MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today Rasi Phalalu
Bigg Boss Telugu 10
Bigg Boss Hosts Remuneration
Bigg Boss Mary Kom
OTT Releases This Week
IMD Weather Update
iPhone 18 Pro
Smriti Mandhana
Sahaa Movie Review
Bigg Boss Telugu
Chiranjeevi's Mother
Romanchakam Movie Review
Allari Naresh
Tollywood Cinema
Hardik Pandya
Team India T20 Squad
Irumudi 12 Days Collections
Hello Brother Movie Review
Andhra Pradesh Startup Hub
Horror Movies Streaming on OTT
Ishtakameshwari Temple
  • Home
  • Feature
  • Indian Currency: చిరగని, నలగని, నీటిలో నానిపోని ప్లాస్టిక్ కరెన్సీ నోట్లు.. వచ్చే ఏడాదికల్లా మనచేతిలో

Indian Currency: చిరగని, నలగని, నీటిలో నానిపోని ప్లాస్టిక్ కరెన్సీ నోట్లు.. వచ్చే ఏడాదికల్లా మనచేతిలో

Indian Currency: ఇప్పుడున్న కరెన్సీ నోట్లు చిరిగిపోవడమో, నలిగిపోవడమో జరుగుతాయి. ఒక్కోసారి పిల్లలు తెలియక చింపేస్తారు కూడా. ఒక్క ఏడాది ఆగితే ప్లాస్టిక్ కరెన్సీ నోట్లు వచ్చేస్తాయి. అప్పుడు చిరిగిపోతాయన్న టెన్షనే ఉండదు.

2 Min read
Author : Haritha Chappa
Published : Jul 27 2026, 11:16 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
13
ప్లాస్టిక్ కరెన్సీ వచ్చేస్తోంది
Image Credit : Gemini Ai

ప్లాస్టిక్ కరెన్సీ వచ్చేస్తోంది

ప్రస్తుతం మనం వాడే కరెన్సీ నోట్లు మందపాటి కాగితంతో తయారుచేసివి. కానీ పిల్లలు చింపినా చిరిగిపోతాయి. ఈ సమస్య లేకుండా కాగితపు కరెన్సీ స్థానంలో ఇకపై అత్యంత మన్నికైన 'ప్లాస్టిక్ కరెన్సీ'ని అందుబాటులోకి తీసుకురావడానికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ప్రయత్నిస్తోంది. సాధారణంగా మనం ఉపయోగించే కాగితపు నోట్లు నీటిలో తడిసినా, తరచూ చేతులు మారడం వల్ల నలిగిపోయినా లేదా కొద్ది రోజులకే చిరిగిపోయి చెల్లకుండా పోయేవి. దీనివల్ల ఆర్బీఐ ప్రతి ఏటా భారీగా పాత నోట్లను రద్దు చేస్తూ కొత్త కాగితపు నోట్లను ముద్రించాల్సి వచ్చేది. అయితే ఈ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపుతూ, నీటిలో తడిసినా నానని, ఎంత వాడినా సులభంగా చిరిగిపోని పాలిమర్ షీట్లతో నోట్లను తయారు చేసేందుకు ఆర్బీఐ ప్రణాళికలు సిద్ధం చేసింది. ఈ ప్లాస్టిక్ నోట్లు మార్కెట్లోకి వస్తే నోట్లు త్వరగా పాడైపోతాయనే భయం ప్రజలకు పూర్తిగా తొలగిపోనుంది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
23
ప్రయోగం మొదలైపోయింది
Image Credit : Asianet News

ప్రయోగం మొదలైపోయింది

ప్లాస్టిక్ నోట్ల ఉత్పత్తికి కావలసిన నాణ్యమైన పాలిమర్ షీట్లను సరఫరా చేయడానికి ఆర్బీఐ ఇప్పటికే అంతర్జాతీయ స్థాయిలో గ్లోబల్ టెండర్లను ఆహ్వానించింది. ప్రారంభంలో రెండు వేర్వేరు డినామినేషన్ల నోట్ల కోసం మొత్తం 68,000 రీముల పాలిమర్ షీట్లను కొనుగోలు చేయాలని నిర్ణయించింది. ఈ ప్రయోగం విజయవంతమైతే, 2027 నాటికి పూర్తి స్థాయిలో ఈ ప్లాస్టిక్ నోట్లను దేశ వ్యాప్తంగా ప్రజలకు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. ఈ నోట్ల తయారీ విషయంలో దేశ భద్రతకు అత్యంత ప్రాధాన్యతనిస్తూ ఆర్బీఐ కఠినమైన నిబంధనలను విధించింది. ఈ టెండర్లలో పాల్గొనే కంపెనీలు కేంద్ర ప్రభుత్వం నుండి భద్రతా అనుమతి పొందడంతో పాటు, చైనా లేదా పాకిస్తాన్ దేశాలతో ఎలాంటి వ్యాపార సంబంధాలు ఉండకూడదని స్పష్టం చేసింది. అంతేకాకుండా, భారత్ కోసం రూపొందించే ప్రత్యేక పాలిమర్ షీట్లను వేరే ఏ ఇతర మూడో దేశానికి విక్రయించకూడదనే నిబంధనను కూడా పెట్టింది.

Related Articles

Related image1
House Construction: వంద గజాల్లో ఒక అంతస్తు ఇంటిని కడితే ఎంత ఖర్చవుతుంది? దేనికి ఎంత పెట్టాలి?
Related image2
Vande Bharat Train cost: ఒక వందే భారత్ రైలు తయారు చేయడానికి ఎంత ఖర్చువుతుంది?
33
ప్లాస్టిక్ నోట్ల వల్ల లాభాలు
Image Credit : Pixabay

ప్లాస్టిక్ నోట్ల వల్ల లాభాలు

ఈ ప్లాస్టిక్ కరెన్సీ నోట్లు మార్కెట్లోకి రావడం వల్ల సాధారణ పౌరులతో పాటు దేశ ఆర్థిక వ్యవస్థకు కూడా ఎన్నో ప్రయోజనాలు కలగనున్నాయి. ఇవి నీటిని పీల్చుకోవు కాబట్టి మురికి కావడం, తడిసిపోవడం లేదా చిరిగిపోవడం జరగదు. ఫలితంగా ఒక్కో నోటు ఆయుష్షు సాధారణ కాగితపు నోటు కంటే నాలుగైదు రెట్లు ఎక్కువగా ఉంటుంది. అంతేకాకుండా ఈ పాలిమర్ నోట్లపై అత్యంత సంక్లిష్టమైన, అధునాతనమైన సెక్యూరిటీ ఫీచర్లను అమర్చడం సాధ్యమవుతుంది కాబట్టి నకిలీ నోట్ల చలామణిని దాదాపు పూర్తిగా అరికట్టవచ్చు. ప్రభుత్వం వైపు నుంచి చూస్తే, పదే పదే కొత్త నోట్లను ముద్రించాల్సిన అవసరం తగ్గడం వల్ల కరెన్సీ ముద్రణ, రవాణా ఖర్చులు భారీగా ఆదా అవుతాయి. అంతర్జాతీయంగా ఇప్పటికే అనేక అభివృద్ధి చెందిన దేశాల్లో విజయవంతంగా అమలవుతున్న ఈ ప్లాస్టిక్ కరెన్సీ వ్యవస్థ, త్వరలోనే మన భారతదేశంలో కూడా అందుబాటులోకి రానుండటం విశేషం.

About the Author

HC
Haritha Chappa
హరిత ఏసియా నెట్‌లో చీఫ్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. జర్నలిజంలో పీజీ పూర్తి చేశారు. ఈనాడు, సమయం, ఆంధ్రజ్యోతి, ఏబీపీ నెట్ వర్క్, హిందూస్థాన్ టైమ్స్ లో పనిచేశారు. ప్రింట్, డిజిటర్ మీడియాలో 18 ఏళ్ల అనుభవం ఉంది. ఏసియా నెట్ లైఫ్ స్టైల్, బిజినెస్, ఓటీటీ మూవీ కంటెంట్, ఆస్ట్రాలజీ కంటెంట్ రాస్తారు.
భారత దేశం
వైరల్ న్యూస్

Latest Videos
Recommended Stories
Recommended image1
Triphala Tree: నల్లమలలో త్రిఫల వృక్షం.. ఒక్క కాయ తింటే ముసలితనమే రాదా? ఆ సంజీవని చెట్టు ఎక్కడుంది?
Recommended image2
Income Tax Rules : ఓ ఫ్యామిలీ ఇంట్లో ఎంత డబ్బు దాచుకోవచ్చు? ఎక్కువుంటే ఏమైనా ప్రాబ్లమా?
Recommended image3
Facts : ఏ జంతువుకు ఎన్నిపళ్ళు ఉంటాయి? నోట్లో ఒక్క పన్ను లేని జీవి 14 వేల పళ్లుండే జీవిని తినేస్తుందా..!
Related Stories
Recommended image1
House Construction: వంద గజాల్లో ఒక అంతస్తు ఇంటిని కడితే ఎంత ఖర్చవుతుంది? దేనికి ఎంత పెట్టాలి?
Recommended image2
Vande Bharat Train cost: ఒక వందే భారత్ రైలు తయారు చేయడానికి ఎంత ఖర్చువుతుంది?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved