MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Life
  • మీకు రూ.92 లక్షలు కావాలా? అయితే ఆ దేశంలో ఉంటే చాలు

మీకు రూ.92 లక్షలు కావాలా? అయితే ఆ దేశంలో ఉంటే చాలు

ఒక దేశంలో జనాభా భారీగా తగ్గిపోతోంది. అందుకే ఆ దేశ అధ్యక్షుడు జనానికి ఒక బంపర్ ఆఫర్ ఇచ్చారు. ఆ దేశంలో నివసిస్తే వారికి ఇండియన్ కరెన్సీ ప్రకారం రూ.92 లక్షలు ఇస్తారు. దీంతో పాటు ఇల్లు కూడా ఇస్తారు. ఆ ఆఫర్ ఇస్తున్న దేశం గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం రండి.  

2 Min read
Naga Surya Phani Kumar
Published : Mar 25 2025, 07:06 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14

ప్రతి మనిషి ఎక్కడ నివసించినా సరిపడే ఆదాయం, ఆరోగ్యం, ఆనందం కోరుకుంటాడు. అంతే కదా.. అయితే ఈ కాలంలో డబ్బు సంపాదించడం అంత ఈజీ కాదు. అందుకే ఆ దేశం జనానికి డబ్బిచ్చి మరీ తమ దేశ జనాభాని పెంచుకోవడానికి  చూస్తోంది. రూ.92 లక్షలు తీసుకున్న వారు ఆ దేశంలో నివసిస్తూ స్థానికులకు అవసరమైన సేవ చేయాలి. ఏదైనా వ్యాపారం చేస్తూ జీవించొచ్చు. మరి ఆ దేశ వివరాలు తెలుసుకుందామా?



 

24

ఈ అద్భుతమైన ఆఫర్ ఇస్తున్న దేశం పేరు ఇటలీ. మీరు గాని ఇటలీలో సెటిల్ అవ్వాలనుకుంటే ఇదే మంచి టైం. ఇక్కడ సెటిల్ అయితే అక్కడి ప్రభుత్వమే రూ.92 లక్షలు ఇస్తుంది.

ఉత్తర ఇటలీలోని ఒక ప్రాంతం జనాభా తగ్గిపోతుండటంతో ఆ దేశ ప్రభుత్వం ఈ ఆఫర్ ప్రకటించింది. రూ.92 లక్షలు తీసుకున్న వారు ఉత్తర ఇటలీలోని ట్రెంటీనో(Trentino) అనే ప్రాంతంలో నివసించాల్సి ఉంటుంది. ఆ ప్రాంతంలో జనాలు పొరుగు దేశాలకు వలస వెళ్లిపోతుండటంతో ఈ నిర్ణయం తీసుకున్నారు.

34

కొన్ని కండీషన్స్ ఉన్నాయి..

డబ్బులిస్తున్నారు కదా అని వెళ్లిపోదామనుకుంటే ఇబ్బంది పడతారు. ఎందుకంటే ఆ దేశ ప్రభుత్వం ఇచ్చే డబ్బులు మీకు కేటాయించిన ఇంటిని బాగుచేయించుకోవడానికి సరిపోతుంది. అంటే ఇప్పటికే ట్రెంటీనో ప్రాంతంలో చాలా మంది తమ సొంత ఇళ్లను కూడా వదిలేసి పొరుగు దేశాలకు వెళ్లిపోయారు. దీంతో ఆ ఇళ్లన్నీ ఖాళీగా ఉండిపోయాయి. చాలా కాలంగా ఇలా ఉండటంతో చాలా వరకు పాడైపోయాయి. అందుకే ఆ దేశ ప్రభుత్వం ఆ ప్రాంతానికి వెళ్ళి సెటిల్ అవ్వాలనుకునే వాళ్ళకి రూ.92 లక్షలు అంటే ఇటలీ కరెన్సీ ప్రకారం 100,000 యూరోలు ఇస్తుంది.

44

ఇంటి కోసమే ఆ డబ్బు..

ప్రభుత్వం ఇచ్చే 80,000 యూరోలతో ఇంటిని రిపేర్ చేయించుకోవాలి. లేదా కొత్త ఇంటిని కొనుక్కోవాలి. ఈ డబ్బులు ఇంటి కోసం మాత్రమే వాడాలి. మరే ఇతర అవసరాలకు వినియోగించకూడదు. 

ఈ ఆఫర్ ద్వారా ఈ ప్రాంతంలో నివసించడానికి వచ్చే వారు స్థానిక ప్రజలకి సహాయం చేయాలి. అంటే ఇక్కడ ప్రజల అవసరాలకు తగిన వ్యాపారాలు చేసి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలి. అందుకోసమే ఈ స్కీమ్ పెట్టినట్టు ఆ దేశ అధ్యక్షుడు ప్రకటించారు. ఎవరైనా ఇటలీ వెళ్లి సెటిల్ అవ్వాలనుకుంటే ఇదే మంచి టైం. 

ఇది కూడా చదవండి ఇండియాలో తప్పక చూడాల్సిన యునెస్కో వారసత్వ సంపద

About the Author

NS
Naga Surya Phani Kumar
ఫణి కుమార్ తొమ్మిదేళ్లకు పైగా జర్నలిజంలో ఉన్నారు. అనేక సంస్థల్లో పొలిటికల్, బిజినెస్, లైఫ్ స్టైల్ విభాగాల్లో పనిచేశారు. ‘ఈనాడు’ సంస్థలో తొమ్మిదేళ్లుగా రాజకీయ వార్తలను కవర్ చేశారు. ప్రస్తుతం ‘ఆసియా నెట్ న్యూస్ తెలుగు’లో సీనియర్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. బిజినెస్, లైఫ్ స్టైల్ వార్తలను రాస్తున్నారు. ఈయనకు జ్యోతిష్యం, జాతకం, ఆధ్యాత్మికం తదితర రంగాల్లోనూ ప్రావీణ్యం ఉంది.
జీవనశైలి
ఏషియానెట్ న్యూస్
ప్రపంచం
భారత దేశం

Latest Videos
Recommended Stories
Related Stories
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2025 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved