యూపీలో ఆగని రేప్ లు: బులంద్ షహర్ లో 14 ఏళ్ల బాలికపై, ఆజంఘర్ లో 8 ఏళ్ల బాలికపై...
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో అత్యాచారాల ఘటనలకు అంతు లేకుండా పోయింది. హత్రాస్, బలరాంపూర్ ఘటనలు తీవ్ర ఆందోళనకు దారి తీసిన నేపథ్యంలో మరో ఇద్దరు బాలికలపై అత్యాచారం జరింది.
లక్నో: ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలో అత్యాచారాల ఘటనలు వరుసగా సంభవిస్తూనే ఉన్నాయి. హత్రాస్, బలరాంపూర్ ఘటనలు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. తాజాగా మరో రెండు ఘటనలు కూడా తీవ్ర కలకలం రేపుతున్నాయి.
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని బులంద్ షెహర్ లో మైనర్ బాలికపై అత్యాచారం జరిగినట్లు బుధవారం పోలీసులు తెలిపారు. ఈ సంఘటనపై బాలిక తండ్రి బుధవారం రాత్రి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. తమ పొరుగున ఉండే 20 ఏళ్ల యువకుడు తన 14 ఏళ్ల కూతురిపై అత్యాచారం చేసినట్లు అతను ఫిర్యాదు చేశాడు.
Also Read: యుపీలో మరో హత్రాస్ ఘటన: యువతిపై గ్యాంగ్ రేప్, గాయాలతో మృతి
బాధితురాలు ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. నిందితుడిపై పోలీసులు కేసు నమోదు చేశారు. అతన్ని పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. త్వరలోనే నిందితుడిని పట్టుకుంటామని చెబుతున్నారు.
ఆజంగఢ్ లో అటువంటి సంఘటనే జరిగింది. ఆజంగఢ్ జిల్లాలోని ఓ గ్రామంలో 8 ఏళ్ల వయస్సు గల బాలికపై 20 ఏళ్ల యువకుడు అత్యాచారం చేశాడు. జియాన్ పూర్ లో బాలిక ఇంటి పక్కనే ఉండే యువకుడు బాలికను తన ఇంటికి తీసుకుని వెళ్లాడు. తల్లి ఆమెను స్నానానికి తీసుకుని వెళ్తుండగా అతను ఆ పనిచేశాడు.
Also Read: ఏడ్చి మొత్తుకున్న తల్లి: గ్యాంగ్ రేప్ మృతురాలి అంత్యక్రియలు చేసిన పోలీససులు
బాలిక దుస్తులను కూడా యువకుడు ఆమె నుంచి తీసుకున్నాడు. తాను స్నానం చేయిస్తానని అతను తీసుకుని వెళ్లాడు. ఇంటికి తిరిగి వచ్చిన బాలిక రక్తమోడుతూ నొప్పితో బాధపడుతూ ఉండడాన్ని కుటుంబ సభ్యులు గమనించారు. ప్రస్తుతం బాలిక ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. ఆమె పరిస్థితి ఆందోళనకరంగా ఉంది.