మేఘాలయలో అర్ధరాత్రి భూకంపం.. భయంతో జనం పరుగులు
మేఘాలయలోని నోంగ్పోలో ఆదివారం రాత్రి భూకంపం సంభవించింది. నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ ప్రకారం.. ఆదివారం రాత్రి 11.28 గంటలకు భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 3.2గా నమోదైంది.
న్యూ ఇయర్ తొలి రోజే ఢిల్లీ ఎన్సీఆర్తో పాటు మేఘాలయ ప్రజలకు షాక్ తగలింది. మేఘాలయలోని నాంగ్పోహ్లో ఆదివారం అర్థరాత్రి స్వల్ప భూకంపం సంభవించింది. ఆదివారం రాత్రి 11.28 గంటల ప్రాంతంలో సంభవించిన భూకంప తీవ్రత 3.2గా నమోదైందని నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ (ఎన్సిఎస్) తెలిపింది. భూకంప కేంద్రం భూమికి 10 కి.మీ. ల లోతులో నమోదైనట్టు తెలిపింది.
మేఘాలయలోని నోంగ్పోకు 60 కిలోమీటర్ల దూరంలో భూకంపం సంభవించింది. భూకంపం సంభవించిన వెంటనే భూమి కంపించడంతో ప్రజలు భయాందోళనలతో బయటకు వచ్చారు. నిద్రలో ఉన్న వ్యక్తులు ఈ ఘటన గురించి తెలుసుకోలేకపోయారు. అయితే .. భూకంపం కారణంగా ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం జరిగినట్లు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ ధృవీకరించలేదు.
కార్గిల్లో 4.6 తీవ్రతతో భూకంపం
అలాగే.. లడఖ్లోని కార్గిల్లో ఆదివారం సాయంత్రం 6:32 గంటలకు భూకంపం సంభవించింది. భూకంప తీవ్రత 4.6గా నమోదైంది. భూకంప కేంద్రం 150 కి.మీ. లోతులో నమోదైనట్టు తెలిపింది.
ఢిల్లీలో 3.8 తీవ్రతతో భూకంపం
న్యూ ఇయర్ తొలి రోజే.. ఢిల్లీతోపాటు పరిసర ప్రాంతాల్లోనూ భూకంపం సంభవించింది. అదే సమయంలో హర్యానాలోని ఝజ్జర్లో భూకంప తీవ్రత 3.8గా నమోదైంది. హర్యానాలోని ఝజ్జర్కు వాయువ్య ప్రాంతంలో ఆదివారం తెల్లవారుజామున 1:19 గంటలకు భూకంపం సంభవించిందని, ఉపరితలం నుండి 5 కిలోమీటర్ల లోతులో భూకంపం సంభవించిందని NCS సూచించింది.
భూకంపాలు ఎలా వస్తాయి?
భూకంపాలు సంభవించడానికి ప్రధాన కారణం భూమి లోపల పలకలు(ప్లేట్లు) ఢీకొనడమే. భూమి లోపల ఏడు పలకలు నిరంతరం తిరుగుతూ ఉంటాయి. ఈ ప్లేట్లు ఏదో ఒక సమయంలో ఢీకొన్నప్పుడు, అక్కడ ఒక ఫాల్ట్ లైన్ జోన్ ఏర్పడుతుంది. ఉపరితలం యొక్క మూలలు ముడుచుకుంటాయి. దీంతో అక్కడ ఒత్తిడి పెరుగుతుంది. ప్లేట్లు విరిగిపోతాయి. ఈ పలకల విచ్ఛిన్నం కారణంగా.. లోపల ఉన్న శక్తి బయటకు రావడానికి ఒక మార్గాన్ని కనుగొంటుంది. దాని కారణంగా భూమి కంపిస్తుంది.దానినే భూకంపంగా పరిగణిస్తాము.
భూకంప తీవ్రత
రిక్టర్ స్కేలుపై 2.0 కంటే తక్కువ తీవ్రతతో సంభవించే భూకంపాలు సూక్ష్మంగా వర్గీకరించబడ్డాయి. వీటిని అనుభూతి చెందలేం. ప్రపంచవ్యాప్తంగా ప్రతిరోజూ ఇలాంటి భూకంపాలు దాదాపు 8,000 వరకు నమోదవుతునే ఉన్నాయి. అదేవిధంగా 2.0 నుంచి 2.9 తీవ్రతతో సంభవించే భూకంపాలను మైనర్ కేటగిరీలో ఉంచారు. ప్రతిరోజూ 1,000 భూకంపాలు సంభవిస్తాయి, మనం దానిని సాధారణంగా అనుభవించలేము.
3.0 నుండి 3.9 తీవ్రతతో చాలా తేలికపాటి భూకంపాలు సంవత్సరంలో 49,000 సార్లు నమోదు చేయబడ్డాయి. వీటిని అనుభూతి చెందుతాము. కానీ ఎటువంటి హాని కలిగించవు. లైట్ కేటగిరీ భూకంపాలు 4.0 నుండి 4.9 తీవ్రతతో ఉంటాయి, ఇవి రిక్టర్ స్కేల్పై ప్రపంచవ్యాప్తంగా సంవత్సరానికి 6,200 సార్లు నమోదు చేయబడ్డాయి. ఈ ప్రకంపనలను అనుభూతి చెందుతాము. గృహోపకరణాలు కదులుతున్నాయి. అయినప్పటికీ.. అవి చాలా తక్కువ నష్టాన్ని కలిగిస్తాయి.