం అనంతరం 'భారత వైమానిక దళంగా మారింది. నేటీలో భారత వైమానిక దళం 90 వసంతాలను పూర్తి చేసుకుంది.
గత 90 సంవత్సరాల కాలంలో భారత వైమానిక దళం ఎన్నో మైలు రాళ్లను దాటుకుంటూ ప్రస్తుతం ప్రపంచంలో అమెరికా, చైనా, రష్యా తర్వాత నాల్గవ అతిపెద్ద వైమానిక దళంగా అవతరించింది. ప్రతి సంవత్సరం అక్టోబర్ 8 న వైమానిక దళ దినోత్సవం నిర్వహిస్తారు.
ఈ ఏడాది భారత వైమానిక దళం 90 వసంతాల వేడుకలు యొక్క పరేడ్, ఫ్లై పాస్ట్ చండీగఢ్లో నిర్వహించబోతున్నారు. వైమానిక దళం రోజున.. సింగిల్ ఇంజన్ మిగ్-21తో సహా దాదాపు 80 విమానాలు చండీగఢ్లోని సుఖ్నా సరస్సుపై అద్భుతమైన ప్రదర్శనను ఏర్పాటు చేస్తారు. ఈ వార్తకథనంలో భారత వైమానిక దళం స్వర్ణ చరిత్ర గురించి చెప్పుకుందాం.
భారత వైమానిక దళానికి 90 ఏళ్లు
భారత వైమానిక దళం అధికారికంగా 8 అక్టోబర్ 1932న స్థాపించబడింది. ఈ దళం సేవలు ఏప్రిల్ 1, 1933లో ప్రారంభమయ్యాయి. దేశ రక్షణ వ్యవస్థలో సైన్యంతో పాటు భారత వైమానిక దళం ప్రాథమిక, ముఖ్యమైన భాగం.
ఆదివాసీలకు వ్యతిరేకంగా జరిగిన వజీరిస్థాన్ యుద్ధంలో భారత వైమానిక దళం మొదటిసారిగా సాహసోపేతమైన చర్యలో తెరపైకి వచ్చింది. తరువాత రెండవ ప్రపంచ యుద్ధం సమయంలో భారత వైమానిక దళం(IAF) విపరీతంగా విస్తరించింది. ఈ యుద్ధ సమయంలో బ్రిటీష్ వారి తరుపున పోరాటం చేసింది. దీని తర్వాత అది రాయల్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ (RIAF)గా పిలువబడింది. అయితే స్వాతంత్య్ర అనంతరం 1950లో రాయల్ను తొలగించి ఇండియన్ ఎయిర్ ఫోర్స్గా మార్చా రు.
దేశ రక్షణలో ప్రాణాలకు తెగించి రక్షించడమే కాకుండా, ప్రకృతి వైపరీత్యాల సమయంలో ప్రభావిత ప్రాంతాలకు సహాయం అందించడం కూడా వైమానిక దళం బాధ్యత. IAF అనేక యుద్ధాలలో పాల్గొంది. రెండవ ప్రపంచ యుద్ధం, చైనా-భారత యుద్ధం, ఆపరేషన్ కాక్టస్, ఆపరేషన్ విజయ్, కార్గిల్ యుద్ధం, ఇండో-పాకిస్తానీ యుద్ధం, కాంగో సంక్షోభం, ఆపరేషన్ పూమ్లై, ఆపరేషన్ పవన్ వంటి పలు ఆపరేషన్లలో వైమానిక దళం తన ప్రతిభాపాటవాలను చూపింది. అంతేకాకుండా అంతర్జాతీయంగా ఐక్యరాజ్య సమితి శాంతి దళాలలో పాలు పంచుకుని విశేష పేరు ప్రఖ్యాతులు సాధించింది.
వైమానిక దళం అమ్ముల పొదిలోని శక్తివంతమైన ఆయుధాలు
దస్సాల్ట్ రాఫెల్: భారత వైమానిక దళంలో ప్రస్తుతం 36 రాఫెల్ యుద్ధ విమానాలు సేవలందిస్తున్నాయి. రాఫెల్ రాకతో భారత్ యుద్ధ శక్తి మరింత పెరిగింది. రాఫెల్లో ఉల్కాపాతం, హామర్ వంటి క్షిపణులు ఉన్నాయి. బహుపాత్రగా ఉండటం వల్ల.. ట్విన్-ఇంజిన్ (టాయిన్) రాఫెల్ ఫైటర్ జెట్ గగనతలంలో తన ఆధిపత్యాన్ని కొనసాగించగలదు. అలాగే శత్రువుల సరిహద్దులోకి చొచ్చుకపోయి.. సమర్థవంతంగా దాడి చేయగలదు. రాఫెల్ గగనతలంలో ఉన్నప్పుడూ.. శత్రు విమానాలు, హెలికాప్టర్ లేదా డ్రోన్ కొన్ని వందల కిలోమీటర్లకు దగ్గరగా ఉండాల్సిందే.. అదే సమయంలో శత్రువుల భూమిలోకి ప్రవేశించి బాంబు దాడి ద్వారా విధ్వంసం సృష్టించగలదు. రాఫెల్ను మల్టీ రోల్ ఫైటర్ ఎయిర్క్రాఫ్ట్ అని కూడా పిలవడానికి కారణం ఇదే.
సుఖోయ్ Su-30MKI: ఈ యుద్ద విమానాలు భారత వైమానికదళంలోకి 2016లో ప్రవేశించాయి. మరో 40కి పైగా సుఖోయ్ యుద్ధ విమానాలు వైమానిక దళంలో కి తీసుకరావాలని ప్రభుత్వం యోచిస్తుంది. ఇవి సముద్రం మరియు భూమిపై 'స్టాండ్-ఆఫ్ రేంజ్' నుండి ఏదైనా లక్ష్యాన్ని అతి సులభంగా చేధించగలవు. వీటి రాకతో భారత వైమానిక దళ(IAF) సామర్థ్యం మరింత పెరిగిందని చెప్పాలి.
మిగ్ -29: మిగ్ 29 (MiG-29) వీటినే ఫాల్కన్ అని పిలుస్తారు, ఇవి ఎయిర్ సుపీరియారిటీ ఫైటర్, ఇది సుఖోయ్-30MKI తర్వాత భారత వైమానిక దళం యొక్క రెండవ రక్షణ శ్రేణిని ఏర్పరుస్తుంది. 69 MiG-29లు సేవలో ఉన్నాయి, ఇవన్నీ ఇటీవల MiG-29 UPG ప్రమాణానికి అప్గ్రేడ్ చేయబడ్డాయి.
దస్సాల్ట్ మిరాజ్ 2000: మిరాజ్ 2000ని భారత వైమానిక దళంలో వజ్ర అని పిలుస్తారు. వైమానిక దళంలో ప్రస్తుతం 49 మిరాజ్ 2000H, 8 మిరాజ్ 2000 THలు సేవాలందిస్తున్నాయి. ఇవన్నీ ప్రస్తుతం భారతీయ నిర్దిష్ట మార్పులతో మిరాజ్ 2000-5 Mk 2 ప్రమాణానికి అప్గ్రేడ్ చేయబడుతున్నాయి.
ప్రచండ: రక్షణ రంగంపై ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తోన్న భారత్ ప్రచండ పేరిట లైట్ కంబాట్ హెలికాఫ్టర్లను తయారు చేసింది. గత సోమవారం ప్రచండ తొలి బ్యాచ్ను ఎయిర్ ఫోర్స్లోకి ప్రవేశపెట్టింది. మిస్సైళ్లతో పాటు ఇతర ఆయుధాలను అత్యంత సులభంగా ప్రయోగించగల సామర్థ్యం వీటి సొంతం. ఎత్తయిన పర్వత ప్రాంతాల్లో సులభంగా ల్యాండింగ్, టేకాఫ్ కాగలవు. ప్రభుత్వ రంగానికి చెందిన హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ ‘ప్రచండ’ హెలికాప్టర్లను రూపొందించింది. రానున్న రోజుల్లో ఇండియన్ ఆర్మీ, ఎయిర్ ఫోర్స్లో దీని సేవలు కీలకం కానున్నాయి.
భారత్ వద్ద ఇప్పటికే అమెరికాకు చెందిన అపాచీ చాపర్లు స్థానంలో వీటిని వినియోగించాలని భారత వైమానిక దళం భావిస్తుంది. ఈ చాపర్లను ఇప్పటికే లడఖ్లో టెస్ట్ చేశారు. ఈ యుద్ద విమానం ఎయిర్ టు ఎయిర్ మిస్సైళ్లను సులభంగా కూల్చగలవు. అలాగే యుద్ద ట్యాంకర్లను సైతం ధ్వంసం చేయగలదు.