MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Sports
  • Cricket
  • RCB Stampede : ఆర్సీబీ సంబరాల్లో తొక్కిసలాట.. 11 మంది మృతి.. పలువురురి పరిస్థితి విషమం

RCB Stampede : ఆర్సీబీ సంబరాల్లో తొక్కిసలాట.. 11 మంది మృతి.. పలువురురి పరిస్థితి విషమం

RCB Stampede: పంజాబ్ కింగ్స్ ను ఓడించి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు ఐపీఎల్ 2025 ఛాంపియన్ గా నిలిచింది. అయితే, బెంగళూరులో ఆర్సీబీ గెలుపు సంబరాల్లో తొక్కిసలాట జరిగింది. 

1 Min read
Mahesh Rajamoni
Published : Jun 04 2025, 05:41 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
ఆర్సీబీ గెలుపు సంబరాల్లో తొక్కిసలాట
Image Credit : Asianet News

ఆర్సీబీ గెలుపు సంబరాల్లో తొక్కిసలాట

RCB victory parade: ఐపీఎల్ 2025 ఛాంపియన్ గా నిలిచిన తర్వాత ఆర్సీబీ జట్టుకు బెంగళూరులో ఘన స్వాగత లభించింది. అయితే, ఆర్సీబీ సంబరాల్లో అపశృతి చోటుచేసుకుంది. నగరంలోని చిన్నస్వామి క్రికెట్ స్టేడియం వద్దకు పెద్ద సంఖ్యలో అభిమానులు వచ్చారు. ఆర్సీబీ ఐపీఎల్ 2025 ట్రోఫీ గెలిచిన క్రమంలో జరిగిన సంబరారాల్లో తొక్కిసలాట చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో 11 మంది ప్రాణాలు కోల్పోయారు. 50 మందికి పైగా గాయపడ్డారు. పలువురి పరిస్థితి విషమంగా ఉందని సమాచారం.

26
భారీ సంఖ్యలో అభిమానులు రావడంతో తొక్కిసలాట
Image Credit : Asianet News

భారీ సంఖ్యలో అభిమానులు రావడంతో తొక్కిసలాట

ఐపీఎల్ 2025 టైటిల్‌ను గెలుచుకున్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) జట్టు బుధవారం మధ్యాహ్నం బెంగళూరులో ఘన స్వాగతం అందుకుంది. ‘గార్డెన్ సిటీ’గా పేరుగాంచిన బెంగళూరులో రోడ్ల వెంట వేలాది మంది అభిమానులు నిలబడి, జట్టును స్వాగతం పలుకుతూ ఆర్సీబీ ఆర్సీబీ అంటూ భారీగా నినాదాలు చేశారు.

Related Articles

Related image1
Victory Parade: RCB కి గ్రాండ్‌ వెల్‌కమ్‌.. ఎరుపు మయమైన బెంగళూరు
Related image2
RCB vs PBKS : పంజాబ్ కింగ్స్ ఓటమికి కారణాలు ఇవే
36
బెంగళూరు ఎయిర్‌పోర్ట్‌ నుంచి విధాన సౌధకు ఆర్సీబీ జట్టు
Image Credit : Asianet News

బెంగళూరు ఎయిర్‌పోర్ట్‌ నుంచి విధాన సౌధకు ఆర్సీబీ జట్టు

ఆర్సీబీ జట్టుకు బెంగళూరు ఎయిర్‌పోర్ట్‌లో కర్ణాటక ఉపముఖ్యమంత్రి డి.కే. శివకుమార్ స్వాగతం పలికారు. అక్కడి నుంచి జట్టు వాహన బృందం నేరుగా ముఖ్యమంత్రి సిద్ధరామయ్య కార్యాలయమైన విధాన సౌధకు వెళ్లింది. మార్గమధ్యంలో జట్టు చూసేందుకు అభిమానులు రెండు వైపులా పెద్దఎత్తున కనిపించారు.

46
ఫ్యాన్ ఎంగేజ్‌మెంట్ రద్దు
Image Credit : Asianet News

ఫ్యాన్ ఎంగేజ్‌మెంట్ రద్దు

ముఖ్యమంత్రి సిద్ధరామయ్యతో సమావేశమైన తర్వాత, జట్టు చిన్నస్వామి స్టేడియంకు ప్రయాణమైంది. అక్కడ అభిమానులతో ఫ్యాన్ ఎంగేజ్‌మెంట్ నిర్వహించనున్నారు. అయితే, తొక్కిసలాట కారణంగా దీనిని రద్దు చేశారు.

56
ఓపెన్ టాప్ బస్సులో ఊరేగింపు రద్దు
Image Credit : Asianet News

ఓపెన్ టాప్ బస్సులో ఊరేగింపు రద్దు

అయితే, విధాన సౌధ నుంచి చిన్నస్వామి స్టేడియం వరకు ఓపెన్ టాప్ బస్సులో ఊరేగింపు ఉండాల్సి ఉండగా, ట్రాఫిక్ సమస్యల కారణంగా అది రద్దు చేశారు.

66
50 మందికి పైగా గాయపడ్డారు
Image Credit : Asianet News

50 మందికి పైగా గాయపడ్డారు

ఈ తొక్కిసలాటలో చాలా మంది గాయపడ్డారు. మరణాలు మరింత పెరిగే అవకాశముంది. 

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
ఏషియానెట్ న్యూస్
క్రికెట్
క్రీడలు
ఇండియన్ ప్రీమియర్ లీగ్
భారత జాతీయ క్రికెట్ జట్టు
విరాట్ కోహ్లీ
బెంగళూరు

Latest Videos
Recommended Stories
Related Stories
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2025 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved