MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Forecast
Today's Rasi Phalalu
Women's Asia Cup 2026
Smriti Mandhana
Sahaa Movie Review
Bigg Boss Telugu
Chiranjeevi's Mother
Romanchakam Movie Review
Allari Naresh
Tollywood Cinema
Hardik Pandya
Team India T20 Squad
Irumudi 12 Days Collections
Hello Brother Movie Review
Andhra Pradesh Startup Hub
Horror Movies Streaming on OTT
Ishtakameshwari Temple
  • Home
  • Life
  • Food
  • Health Tips: అన్నం వండే ముందు బియ్యాన్ని నానబెడితే పోషకాలు పోతాయా? ఇందులో నిజమెంత ?

Health Tips: అన్నం వండే ముందు బియ్యాన్ని నానబెడితే పోషకాలు పోతాయా? ఇందులో నిజమెంత ?

Health Tips: కొందరు అన్నం వండటానికి ముందు బియ్యాన్ని కడిగి అన్నం వండేస్తుంటారు. మరికొందరు మాత్రం బియ్యాన్ని కడిగి కొద్దిసేపు నానబెట్టి అన్నం వండుతారు. అయితే.. అన్నం వండేముందు బియ్యాన్ని నానబెట్టడం వల్ల పోషకాలు పోతాయా? అసలేం జరుగుతుందంటే..

2 Min read
Author : Rajesh K
| Updated : Jul 05 2025, 01:51 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
బియ్యం ఎందుకు నానబెట్టాలి?

బియ్యం ఎందుకు నానబెట్టాలి?

అన్నం వండే ముందు బియాన్ని నానబెట్టడం ఒక సాంప్రదాయ పద్ధతి. ఇలా చేయడం వల్ల బియ్యం మెత్తబడటానికి సహాయపడుతుంది. గట్టి గింజలు నీటిని పీల్చుకుని, వండేటప్పుడు సమానంగా ఉడికి, మెత్తగా, రుచిగా మారుతాయి. ఇది జీర్ణక్రియకు కూడా మంచిదని భావిస్తారు. ఈ పద్ధతి తరతరాలుగా పాటిస్తున్నారు, అయితే.. బియ్యం గింజల బయటి పొరలో కొన్ని సహజ పదార్థాలు ఉంటాయి. నానబెట్టేటప్పుడు, ఈ పొరలోని కొంత భాగం నీటితో కలుస్తుంది. ఇది బియ్యం లోపలి భాగాన్ని నీరు పీల్చుకోవడానికి సహాయపడుతుంది, వండేటప్పుడు ప్రతి బియ్యం గింజ విడివిడిగా, మెత్తగా ఉండటానికి సహాయపడుతుంది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26
నానబెట్టడం వల్ల కలిగే ప్రయోజనాలు

నానబెట్టడం వల్ల కలిగే ప్రయోజనాలు

బియ్యం నానబెట్టడం వల్ల అన్నం వండటానికి చాలా తక్కువ సమయం పడుతుంది. ప్రతి బియ్యం గింజ సమానంగా ఉడికి, అంటుకోకుండా విడివిడిగా మారుతుంది. బియ్యం మెత్తగా ఉండటం వల్ల జీర్ణంసులభంగా అవుతుంది. ఆధునిక వ్యవసాయంలో బియ్యం సాగులో ఎన్నో రకాల పురుగుమందులు వాడుతున్నారు. కాబట్టి బియ్యం నానబెట్టి, ఆ నీటిని వడపోయడం ద్వారా, బియ్యం ఉపరితలంపై అంటుకుని ఉన్న కొన్ని రసాయనాలు లేదా దుమ్మును తొలగించవచ్చు. ఇది ఒక శుభ్రపరిచే ప్రక్రియ.

Related Articles

Related image1
Rice Water: బియ్యం నీటిలో ఈ ఒక్కటి కలిపి వాడితే.. జుట్టు ఫాస్ట్ గా పెరుగుతుంది!
Related image2
Rice Cooker: డయాబెటిస్ పేషెంట్స్ ఎంచక్కా అన్నం తినొచ్చు.. అందుబాటులోకి స్మార్ట్ రైస్ కుక్కర్
36
ఎంత సేపు నానబెట్టాలి?

ఎంత సేపు నానబెట్టాలి?

బియ్యం: కనీసం 30 నిమిషాల నుండి 1 గంట వరకు నానబెట్టవచ్చు. ఇడ్లీ, దోశ పిండి కోసం బియ్యాన్ని కనీసం 4-6 గంటలు నానబెట్టాలి. ఇలా నానబెడితే.. గ్రైండింగ్‌ సులభమవుతుంది.  

బాస్మతి బియ్యం: 30 నిమిషాల నుండి 1 గంట వరకు సరిపోతుంది. బిర్యానీ, పులావ్ వంటి వంటలకు బాస్మతి బియ్యాన్ని సరైన సమయం నానబెట్టడం వల్ల బియ్యం విరిగిపోకుండా పొడవుగా ఉంటుంది.

ఎర్ర బియ్యం : ఈ రకమైన బియ్యానికి కొంచెం ఎక్కువ సమయం నానబెట్టడం మంచిది.  ఎందుకంటే ఇది బ్రౌన్ రైస్ కంటే గట్టిగా ఉంటుంది. కనీసం 2-4 గంటలు లేదంటే.. రాత్రంతా కూడా నానబెట్టవచ్చు. ఇది దాని గట్టిదనాన్ని తగ్గించి, వంట సమయాన్ని తగ్గిస్తుంది.

46
ఎలా నానబెట్టాలి?

ఎలా నానబెట్టాలి?

చాలా సార్లు చల్లటి నీటిలోనే బియ్యాన్ని నానబెట్టడం మంచిది. ఇది నెమ్మదిగా, సమానంగా నీటిని పీల్చుకోవడానికి సహాయపడుతుంది. తొందరగా వండాలంటే, గోరువెచ్చని నీటిలో 15-20 నిమిషాలు నానబెట్టవచ్చు. కానీ ఇది బియ్యం విరిగిపోయే అవకాశం ఉంటుంది.  కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. సాధారణంగా, నానబెట్టేటప్పుడు ఒక వంతు బియ్యానికి రెండు వంతుల నీరు అనే నిష్పత్తిలో నీరు కలపాలి. అంటే, ఒక కప్పు బియ్యానికి రెండు కప్పుల నీరు. ఇది బియ్యం పూర్తిగా నీటిని పీల్చుకోవడానికి సహాయపడుతుంది.

56
ఎక్కువ సేపు నానబెడితే ఏమవుతుంది?

ఎక్కువ సేపు నానబెడితే ఏమవుతుంది?

బాస్మతి బియ్యం వంటి మెత్తటి బియ్యం రకాలు ఎక్కువ సేపు నానితే.. చాలా మెత్తబడి, వండేటప్పుడు విరిగిపోవచ్చు. ఇది అన్నం రూపాన్ని, రుచిని ప్రభావితం చేయవచ్చు. ఎక్కువ సేపు నానబెడితే, బియ్యం నుండి ఎక్కువ పిండి పదార్థం బయటకు వచ్చి, వండేటప్పుడు అన్నం జిగటగా మారే అవకాశం ఉంది. ఎక్కువ సేపు నానబెట్టేటప్పుడు కొన్ని నీటిలో కరిగే విటమిన్లు నీటిలో కలిసే అవకాశం ఉంది. కాబట్టి ఆ నీటిని పారబోయడం కూడదు. 

66
నానబెట్టిన నీటిని వాడొచ్చా లేక పారబోయాలా?

నానబెట్టిన నీటిని వాడొచ్చా లేక పారబోయాలా?

బియ్యంలోని అదనపు పిండి పదార్థం నానబెట్టిన నీటిలో కలిసిపోతాయి, ఈ నీటిని వంటకు వాడితే, అన్నం జిగటగా మారే అవకాశం ఉంది. అయితే.. ఆధునిక వ్యవసాయంలో వాడే పురుగుమందులు లేదా బియ్యంపై పడిన దుమ్ము, ధూళి నానబెట్టిన నీటిలో కలిసి ఉండవచ్చు. అలాగే.. బియ్యాన్ని ఎక్కువ సేపు నానబెట్టేటప్పుడు చుట్టుపక్కల ఉష్ణోగ్రతను బట్టి నీటిలో బాక్టీరియా పెరిగే అవకాశం ఉంది. కాబట్టి, నానబెట్టిన నీటిని పారబోసి, బియ్యాన్ని ఒకటి లేదా రెండు సార్లు నీటిలో శుభ్రపరిచి, ఆ తర్వాత కొత్త నీరు కలిపి వండడమే సురక్షితం.

About the Author

RK
Rajesh K
రాజేశ్ కారంపూరి: ఆరు సంవత్సరాలుగా ప్రముఖ ప్రింట్, డిజిటల్, వెబ్ మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రధానంగా పొలిటికల్ తో పాటు ఎడ్యుకేషన్, సినిమా, స్పోర్ట్స్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. ప్రస్తుతం ఏసియానెట్‌ తెలుగులో ఫ్రీలాన్సర్ గా పని చేస్తున్నారు.
జీవనశైలి
ఏషియానెట్ న్యూస్
ఆహారం
ఆరోగ్యం
మహిళలు

Latest Videos
Recommended Stories
Recommended image1
Asafoetida: రోజూ చిటికెడు ఇంగువ తీసుకుంటే ఏమౌతుందో తెలుసా?
Recommended image2
Pulao Tips: బిగినర్స్ కోసం.. పలావ్ పొడిపొడిగా రావాలంటే ఇలా చేయండి
Recommended image3
Paratha: పరోోటా రబ్బరులా సాగుతుందా? ఇలా చేస్తే దూదిలా మెత్తగా వస్తాయి
Related Stories
Recommended image1
Rice Water: బియ్యం నీటిలో ఈ ఒక్కటి కలిపి వాడితే.. జుట్టు ఫాస్ట్ గా పెరుగుతుంది!
Recommended image2
Rice Cooker: డయాబెటిస్ పేషెంట్స్ ఎంచక్కా అన్నం తినొచ్చు.. అందుబాటులోకి స్మార్ట్ రైస్ కుక్కర్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved