పాకిస్తాన్ లో దారుణం: ఎనిమిదేళ్ల బాలికపై గ్యాంగ్ రేప్, కళ్లలో కత్తితో దాడి
పాకిస్తాన్ లో దారుణం చోటు చేసుకుంది. ఎనిమిదేళ్ల బాలిక కవితపై గ్యాంగ్ రేప్ చోటు చేసుకంది. అంతేకాదు నిందితులు బాలిక కళ్లలో కత్తితో దాడికి దిగారు.
ఇస్లామాబాద్:పాకిస్తాన్ లో ఎనిమిదేళ్ల హిందూ బాలిక సామూహిక అత్యాచారానికి గురైంది. అత్యాచారం చేసే సమయంలో నిందితులు ఆమె రెండు కళ్లలో కత్తితో పొడిచారు.ఈ ఘటన పాకిస్తన్ లోని ఉమర్ కోట్ లో చోటు చేసుకుంది. బాధితురాలు పాకిస్తాన్ లోని ఆసుపత్రిలో చికిత్స పొందుతుంది. ఆమెకు తీవ్రంగా రక్తస్రావం అవుతుంది. ఆమె పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు చెప్పారు.
బాధితురాలిపై గ్యాంగ్ రేప్ సమయంలో ఆమె తీవ్రంగా హింసించారని ఆమె ఒంటిపై ఉన్న గాయాలను బట్టి తెలుస్తుందని బాధితురాలి కుటుంబ సభ్యులు చెబుతున్నారు. బాధితురాలు చనిపోయిందని వదిలేసి ఉంటారని వారు చెబుతున్నారు. బాధితురాలిని ఉమర్ కోట్ ప్రభుత్వాసుపత్రిలో చేర్పించారు. అత్యాచారం జరిగినట్టుగా వైద్యులు నిర్ధారించారని స్థానిక మీడియా తెలిపింది.
బాధితురాలికి తీవ్రంగా రక్తస్రావం జరుగుతుందని ఆమె వెంట వచ్చిన మహిళ మీడియాకు చెప్పారు. అత్యాచారం జరిగిన సమయంలో బాధితురాలి ముఖంపై గీతలు కూడ ఉన్నాయన్నారు. ప్రతి రోజూ ఇలాంటి ఘటనలు రోజు జరుగుతున్నాయనే విమర్శలు వస్తున్నాయి. అయినా కూడా ప్రభుత్వం నుండి ఏ మాత్రం చర్యలు లేవని బాధిత కుటుంబం ఆరోపిస్తుంది. ఈ ఘటనకు పాల్పడిన నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తుంది బాధిత కుటుంబం.