MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today's Rasi Phalalu
Nepal Flash Flood
Raksha Bandhan 2026
Toxic Day 1 Collections
Veteran telugu Actor GV Narayana Rao
Trivikram Srinivas
New Financial Rules September
India's Shortest Train Journey
Onion & Sugar Prices
Irumudi Movie 4 Days Collections
Megastar Chiranjeevi
  • Home
  • Feature
  • World’s First Vegetarian City: అయోధ్య, వారణాసి కాదు.. గుడ్డు అమ్మినా జైలుకెళ్లే దేశంలోని ఏకైక నగరం ఇదే !

World’s First Vegetarian City: అయోధ్య, వారణాసి కాదు.. గుడ్డు అమ్మినా జైలుకెళ్లే దేశంలోని ఏకైక నగరం ఇదే !

World First Vegetarian City: గుజరాత్‌లోని పాలిటానా ప్రపంచంలోనే మొదటి వెజిటేరియన్ సిటీగా రికార్డు సృష్టించింది. ఇక్కడ నాన్ వెజ్ మాత్రమే కాదు చివరికి గుడ్లు అమ్మినా కూడా జైలు శిక్ష తప్పదు. ఈ సిటీ ప్రత్యేకత ఏంటో ఇక్కడ తెలుసుకుందాం.

2 Min read
Author : Mahesh Rajamoni
Published : May 15 2026, 03:49 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
గుడ్డు అమ్మినా జైలుకెళ్లే దేశంలోని ఏకైక నగరం ఇదే
Image Credit : others

గుడ్డు అమ్మినా జైలుకెళ్లే దేశంలోని ఏకైక నగరం ఇదే

భారతదేశంలో ఎన్నో పవిత్రమైన పుణ్యక్షేత్రాలు ఉన్నాయి. వారణాసి, రిషికేష్, తిరుపతి లాంటి నగరాల్లో గుడుల చుట్టుపక్కల శాఖాహార ప్రాంతాలు, పవిత్రమైన వీధులు, సాంప్రదాయాలు ఉండటం మనం చూస్తూనే ఉంటాం. కానీ గుజరాత్‌లోని ఒక చిన్న నగరం వాటన్నింటికంటే ఒక అడుగు ముందుకు వేసింది. అక్కడ నాన్-వెజ్ తినడం, అమ్మడంపై పూర్తిగా చట్టపరమైన నిషేధం విధించింది. కేవలం చికెన్, మటన్ మాత్రమే కాదు.. అక్కడ ఒక గుడ్డు అమ్మినా సరే జైలు పాలవ్వాల్సిందే.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
ప్రపంచంలోనే తొలి నాన్ వెజ్ ఫ్రీ సిటీ
Image Credit : Gemini

ప్రపంచంలోనే తొలి నాన్ వెజ్ ఫ్రీ సిటీ

గుజరాత్‌లోని భావ్‌నగర్ జిల్లాలో ఉంది పాలిటానా అనే చిన్న నగరం. ఇది అహ్మదాబాద్‌కు దాదాపు 214 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. శత్రుంజయ కొండల చుట్టూ నిర్మితమైన ఈ పట్టణం జైనుల అత్యంత పవిత్రమైన పుణ్యక్షేత్రం. ఈ కొండలపై దాదాపు 900 కి పైగా జైన్ దేవాలయాలు ఉన్నాయి. 2014 లో పాలిటానా ఒక చరిత్ర సృష్టించింది. ప్రపంచంలోనే మాంసం, చేపలు, గుడ్ల అమ్మకాలను, వినియోగాన్ని పూర్తిగా నిషేధించిన మొదటి నగరంగా ఇది రికార్డులకెక్కింది.

Related Articles

Related image1
Normal Petrol vs Power Petrol: నార్మల్ పెట్రోల్ vs స్పీడ్ vs పవర్ పెట్రోల్ మధ్య ఉన్న తేడాలు ఏంటి? మీ వాహనానికి ఏది బెస్ట్?
Related image2
Parking Rules: రోడ్డుపై బండి పార్క్ చేస్తే ఇక అమ్మేస్తారు జాగ్రత్త.. తెలంగాణలో కొత్త పార్కింగ్ రూల్స్!
35
200 మంది సాధువుల పోరాటం
Image Credit : Getty

200 మంది సాధువుల పోరాటం

నిషేధం వెనుక ఒక పెద్ద కథే ఉంది. 2014 లో పాలిటానాలో దాదాపు 200 మంది జైన్ మునులు, సాధువులు ఒక పెద్ద పోరాటానికి దిగారు. నగరంలో, దాని చుట్టుపక్కల నడుస్తున్న సుమారు మాంసం దుకాణాలను ప్రభుత్వం వెంటనే మూసివేయాలని డిమాండ్ చేశారు. ఈ నిరసన దేశవ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షించింది. దాంతో స్థానిక అధికారులపై, ప్రభుత్వంపై తీవ్రమైన ఒత్తిడి పెరిగింది.

45
ప్రభుత్వం సంచలన నిర్ణయం
Image Credit : Getty

ప్రభుత్వం సంచలన నిర్ణయం

సాధువుల సుదీర్ఘ నిరసనకు గుజరాత్ ప్రభుత్వం స్పందించింది. పాలిటానా నగర పరిధిలో మాంసం, గుడ్ల అమ్మకాలతో పాటు జంతు వధను పూర్తిగా నిషేధిస్తూ అధికారికంగా చట్టం తెచ్చింది. ఈ చట్టాన్ని ఉల్లంఘిస్తే కఠినమైన చట్టపరమైన శిక్షలు ఉంటాయి. ఈ నగరంలో గుడ్డు అమ్మడం అనేది కేవలం తప్పు మాత్రమే కాదు.. జైలు శిక్ష పడేంత పెద్ద నేరం. జైన మతంలో అహింసకు అత్యంత ప్రాధాన్యం ఇస్తారు. ఏ జీవిని హింసించకూడదనేది వారి ముఖ్య సూత్రం. 2500 ఏళ్లుగా వారు నమ్ముతున్న సిద్ధాంతానికి ఈ చట్టం ద్వారా అధికారిక గుర్తింపు లభించింది.

55
రాత్రికి రాత్రే మారిన ఫుడ్ సీన్.. కానీ?
Image Credit : Getty

రాత్రికి రాత్రే మారిన ఫుడ్ సీన్.. కానీ?

ఈ నిషేధం తర్వాత పాలిటానా నగర రూపురేఖలు మారిపోయాయి. భక్తులు, పర్యాటకుల కోసం వందలాది వెజిటేరియన్ రెస్టారెంట్లు వెలిశాయి. గుజరాతీ థాలీలు, స్నాక్స్, స్వీట్లు ప్రతి మెనూలో చేరిపోయాయి. అంతకుముందు నాన్-వెజ్ అమ్మే వ్యాపారులు కొందరు వెజిటేరియన్ బిజినెస్‌లోకి మారగా, మరికొందరు నగరాన్ని విడిచి వెళ్లిపోయారు.

అయితే, ఈ నిర్ణయాన్ని అందరూ స్వాగతించలేదు. నచ్చిన ఆహారం తినే స్వేచ్ఛను హరించడమేనని కొందరు కోర్టు మెట్లెక్కారు. స్థానిక ముస్లింలు, నాన్ జైన్ ప్రజలు తమ జీవనోపాధి దెబ్బతింటుందని ఆందోళన వ్యక్తం చేశారు. మతపరమైన నమ్మకాలు వర్సెస్ వ్యక్తిగత స్వేచ్ఛపై చర్చ ఇప్పటికీ నడుస్తూనే ఉంది.

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
జీవనశైలి
ఆహారం
భారత దేశం
ఏషియానెట్ న్యూస్
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్

Latest Videos
Recommended Stories
Recommended image1
Boys vs Girls Height : మహిళల కంటే మగవాళ్లే ఎక్కువ పొడవు పెరుగుతారు? కారణమేంటో తెలుసా?
Recommended image2
Telugu Saying: అంతా మనవాళ్లే కానీ.. అన్నానికి రమ్మనే వాళ్లు లేరు! ఈ కాలానికి తగ్గ సామెత!
Recommended image3
Water Tank: వాటర్ ట్యాంకును టెర్రస్ పై కాకుండా నేలపై కడితే ఏమవుతుంది?
Related Stories
Recommended image1
Normal Petrol vs Power Petrol: నార్మల్ పెట్రోల్ vs స్పీడ్ vs పవర్ పెట్రోల్ మధ్య ఉన్న తేడాలు ఏంటి? మీ వాహనానికి ఏది బెస్ట్?
Recommended image2
Parking Rules: రోడ్డుపై బండి పార్క్ చేస్తే ఇక అమ్మేస్తారు జాగ్రత్త.. తెలంగాణలో కొత్త పార్కింగ్ రూల్స్!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved