ఆ దగ్గు మందులను వినియోగించవద్దు.. ప్రపంచ ఆరోగ్య సంస్థ కీలక ప్రకటన
గతేడాది డిసెంబరులో ఉజ్బెకిస్థాన్ అధికారులు దగ్గు సిరప్ తాగి 18 మంది చిన్నారులు మరణించారని పేర్కొన్నారు. ఉజ్బెకిస్థాన్ ప్రభుత్వం పిల్లల మరణానికి భారతీయ ఫార్మాస్యూటికల్ కంపెనీని నిందించింది. తాజాగా ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా షాక్ ఇచ్చింది.
ఉజ్బెకిస్థాన్లో దగ్గు మందు తాగి 19 మంది చిన్నారులు మృతి చెందిన ఘటన ప్రపంచ వ్యాపంగా కలకలం రేపిన విషయం తెలిసిందే. దీంతో ఆ మెడిసన్స్ తయారు చేసి .. నోయిడాకు చెందిన ఫార్మా మరియన్ బయోటెక్ కష్టాల్లో పడింది. ఈ కేసులో మారియన్ బయోటెక్ను తప్పుబడుతున్నారు.
తాజాగా ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) ఆగ్రహం వ్యక్తం చేసింది. నోయిడాకు చెందిన మారియన్ బయోటెక్ కంపెనీ తయారు చేసిన రెండు దగ్గు సిరప్లను ఉపయోగించకూడదని డబ్ల్యూహెచ్ఓ సిఫార్సు చేసింది. బుధవారం నాడు ఒక మెడికల్ ప్రొడక్ట్ అలర్ట్లో డబ్ల్యూహెచ్ఓ ఈ ప్రకటన చేసింది. Marion Biotech 'నాణ్యత లేని వైద్య ఉత్పత్తులు', నాణ్యతా ప్రమాణాలు , స్పెసిఫికేషన్లను అందుకోవడంలో సంస్థ విఫలమైందని పేర్కొంది.
WHO తన వెబ్సైట్లో విడుదల చేసిన ప్రకటనలో పేర్కొంది. ఈ WHO వైద్య ఉత్పత్తి హెచ్చరిక రెండు కలుషితమైన ఉత్పత్తులను సూచిస్తుంది. ఉజ్బెకిస్తాన్లో గుర్తించబడింది. ఇది 22 డిసెంబర్ 2022న WHOకి నివేదించబడింది. ఆంబ్రోనాల్ సిరప్, డిఓకె-1 మ్యాక్స్ సిరప్ అనే రెండు ఉత్పత్తులను వాడకూడదని పేర్కొంది. ఈ రెండు ఉత్పత్తుల యొక్క ప్రకటిత తయారీదారు Marion Biotech Pvt Ltd (ఉత్తర ప్రదేశ్, భారతదేశం) భద్రత , నాణ్యతపై WHO ఎటువంటి హామీ ఇవ్వలేదని పేర్కొంది.
ప్రమాణానికి విరుద్ధంగా దగ్గు సిరప్లో కలుషిత మిశ్రమం
'ప్రాణాంతకమైన' దగ్గు సిరప్పై ప్రభుత్వ కమిటీ సమాధానం చెప్పింది.WHO ప్రకారం..ఉజ్బెకిస్తాన్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ యొక్క జాతీయ నాణ్యత నియంత్రణ ప్రయోగశాలలలో దగ్గు సిరప్ నమూనాలను పరీక్షించారు. దాని విశ్లేషణలో రెండు ఉత్పత్తులలో డైథైలీన్ గ్లైకాల్ లేదా ఇథిలీన్ గ్లైకాల్ ప్రమాణాలకు విరుద్ధంగా అధిక మోతాదులో కలిపినట్టు గుర్తించింది. ఈ రెండు ఉత్పత్తులు ఇతర దేశాలలో కూడా మార్కెటింగ్ అధికారాన్ని కలిగి ఉంటాయి. ఇతర దేశాలు లేదా ప్రాంతాలలో అనధికారిక మార్కెట్ల ద్వారా కూడా వాటిని పంపిణీ చేస్తున్నట్టు గుర్తించింది. ఐక్యరాజ్యసమితి ఆరోగ్య సంస్థ ఈ హెచ్చరికలో సూచించిన నాణ్యత లేని ఉత్పత్తులు సురక్షితం కాదని , వాటిని ఉపయోగించడం, ముఖ్యంగా పిల్లలలో, తీవ్రమైన అనారోగ్యం లేదా మరణానికి దారితీయవచ్చని పేర్కొంది.
లైసెన్స్ను రద్దు చేసిన యూపీ సర్కార్
మారియన్ బయోటెక్ కంపెనీ తయారు చేసిన దగ్గు సిరప్ తాగి 19 మంది చిన్నారులు చనిపోయారని డిసెంబర్ 22న ఉజ్బెకిస్తాన్ ఆరోపించిన సంగతి తెలిసిందే. దీనికి సంబంధించి ఉత్తరప్రదేశ్ ఫుడ్ సేఫ్టీ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ మంగళవారం మారియన్ బయోటెక్ కంపెనీ ఉత్పత్తి లైసెన్స్ను సస్పెండ్ చేసింది.
డ్రగ్స్ ఇన్స్పెక్టర్ వైభవ్ బబ్బర్ మాట్లాడుతూ.. తగిన పత్రాలు ఇవ్వకపోవడంతో మారియన్ బయోటెక్ కంపెనీ ప్రొడక్షన్ లైసెన్స్ను సస్పెండ్ చేశామనీ తెలిపింది. రాష్ట్ర లైసెన్సింగ్ అథారిటీ కూడా షోకాజ్ నోటీసు ఇచ్చింది. శాంపిల్స్ ఫలితాలు ఇంకా పెండింగ్లో ఉన్నాయని ఆయన తెలిపారు. దగ్గు సిరప్ డోకల్ మ్యాక్స్లో కల్తీ జరుగుతోందన్న వార్తల నేపథ్యంలో నోయిడాకు చెందిన ఫార్మా కంపెనీ తయారీ కార్యకలాపాలన్నీ నిలిపివేసినట్లు కేంద్ర ఆరోగ్య మంత్రి మన్సుఖ్ మాండవియా గత నెలలో తెలిపారు.