MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathimynation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • KEA 2025
  • Home
  • Telangana
  • Hyderabad: హైద‌రాబాదీల‌కు గుడ్ న్యూస్‌.. పీఎం ఈ డ్రైవ్ కింద ఎల‌క్ట్రిక్ బ‌స్సులు

Hyderabad: హైద‌రాబాదీల‌కు గుడ్ న్యూస్‌.. పీఎం ఈ డ్రైవ్ కింద ఎల‌క్ట్రిక్ బ‌స్సులు

హైదరాబాద్ నగర ప్రజలకు కేంద్ర ప్రభుత్వం ఒక గుడ్ న్యూస్ చెప్పింది. రానున్న రోజుల్లో న‌గ‌రంలో ఎల‌క్ట్రిక్ బ‌స్సులు పెద్ద ఎత్తున ప‌రుగులు పెట్ట‌నున్నాయి. ఇందుకు సంబంధించి తాజాగా అధికారిక ప్ర‌క‌ట‌న చేశారు. 

1 Min read
Narender Vaitla
Published : May 23 2025, 03:33 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • Google NewsFollow Us
15
పీఎం ఈ డ్రైవ్
Image Credit : our own

పీఎం ఈ డ్రైవ్

పీఎం ఈ-డ్రైవ్ పథకం కింద 2,000 ఎలక్ట్రిక్ బస్సులను కేటాయించింది. ఈ నిర్ణయం కేంద్ర భారీ పరిశ్రమల శాఖ మంత్రి హెచ్‌డీ కుమారస్వామి అధ్యక్షతన నిర్వహించిన రాష్ట్రాల సమీక్షా సమావేశంలో తీసుకున్నారు.

25
తెలంగాణతో పాటు ఇతర రాష్ట్రాలకు భారీగా ఈవీ బస్సులు
Image Credit : social media

తెలంగాణతో పాటు ఇతర రాష్ట్రాలకు భారీగా ఈవీ బస్సులు

ఈ పథకం కింద కేవలం హైదరాబాద్‌కే కాకుండా బెంగళూరుకు 4,500, ఢిల్లీకి 2,800, అహ్మదాబాద్‌కు 1,000, సూరత్‌కు 600 ఎలక్ట్రిక్ బస్సులను కేటాయించారు. సుస్థిర రవాణా వ్యవస్థ ఏర్పాటు కోసం కేంద్రం రాష్ట్రాల సమన్వయంతో ఈవీ వాహనాల విస్తరణకు ఈ నిర్ణ‌యం ప‌నిచేస్తోంది.

Related Articles

తెలంగాణకు గుడ్ న్యూస్... ఐపిఎస్ ల సంఖ్యను పెంచిన కేంద్ర ప్రభుత్వం
తెలంగాణకు గుడ్ న్యూస్... ఐపిఎస్ ల సంఖ్యను పెంచిన కేంద్ర ప్రభుత్వం
Holidays : తెలుగు విద్యార్థులు ఎగిరిగంతేసే సమాచారం.. సమ్మర్ హాలిడేస్ ముగిసాక కూడా మరో 100 రోజుల సెలవులు
Holidays : తెలుగు విద్యార్థులు ఎగిరిగంతేసే సమాచారం.. సమ్మర్ హాలిడేస్ ముగిసాక కూడా మరో 100 రోజుల సెలవులు
35
“సుస్థిర రవాణా మా నిబద్ధత”: హెచ్‌డీ కుమారస్వామి
Image Credit : our own

“సుస్థిర రవాణా మా నిబద్ధత”: హెచ్‌డీ కుమారస్వామి

ఈ సందర్భంగా మంత్రి కుమారస్వామి మాట్లాడుతూ, ప్రధాని మోదీ నేతృత్వంలో నగర రవాణాను పర్యావరణపరంగా శుద్ధంగా, ప్రయాణికులకు సౌకర్యవంతంగా మార్చేందుకు ఇది కీలక అడుగు అని తెలిపారు. ఎలక్ట్రిక్ వాహనాల విస్తరణతో భారత రవాణా రంగంలో స‌మూల మార్పు తీసుకొస్తుంద‌ని తెలిపారు.

45
రూ.10,900 కోట్లతో 14,028 బస్సుల లక్ష్యం
Image Credit : AI IMAGE GENERATED WITH OPEN AI

రూ.10,900 కోట్లతో 14,028 బస్సుల లక్ష్యం

పీఎం ఈ-డ్రైవ్ పథకం ద్వారా 2024 ఏప్రిల్ నుంచి 2026 మార్చి వరకు రూ.10,900 కోట్ల వ్యయంతో 14,028 ఎలక్ట్రిక్ బస్సులను అందుబాటులోకి తేవాలన్నది కేంద్ర లక్ష్యం. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద ఈవీ బస్సుల ప్రోగ్రాంలలో ఒకటిగా నిలవనుంది.

55
ఈ-వోచర్లు, ఈ-ఆంబులెన్సులు, ఈ-ట్రక్కులు కూడా
Image Credit : our own

ఈ-వోచర్లు, ఈ-ఆంబులెన్సులు, ఈ-ట్రక్కులు కూడా

బస్సుల సరఫరాతో పాటు కొనుగోలుదారులకు డిమాండ్ ఇన్సెంటివ్ అందించేందుకు ఈ-వోచర్లు అందుబాటులోకి తీసుకొస్తున్నారు. అలాగే త్వరలో ఈ-ఆంబులెన్సులు, ఈ-ట్రక్కులు కూడా మార్కెట్‌లోకి రానున్నట్లు తెలిపారు. ఈ ప్రత్యేక వాహనాల కోసం కేంద్రం రూ.500 కోట్లు కేటాయించింది.

Narender Vaitla
About the Author
Narender Vaitla
నరేందర్ వైట్లకు ప్రింట్‌, డిజిటల్ మీడియాలో 8 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రస్తుతం ఏసియా నెట్ న్యూస్ తెలుగులో సీనియర్ సబ్ ఎడిటర్‌గా సేవందిస్తున్నారు. 2015లో సాక్షి దినపత్రిక ద్వారా జర్నలిజంలోకి అడుగుపెట్టారు. అనంతరం 2019లో ఈనాడు డిజిటల్‌ విభాగంలో సబ్‌ ఎడిటర్‌గా, 2020లో టీవీ9 తెలుగులో (డిజిటల్‌) సీనియర్‌ సబ్‌ ఎడిటర్‌గా పని చేశారు. లైఫ్‌స్టైల్‌, టెక్నాలజీ, హ్యుమన్‌ ఇంట్రెస్ట్‌ వంటి తదితర విభాగాలకు చెందిన వార్తలు రాస్తుంటారు. Read More...
హైదరాబాద్
భారత దేశం
తెలంగాణ
 
Recommended Stories
Top Stories
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Andriod_icon
  • IOS_icon
  • About Us
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2025 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved