- Home
- Business
- Petrol Diesel Price: భారీగా పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు.. ఇప్పుడే ఎందుకు పెంచారు? కారణాలు చూస్తే షాక్ అవుతారు !
Petrol Diesel Price: భారీగా పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు.. ఇప్పుడే ఎందుకు పెంచారు? కారణాలు చూస్తే షాక్ అవుతారు !
Petrol Diesel Price: దేశవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరలు లీటరుకు రూ. 3 పెరిగాయి. ప్రస్తుతం పెట్రోల్, డీజిల్ ధరలు ఎలా ఉన్నాయి? ఈ పెంపు వెనుక ఉన్న అంతర్జాతీయ కారణాలు, యుద్ధ మేఘాలు, మీ జేబుపై పడే ప్రభావం వంటి వివరాలు ఇక్కడ తెలుసుకుందాం.

Petrol Diesel Price: పెట్రోల్, డీజిల్ ధరల షాక్.. హైదరాబాద్లో రూ. 110 దాటిన పెట్రోల్
దేశవ్యాప్తంగా వాహనదారులకు ఇవాళ తెల్లవారుజాము నుంచే పెట్రోల్ బాంబ్ పేలింది. దాదాపు నాలుగేళ్లుగా స్థిరంగా ఉన్న ఇంధన ధరలను పెంచుతూ కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. లీటరుకు రూ. 3 మేర పెరగడంతో సామాన్యుడి బడ్జెట్ ఒక్కసారిగా పెరిగిపోయింది. హైదరాబాద్లో పెట్రోల్ ధర రూ. 110.89కి చేరగా, ఏపీలో మరికొంత ఎక్కువగా రూ. 113.03 వద్ద ఉంది.
వివిధ నగరాల్లో పెట్రోల్, డీజిల్ కొత్త ధరలు ఇలా ఉన్నాయి..
- హైదరాబాద్: పెట్రోల్ రూ.110.89, డీజిల్ రూ.98.70
- ఢిల్లీ: పెట్రోల్ రూ.97.77, డీజిల్ రూ.90.67
- ముంబై: పెట్రోల్ రూ.106.54, డీజిల్ రూ.93.03
- కోల్కతా: పెట్రోల్ రూ.108.45, డీజిల్ రూ.95.02
- చెన్నై: పెట్రోల్ రూ.103.80, డీజిల్ రూ.95.39
- బెంగళూరు: పెట్రోల్ రూ.105.96, డీజిల్ రూ.93.99
అయితే, పెట్రోల్, డీజిల్ ధరలను ఇప్పుడు ఎందుకు పెంచారు? ఈ పెంపు వెనుక ఉన్న కారణాలు గమనిస్తే..

గ్లోబల్ పాలిటిక్స్: అమెరికా-ఇరాన్ యుద్ధం దెబ్బ
పెట్రోల్ రేట్లు పెరగడానికి ప్రధాన కారణాల్లో పశ్చిమాసియాలో నెలకొన్ని ఉద్రిక్త పరిస్థితులు. గత మూడు నెలలుగా అమెరికా, ఇరాన్ మధ్య ముదురుతున్న ఉద్రిక్తతలు ప్రపంచ చమురు మార్కెట్ను ప్రభావితం చేస్తున్నాయి. ముఖ్యంగా ఇరాన్ తన ఆధీనంలో ఉన్న హోర్ముజ్ జలసంధిని మూసివేయడం లేదా అక్కడ ఆంక్షలు విధించడం వల్ల సముద్ర మార్గంలో జరగాల్సిన చమురు రవాణా ఆగిపోయింది.
ప్రపంచవ్యాప్తంగా సరఫరా అయ్యే ముడి చమురులో దాదాపు 20% ఈ మార్గం గుండానే వెళ్లాలి. సరఫరా తగ్గడంతో డిమాండ్ పెరిగి, క్రూడ్ ఆయిల్ ధరలు పెరిగాయి. భారత్ తన అవసరాలకు 80% దిగుమతులపైనే ఆధారపడుతుంది కాబట్టి, ఆ గ్లోబల్ మంట ఇక్కడ పెట్రోల్ బంకులను తాకింది.
చమురు కంపెనీల నష్టాలు కూడా ఒక కారణం
అంతర్జాతీయ మార్కెట్లో క్రూడ్ ఆయిల్ ధరలు పెరిగినప్పటికీ, దేశీయంగా హిందూస్తాన్ పెట్రోలియం, భారత్ పెట్రోలియం వంటి కంపెనీలు ఇప్పటివరకు ధరలను పెంచకుండా భరించాయి. దీనివల్ల ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు (OMCs) భారీగా నష్టపోయాయి.
రూపాయి విలువ పడిపోవడం కూడా దిగుమతి వ్యయాన్ని పెంచింది. ప్రధాని మోదీ గత రెండు రోజులుగా ఇంధన పొదుపు మంత్రాన్ని చెప్పడం వెనుక ఉన్న అసలు కారణం ఇదే. మనం ఎంత తక్కువ ఇంధనం వాడితే, దేశానికి అంత తక్కువ విదేశీ మారకం నిల్వలు ఖర్చవుతాయి.
పెట్రోల్ ధరల మంట.. మీ జేబుపై పడే ప్రభావం ఎంత?
పెట్రోల్, డీజిల్ ధరలు పెరగడం అంటే కేవలం బైకులు, కార్ల వాడకం ఖరీదవ్వడం మాత్రమే కాదు. డీజిల్ రేట్లు పెరగడంతో రవాణా ఖర్చులు భారమవుతాయి. దీనివల్ల రాబోయే రోజుల్లో కూరగాయలు, నిత్యావసర వస్తువులు, పాల ధరలు పెరిగే ఛాన్స్ ఉంది.
ఆర్థిక నిపుణుల అభిప్రాయం ప్రకారం, పశ్చిమాసియాలో యుద్ధం సద్దుమణిగితే తప్ప ధరలు తగ్గే అవకాశం లేదు. కాబట్టి సామాన్యుడు మరింత కాలం పెట్రో మంటను భరించక తప్పని పరిస్థితి కనిపిస్తోంది. పరిస్థితి ఇలాగే కొనసాగితే మళ్లీ ధరులు పెరిగే అవకాశముంది.

