MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Feature
  • Independence Day: దేశానికి స్వాతంత్య్రం వచ్చిన రోజున మహాత్మా గాంధీ ఏం చేశారో తెలుసా?

Independence Day: దేశానికి స్వాతంత్య్రం వచ్చిన రోజున మహాత్మా గాంధీ ఏం చేశారో తెలుసా?

Independence Day: 1947 ఆగస్టు 15న దేశమంతా స్వాతంత్య్ర వేడుకల్లో మునిగిపోతే మహాత్మా గాంధీ ఎందుకు ఏడ్చారో తెలుసా? స్వాతంత్ర వేడుకల ఉపన్యాసం కూడా ఇవ్వకుండా గాంధీ ఆ రోజు ఏం చేశారు? ఎక్కడున్నారు?

3 Min read
Author : Mahesh Rajamoni
Published : Aug 15 2026, 11:47 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17
ఆగస్టు 15, 1947: బాపూజీ రోజంతా ఏం చేశారు? తెలిస్తే షాక్ అవుతారు
Image Credit : Chatgpt

ఆగస్టు 15, 1947: బాపూజీ రోజంతా ఏం చేశారు? తెలిస్తే షాక్ అవుతారు

1947, ఆగస్టు 15న భారత్‌కు ఆంగ్లేయుల పాలన నుంచి స్వేచ్ఛ లభించింది. శతాబ్దాల నిరీక్షణ ఫలించడంతో దేశవ్యాప్తంగా ప్రజలు ఆనందోత్సాహాల్లో తేలిపోయారు. పల్లెల నుంచి పట్టణాల వరకు ఎక్కడ చూసినా పండుగ వాతావరణం కనిపించింది. అయితే, భారతదేశానికి స్వాతంత్య్రం తెచ్చిన జాతిపిత మహాత్మా గాంధీ ఆ చరిత్రాత్మక రోజున ఏం చేస్తున్నారు? వేడుకల్లో పాల్గొన్నారా? లేదా? అనే ప్రశ్న ప్రతి ఒక్కరి మనసులోనూ మెదులుతుంది. నిజానికి, ఆ రోజున గాంధీజీ చేసిన పనుల గురించి చాలామందికి తెలిసింది చాలా తక్కువ. గాంధీ హెరిటేజ్ పోర్టల్ లోని వివరాల ప్రకారం ఆ రోజు ఆయన ఏం చేశారో పూర్తి వివరాలు తెలుసుకుందాం.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
27
ఢిల్లీలో వేడుకలు.. గాంధీజీ మాత్రం కోల్‌కతాలోనే
Image Credit : Asianet News

ఢిల్లీలో వేడుకలు.. గాంధీజీ మాత్రం కోల్‌కతాలోనే

భారతదేశమంతా స్వాతంత్య్ర సంబరాలు జరుపుకుంటున్న సమయంలో మహాత్మా గాంధీ రాజధాని ఢిల్లీలో లేరు. ఆయన ఆ సమయంలో కలకత్తా లో ఉన్నారు. అందరినీ ఆశ్చర్యపరిచే విషయమేమిటంటే, దేశానికి స్వేచ్ఛ వచ్చిన ఆ శుభదినాన గాంధీజీ ఎలాంటి పెద్ద వేడుకలు జరుపుకోలేదు. కనీసం స్వాతంత్య్ర ఉత్సవాల గురించి ఉపన్యాసం కూడా ఇవ్వలేదు. ఆయన ఆ రోజంతా ఉపవాసం, ప్రార్థనలు, ప్రజలను కలవడానికే కేటాయించారు. గాంధీ హెరిటేజ్ పోర్టల్ సమాచారం ప్రకారం.. ఆగస్టు 15, 1947న ఆయన పూర్తిగా ప్రార్థనలు, ఉపవాసంలో గడిపారు.

Related Articles

Related image1
Love Signs: ఒక అమ్మాయి మిమ్మల్ని ప్రాణంగా ప్రేమిస్తోందని చెప్పకనే చెప్పే 7 సీక్రెట్ సిగ్నల్స్ ఇవే
Related image2
OTT Patriotic Movies: గూస్‌బంప్స్ గ్యారంటీ.. స్వాతంత్య్ర దినోత్సవం వేళ ఓటీటీలో రచ్చ చేస్తున్న టాప్ సినిమాలు
37
హింస, అల్లర్ల మధ్య శాంతి కోసం ప్రయత్నం
Image Credit : Nehru Memorial Museum and Library/Wikimedia Commons

హింస, అల్లర్ల మధ్య శాంతి కోసం ప్రయత్నం

ఒకవైపు స్వాతంత్య్రం వస్తుందన్న ఆనందం ఉన్నప్పటికీ, మరోవైపు దేశం రెండు ముక్కలుగా విడిపోతోంది. నాటి విభజన కారణంగా అనేక ప్రాంతాల్లో హిందూ-ముస్లింల మధ్య ఘోరమైన అల్లర్లు జరుగుతున్నాయి. ఇలాంటి ఉద్రిక్త పరిస్థితుల్లో గాంధీజీ ఢిల్లీలో సంబరాలు చేసుకోకుండా, కలకత్తాలోనే ఉండి శాంతి భద్రతలను కాపాడేందుకు ప్రయత్నించారు. ఆగస్టు 13 నుంచే ఆయన కలకత్తాలోని బెలియాఘాటా ప్రాంతంలో ఉన్న 'హైదరీ మ్యాన్షన్'లో బస చేశారు. మతపరమైన అల్లర్ల మధ్య హిందూ-ముస్లింల మధ్య ఐక్యత, శాంతిని నెలకొల్పడానికే ఆయన అక్కడ ఉన్నారు.

47
24 గంటల పాటు కఠిన ఉపవాసం
Image Credit : Getty

24 గంటల పాటు కఠిన ఉపవాసం

ఆగస్టు 14 సాయంత్రం జరిగిన ప్రార్థనా సమావేశంలోనే గాంధీజీ ఒక కీలక విషయాన్ని వెల్లడించారు. ఆగస్టు 15న తాను 24 గంటల పాటు ఉపవాసం ఉంటానని స్పష్టం చేశారు. ఆ రోజున కేవలం ప్రార్థనలు చేయడం, రాట్నంపై నూలు వడకడం మాత్రమే ఆయన కార్యక్రమాలుగా పెట్టుకున్నారు. గాంధీజీకి ఆగస్టు 15 కేవలం సంతోషించే రోజు మాత్రమే కాదు. ఎందుకంటే ఒకవైపు దేశానికి స్వేచ్ఛ వచ్చినా, మరోవైపు విభజన వల్ల లక్షలాది మంది ప్రజలు హింస, బాధలను అనుభవిస్తున్నారు. అందుకే ఆయన ఆ రోజును ఆత్మపరిశీలనకు కేటాయించారు.

57
గాంధీజీ దర్శనం కోసం తరలివచ్చిన జనం
Image Credit : Getty

గాంధీజీ దర్శనం కోసం తరలివచ్చిన జనం

ఆగస్టు 15 ఉదయం నుంచే గాంధీజీ బస చేసిన ప్రదేశానికి ప్రజలు భారీగా రావడం ప్రారంభించారు. గాంధీ హెరిటేజ్ పోర్టల్ ప్రకారం, రోజంతా ఆయనను కలవడానికి జనాలు వస్తూనే ఉన్నారు. గాంధీజీ మనవరాలు మను గాంధీ ఆ రోజు సంఘటనల గురించి రాస్తూ.. బాపూజీ ఆ రోజు తన వ్యక్తిగత పనులేవీ చేసుకోలేకపోయారని చెప్పారు. ప్రతి అర గంటకు ఒకసారి ఆయన ప్రజలను కలవడానికి బయటకు రావలసి వచ్చింది. వేలాది మంది ప్రజలు ఆయన దర్శనం కోసం నిరంతరం వేచి చూశారు.

67
నాయకులు, విద్యార్థులతో భేటీ
Image Credit : Getty

నాయకులు, విద్యార్థులతో భేటీ

కలకత్తాలో హిందూ, ముస్లిం వర్గాల మధ్య తీవ్ర ఉద్రిక్తత నెలకొని ఉంది. అందువల్ల గాంధీజీ ప్రజలతో పాటు స్థానిక నాయకులను నిరంతరం కలుస్తూనే ఉన్నారు. దేశ ప్రజలంతా ఆప్యాయత, శాంతితో కలసి జీవించినప్పుడే ఈ స్వాతంత్య్రానికి నిజమైన అర్థం ఉంటుందని ఆయన గట్టిగా నమ్మారు. ఆ రోజున గాంధీజీ పలు పార్టీల సభ్యులతో కూడా ప్రత్యేకంగా సమావేశమై మాట్లాడారు. అలాగే విద్యార్థులతోనూ ముచ్చటించారు. దేశానికి స్వాతంత్య్రం వచ్చిన ఆ రోజున కూడా గాంధీజీ సమయమంతా దేశ సమస్యలు, ప్రజలతో చర్చలకే సరిపోయింది.

77
సాయంత్రం ప్రార్థనా సమావేశం.. శాంతి సందేశం
Image Credit : our own

సాయంత్రం ప్రార్థనా సమావేశం.. శాంతి సందేశం

రోజంతా ఉపవాసం, సమావేశాల తర్వాత గాంధీజీ సాయంత్రం ప్రార్థనా సమావేశంలో పాల్గొన్నారు. దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తర్వాత మన ముందున్న అతిపెద్ద సవాలు శాంతిభద్రతలను కాపాడుకోవడమేనని ఆయన సందేశం ఇచ్చారు. కలకత్తాలో హిందూ, ముస్లింలు కలసికట్టుగా జీవించి దేశంలోని మిగిలిన ప్రాంతాలకు ఆదర్శంగా నిలవాలని కోరారు. నిజానికి ఆగస్టు 14నే గాంధీజీ మాట్లాడుతూ.. స్వాతంత్య్ర దినోత్సవం తనకు ఒకవైపు సంతోషాన్ని, మరోవైపు దేశ విభజన వల్ల తీవ్ర దుఃఖాన్ని కలిగిస్తోందని వ్యాఖ్యానించారు.

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
స్వాతంత్య్ర దినోత్సవం
భారత దేశం
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్
ఏషియానెట్ న్యూస్

Latest Videos
Recommended Stories
Recommended image1
Dairy Farming: ఆవులు, గేదెలు బాగా పాలివ్వాాలంటే రోజూ ఎంత మేత వేయాలి?
Recommended image2
Snakes : పాముకు కాటేయడమే కాదు కాపాడటం తెలుసు.. ప్రాణాలు తీసే ఈ జీవులు ప్రాణం ఎలా పోస్తాయో తెలుసా?
Recommended image3
'కథ కంచికి మ‌నం ఇంటికి' అని ఎందుకు అంటారో తెలుసా.? దీని వెనుక ఇంత అర్థం ఉందా?
Related Stories
Recommended image1
Love Signs: ఒక అమ్మాయి మిమ్మల్ని ప్రాణంగా ప్రేమిస్తోందని చెప్పకనే చెప్పే 7 సీక్రెట్ సిగ్నల్స్ ఇవే
Recommended image2
OTT Patriotic Movies: గూస్‌బంప్స్ గ్యారంటీ.. స్వాతంత్య్ర దినోత్సవం వేళ ఓటీటీలో రచ్చ చేస్తున్న టాప్ సినిమాలు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved