MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • National
  • Today Top 5 News : ఈ రోజు మీరు తప్పకుండా తెలుసుకోవాల్సిన వార్తలు

Today Top 5 News : ఈ రోజు మీరు తప్పకుండా తెలుసుకోవాల్సిన వార్తలు

Today Top 5 News : మీరు ఇవాళ్టి టాప్ న్యూస్ ఒకేచోట తెలుసుకోవాలని అనుకుంటున్నారా? మీకోసమే తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్, నేషనల్ , ఇంటర్నేషనల్, స్పోర్ట్స్ లో టాప్ 5 వార్తలు ఇక్కడ అందిస్తున్నాం.

2 Min read
Author : Mahesh Rajamoni
Published : Sep 23 2025, 05:49 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
Heavy Rains: బంగాళాఖాతంలో అల్పపీడనం.. తెలంగాణలో భారీ వర్షాలు
Image Credit : iSTOCK

Heavy Rains: బంగాళాఖాతంలో అల్పపీడనం.. తెలంగాణలో భారీ వర్షాలు

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో తెలుగు రాష్ట్రాలను వర్షాలు ముంచెత్తుతున్నాయి. ఈశాన్య బంగాళాఖాతంలో కేంద్రీకృతమైన అల్పపీడనం వచ్చే 24 గంటల్లో వాయువ్య దిశగా కదిలే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. సెప్టెంబర్ 25న మరో అల్పపీడనం బంగాళాఖాతంలో ఏర్పడనుందని పేర్కొంది. దీంతో ఈ వారమంతా ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో భారీ నుండి అతిభారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ప్రభుత్వం విపత్తు నివారణ చర్యలు చేపట్టాలని అధికారులు సూచించారు.

25
మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కొత్త వ్యూహం
Image Credit : YSR Congress Party/X

మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కొత్త వ్యూహం

మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 16 నెలల తర్వాత ప్రజల్లోకి వెళ్లేందుకు ఆయన సిద్ధమవుతున్నారని తెలుస్తోంది. ముఖ్యంగా మెడికల్ కాలేజీలపై పీపీపీ విధానంలో తీసుకున్న ప్రభుత్వ నిర్ణయాన్ని వైసీపీ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. తన హయాంలో 16 మెడికల్ కాలేజీలకు అనుమతి ఇచ్చినట్లు, వాటిలో కొన్నింటిని పూర్తిచేశామని జగన్ గుర్తుచేశారు. ఈ వివాదం నేపథ్యంలో ప్రజా దీక్షలకు సన్నాహాలు చేస్తూ, దసరా తర్వాత పెద్ద ఎత్తున నిరసనలు ప్రారంభించనున్నారని సమాచారం. దీంతో ఏపీ రాజకీయాలు మరో మలుపును చూడనున్నాయి.

Related Articles

Related image1
Smart TV: రూ. 25 వేల‌కే 55 ఇంచెస్ స్మార్ట్ టీవీ.. అమెజాన్‌లో అదిరిపోయే ఆఫ‌ర్
Related image2
ఎయిర్ ఇండియా విమాన ప్రమాదం పైలట్ తప్పిదమనడం బాధ్యతా రాహిత్యం : సుప్రీంకోర్టు
35
I Love Muhammad బ్యానర్ వివాదం? దేశంలోని పలు ప్రాంతాల్లో ఉద్రిక్తత
Image Credit : Abu Asim Azmi/X

I Love Muhammad బ్యానర్ వివాదం? దేశంలోని పలు ప్రాంతాల్లో ఉద్రిక్తత

ఉత్తరప్రదేశ్ కాన్పూర్‌లో బరావఫాత్ శోభాయాత్రలో “I Love Muhammad” ఫ్లెక్సీ ఏర్పాటు చేయడంతో వివాదం చెలరేగింది. స్థానిక హిందూ సంఘాలు అభ్యంతరం వ్యక్తం చేయగా, పోలీసులు టెంట్ మార్చి 24 మందిపై కేసులు పెట్టారు. తరువాత ఉనావ్, మహారాజ్‌గంజ్, కౌశాంబీ తదితర ప్రాంతాల్లో ఆందోళనలు, రాళ్లదాడులు జరిగాయి. హైదరాబాద్, నాగ్‌పూర్, లక్నోలోనూ నిరసనలు వెల్లువెత్తాయి. ఉత్తరాఖండ్ కాశీపూర్‌లో పోలీసులతో ఘర్షణలు చోటుచేసుకున్నాయి. ఈ ఘటనపై రాజకీయ పార్టీలూ, మతపెద్దలూ భిన్నంగా స్పందించారు. సమాజ్‌వాదీ పార్టీ మత స్వేచ్ఛని ప్రస్తావించగా, బీజేపీ చట్టం అతిక్రమిస్తే చర్యలు తప్పవని హెచ్చరించింది.

45
వాణిజ్యం, రక్షణ, ఇండో-పసిఫిక్‌పై భారత్-అమెరికా కీలక చర్చలు
Image Credit : Getty

వాణిజ్యం, రక్షణ, ఇండో-పసిఫిక్‌పై భారత్-అమెరికా కీలక చర్చలు

అమెరికా భారత్‌పై విధించిన భారీ దిగుమతి సుంకాల నేపథ్యంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. న్యూయార్క్‌లో జరిగిన 80వ ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశం సందర్భంగా భారత విదేశాంగ మంత్రి ఎస్‌.జైశంకర్‌, అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో భేటీ అయ్యారు. 

వాణిజ్యం, రక్షణ, ఔషధాలు వంటి ప్రధాన రంగాలపై ఇరువురు చర్చలు జరిపారు. ఇండో-పసిఫిక్‌ ప్రాంత అభివృద్ధి, క్వాడ్‌ సహకారం బలోపేతం దిశగా కలిసి పనిచేయాలని అంగీకరించారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ విమర్శలతో భారత్‌పై విధించిన సుంకాల కారణంగా దెబ్బతిన్న సంబంధాలను పునరుద్ధరించే ప్రయత్నంగా ఈ సమావేశం ప్రాధాన్యం సంతరించుకుంది.

55
ఆసియా కప్ : డూ ఆర్ డై మ్యాచ్.. సొంత దేశంలోనే పాక్ పై విమర్శలు
Image Credit : ANI

ఆసియా కప్ : డూ ఆర్ డై మ్యాచ్.. సొంత దేశంలోనే పాక్ పై విమర్శలు

ఆసియా కప్ 2025 లో మంగళవారం శ్రీలంక, పాకిస్తాన్ మధ్య కీలక మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్ లో గెలిచిన జట్టుకు ఫైనల్ అవకాశాలు ఉంటాయి. లేకుంటే ఇంటికి వెళ్తాయి. 

కాగా, ఈ టోర్నీలో భారత్ తో ఆడిన రెండు మ్యాచ్ లలో ఓడిపోయింది పాకిస్తాన్. మ్యాచ్ ను కోల్పోవడంతో పాటు ఆటగాళ్ల ప్రవర్తన తీరుపై సొంత దేశంలోనే పాకిస్తాన్ విమర్శలు ఎదుర్కొంటోంది.  పాక్ జట్టు తీరుపై ఆ దేశ మాజీ ప్రధాన మంత్రి ఇమ్రాన్ ఖాన్ సొంత జట్టుపై విమర్శలు గుప్పించారు. పాక్‌ ఆర్మీ చీఫ్ జనరల్ ఆసీం మునీర్, పీసీబీ చైర్మన్ నఖ్వీ ఓపెనర్లు ఆడితే, అంపైర్లంతా పాక్‌ వ్యక్తులు అయితేనే జట్టు విజయం సాధిస్తుందేమో అనే రీతిలో వ్యంగ్య వ్యాఖ్యలతో విరుచుకుపడ్డారు.

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
రోజు వారీ ప్రధాన వార్తలు
తెలంగాణ
ఆంధ్ర ప్రదేశ్
భారత దేశం
ప్రపంచం
అనుముల రేవంత్ రెడ్డి
నారా చంద్రబాబు నాయుడు
నరేంద్ర మోదీ
ఏషియానెట్ న్యూస్
క్రికెట్
క్రీడలు
డొనాల్డ్ ట్రంప్

Latest Videos
Recommended Stories
Recommended image1
పెళ్లికి అడ్డొచ్చిన జాత‌కం, శారీర‌కంగా క‌ల‌వ‌డానికి రాలేదా.? హైకోర్టు కీల‌క వ్యాఖ్య‌లు
Recommended image2
Fake Universities : ఈ విద్యాసంస్థల్లో చేరారో అంతే సంగతి.. ఆంధ్ర ప్రదేశ్ లో ఫేక్ యూనివర్సిటీల కలకలం
Recommended image3
Love Marriage: లేచిపోయి పెళ్లి చేసుకునేవాళ్లకు షాక్.. ఇకపై పేరెంట్స్‌కు చెప్పకుండా పెళ్లి కుదరదు
Related Stories
Recommended image1
Smart TV: రూ. 25 వేల‌కే 55 ఇంచెస్ స్మార్ట్ టీవీ.. అమెజాన్‌లో అదిరిపోయే ఆఫ‌ర్
Recommended image2
ఎయిర్ ఇండియా విమాన ప్రమాదం పైలట్ తప్పిదమనడం బాధ్యతా రాహిత్యం : సుప్రీంకోర్టు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved