- Home
- National
- Viral News: శోభనం గదిలో పెళ్లి కూతురు షాకింగ్ కండిషన్.. దెబ్బకు పెళ్లి కొడుకు ఫ్యూజులవుట్
Viral News: శోభనం గదిలో పెళ్లి కూతురు షాకింగ్ కండిషన్.. దెబ్బకు పెళ్లి కొడుకు ఫ్యూజులవుట్
Viral News: ప్రతీ మనిషి జీవితంలో వివాహానికి ఎంతో ప్రాముఖ్యత ఉంటుంది. జీవితంలో కీలకమైన పెళ్లిపై వధూవరులు ఇద్దరు ఎన్నో కలలు కంటుంటారు. అయితే ఉత్తరప్రదేశ్కి చెందిన ఓ యువకుడికి మాత్రం మొదటి రాత్రి పీడ కలగా మారింది. అసలేం జరిగిందంటే.?

వివాహంలో ఊహించని మలుపు
ఉత్తరప్రదేశ్లోని అగ్రాలో జరిగిన ఒక వివాహం ఊహించని మలుపు తిరిగింది. జగదీష్పుర ప్రాంతంలో జరిగిన ఈ పెళ్లి అన్ని సంప్రదాయాల ప్రకారం సజావుగా పూర్తైంది. కానీ పెళ్లి రాత్రే వధువు చేసిన డిమాండ్తో ఈ ఘటన వివాదంగా మారింది.
రూ. 90 లక్షలు ఇస్తేనే కలుస్తానంటూ..
పెళ్లి తర్వాత మొదటి రాత్రి గదిలోకి వెళ్లిన వెంటనే వధువు ఒక కండిషన్ పెట్టింది. “రూ. 90 లక్షలు నగదు ఇస్తేనే సహజీవనం కొనసాగుతుంది” అని స్పష్టం చేసింది. ఈ మాట విని వరుడు షాక్కు గురయ్యాడు. ఇలాంటి డిమాండ్ ఉంటుందని అతని కుటుంబం ఊహించలేదు.
కుటుంబాల మధ్య చర్చలు.. మరింతగా పెరిగిన వివాదం
ఈ విషయం వెంటనే వరుడు తన కుటుంబానికి తెలిపాడు. వారు వధువుతో మాట్లాడి సమస్యను పరిష్కరించడానికి ప్రయత్నించారు. కానీ పరిస్థితి కుదరకపోయింది. వధువు ఈ విషయాన్ని తన కుటుంబానికి చెప్పడంతో వివాదం మరింత పెరిగింది. తరువాత ఆమె తన ఆభరణాలు తీసుకుని తన తల్లిదండ్రుల ఇంటికి వెళ్లిపోయింది. దీంతో వరుడి కుటుంబంలో అనుమానాలు మొదలయ్యాయి.
హింసాత్మకంగా మారిన ఘటన
తరువాత రోజు వధువు బంధువులు వరుడి ఇంటికి వచ్చారు. డబ్బు ఇవ్వలేమని వరుడి కుటుంబం చెప్పడంతో పరిస్థితి హింసాత్మకంగా మారింది. వారు ఇంటి తలుపులు వేసి, వరుడి కుటుంబ సభ్యులను లోపలే బంధించినట్లు ఆరోపణలు ఉన్నాయి. అంతేకాకుండా, ఇంటి బయట ఉన్న గ్యాస్ పైప్లైన్ను కూడా తారుమారు చేసినట్లు సమాచారం. ఇది పెద్ద ప్రమాదానికి దారితీసే పరిస్థితి ఏర్పడింది.
పోలీసుల జోక్యం.. కేసు నమోదు
ఈ పరిస్థితిలో వరుడి కుటుంబం పోలీసులకు సమాచారం ఇచ్చింది. వెంటనే స్పందించిన పోలీసులు అక్కడికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకున్నారు. గ్యాస్ లీక్ను ఆపి, ఇంట్లో ఉన్న వారిని సురక్షితంగా బయటకు తీసుకువచ్చారు. వధువుతో పాటు ఆమె కుటుంబ సభ్యులపై కేసు నమోదు చేసి, ప్రస్తుతం దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

