PM Modi: గోవా తీరంలో మోదీ దీపావళి వేడుకలు.. ఈసారి ప్రత్యేకత ఏంటంటే.?
PM Modi: ప్రధాని నరేంద్ర మోదీ ప్రతీ ఏడాది దీపావళి వేడుకలను భారత సైనికులతో కలిసి జరుపుకుంటారనే విషజ్ఞం తెలిసిందే. ఈసారి కూడా మోదీ సైనికులతోనే జరుపుకున్నారు.

గోవా తీరంలో జవాన్లతో దీపావళి సంబరం
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ ఏడాది కూడా తన ప్రత్యేక సంప్రదాయాన్ని కొనసాగించారు. దీపావళి పర్వదినాన దేశ రక్షణకు కట్టుబడి ఉన్న సైనికులతో కలిసి వేడుకలు జరుపుకున్నారు. ఈసారి ఆయన గోవా తీరానికి చేరుకుని భారత నౌకాదళ సిబ్బందితో కలిసి ఆనందంగా దీపావళిని జరుపుకున్నారు. ఆదివారం రాత్రి స్వదేశీ విమాన వాహక నౌక ఐఎన్ఎస్ విక్రాంత్ పై అడుగుపెట్టిన మోదీ, సోమవారం ఉదయం నేవీ అధికారులతో కలిసి దీపాల పండుగను ఘనంగా జరుపుకున్నారు.
గౌరవంగా ఉందంటూ..
దీపావళి సందర్భంగా సిబ్బందిని ఉద్దేశించి మాట్లాడిన మోదీ, భారత నౌకాదళ వీరులను ప్రశంసించారు. “ఈ విశాల సముద్రం మధ్య ధీర జవాన్లతో కలిసి దీపావళి జరుపుకోవడం నాకు గొప్ప గౌరవం. ఈ క్షణం నా జీవితంలో ఎప్పటికీ గుర్తుండిపోతుంది. ఈ సముద్ర జలాలపై పడే సూర్యకిరణాలు వెలిగించిన దీపాల్లా మెరుస్తున్నాయి,” అని మోదీ అన్నారు.
తర్వాత ఐఎన్ఎస్ విక్రాంత్ సేవలను ఆయన ప్రశంసిస్తూ, “ఈ నౌక భారత రక్షణ శక్తికి చిహ్నం. ఆపరేషన్ సిందూర్ సమయంలో విక్రాంత్ పాక్ను మోకాళ్లపై నిలబెట్టింది. ఈ నౌక పేరు వినగానే పాకిస్థాన్ భయపడుతుంది. విక్రాంత్ అంటే శత్రువులకు నిద్ర లేని రాత్రులు,” అని వ్యాఖ్యానించారు.
From the Air Power Demo at INS Vikrant! pic.twitter.com/XvrFL9peOK
— Narendra Modi (@narendramodi) October 20, 2025
దేశ భద్రతే ప్రధానం: మోదీ సందేశం
ప్రధానమంత్రి మాట్లాడుతూ, “భారత రక్షణ రంగంలో స్వయం సమృద్ధి అవసరం. ‘మేక్ ఇన్ ఇండియా’ స్ఫూర్తితో ప్రతి సైనికుడు దేశానికి అంకితభావంతో పనిచేస్తున్నాడు. మాతృభూమి కోసం ప్రాణాలు అర్పించడానికి సిద్ధంగా ఉన్న ప్రతి జవాన్ మన గర్వకారణం,” అన్నారు. ఆయన త్రివిధ దళాలకు సెల్యూట్ చేస్తూ, దేశ రక్షణలో వారి త్యాగం అప్రతిహతమని పేర్కొన్నారు.
Will always cherish the cultural programme on board INS Vikrant last evening. The naval personnel are truly creative and versatile. They penned a song ‘Kasam Sindoor Ki’ which will remain etched in my memory. pic.twitter.com/3S6bruQAkT
— Narendra Modi (@narendramodi) October 20, 2025
కొనసాగుతున్న మోదీ సంప్రదాయం
2014లో ప్రధాని పదవిని స్వీకరించినప్పటి నుంచీ మోదీ ప్రతి దీపావళి పండుగను సరిహద్దుల్లోని సైనికులతో కలిసి జరుపుకుంటున్నారు.
2014లో సియాచిన్ గ్లేసియర్లో ఆర్మీ సిబ్బందితో కలిసి దీపావళి జరిపారు.
2018లో ఉత్తరాఖండ్లోని ఇండో-టిబెటన్ బోర్డర్ పోలీస్ దళాలతో కలిసి వేడుకల్లో పాల్గొన్నారు.
2022లో కార్గిల్లో సైనికులతో కలిసి దీపాలు వెలిగించారు.
2023లో హిమాచల్ప్రదేశ్లోని లేప్చా సైనిక శిబిరంలో దీపావళి జరిపారు.
2024లో కచ్ ప్రాంతంలోని సర్ క్రీక్ వద్ద ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ సిబ్బందితో కలిసి పండుగ చేసుకున్నారు.
ఇక 2025లో గోవా తీరంలోని ఐఎన్ఎస్ విక్రాంత్ పై నావికులతో కలిసి దీపావళి జరుపుకోవడం ద్వారా ఈ ప్రత్యేక సంప్రదాయానికి కొత్త అధ్యాయం జోడించారు.
Witnessed an awe-inspiring Air Power Demo on INS Vikrant, showcasing precision and prowess.
The take-off and landing of MiG-29 fighters on a short runway, both in daylight and in the dark night, was a breathtaking display of skill, discipline and technological excellence. pic.twitter.com/V0wwaOeYGH— Narendra Modi (@narendramodi) October 20, 2025