MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
ICC WTC Standings 2026-27
IMD Weather Update
Today's Rasi Phalalu
Toxic Movie Box Office Collections
G Subhash Chandra
Actress Hema Health Update
Tollywood Stylish Heroes
September OTT Releases
Yash Mother vs Allu Aravind
New Rules in Schools
Nepal Flash Flood
  • Home
  • Business
  • 8th Pay Commission DA Hike: 63 శాతానికి డీఏ.. కేంద్రం అదిరిపోయే న్యూస్ ! జీతాలు ఎంత పెరుగుతాయంటే?

8th Pay Commission DA Hike: 63 శాతానికి డీఏ.. కేంద్రం అదిరిపోయే న్యూస్ ! జీతాలు ఎంత పెరుగుతాయంటే?

8th Pay Commission DA Hike: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు జనవరిలో 5 శాతం డీఏ పెంపు అందే అవకాశం ఉంది. 8వ వేతన సంఘం అమలుకు ముందే 63 శాతానికి డీఏ చేరనుందని అంచనా. పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకుందాం.

3 Min read
Author : Mahesh Rajamoni
Published : Jan 10 2026, 04:23 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
8వ వేతన సంఘం బాంబ్ పేలింది.. ఇక ఉద్యోగులకు పండగే పండగ!
Image Credit : our own

8వ వేతన సంఘం బాంబ్ పేలింది.. ఇక ఉద్యోగులకు పండగే పండగ!

రోజురోజుకూ పెరుగుతున్న నిత్యావసర వస్తువుల ధరలు సామాన్యుడి జేబుకు చిల్లులు పెడుతున్నాయి. ఇంటి అద్దెలు, రేషన్ సరుకులు, మందులు, పిల్లల చదువులు ఇలా ప్రతీది ఖరీదైన వ్యవహారంగా మారుతోంది. ఈ తరుణంలో జీతాలు లేదా పెన్షన్ పెంపు వార్త వింటే ఉద్యోగులకు కలిగే ఉపశమనం అంతా ఇంతా కాదు. సరిగ్గా ఇలాంటి శుభవార్తే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్ల కోసం జనవరిలోనే రాబోతోంది.

8వ వేతన సంఘం (8th Pay Commission) ఏర్పాటు ప్రక్రియ ప్రారంభమైన వేళ, డియర్‌నెస్ అలవెన్స్ (DA), డియర్‌నెస్ రిలీఫ్ (DR) విషయంలో భారీ పెంపు ఉండవచ్చని అంచనాలు వెలువడుతున్నాయి. జనవరి నెలలోనే డీఏ సుమారు 5 శాతం వరకు పెరిగే అవకాశం ఉందని తాజా గణాంకాలు సూచిస్తున్నాయి.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
డీఏ 5 శాతం పెరిగే అవకాశం ఉందా?
Image Credit : Getty

డీఏ 5 శాతం పెరిగే అవకాశం ఉందా?

కేంద్ర కార్మిక, ఉపాధి మంత్రిత్వ శాఖ నవంబర్ 2025 నెలకు సంబంధించిన AICPI-IW (పారిశ్రామిక కార్మికుల కోసం వినియోగదారుల ధరల సూచిక) గణాంకాలను విడుదల చేసింది. ఈ సూచిక 148.2 పాయింట్ల వద్ద నమోదైంది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఇచ్చే డీఏ, పెన్షనర్లకు ఇచ్చే డీఆర్ నేరుగా ఈ ఇండెక్స్‌పైనే ఆధారపడి ఉంటాయి.

దేశవ్యాప్తంగా ఆహార పదార్థాలు, నివాసం, వస్త్రాలు, ఇంధనం, ఆరోగ్యం, రవాణా, విద్య వంటి అత్యవసర సేవల ధరలలో వచ్చే మార్పులను ఈ సూచిక ప్రతిబింబిస్తుంది. ప్రస్తుతం అందుబాటులో ఉన్న ఈ గణాంకాల ఆధారంగా, ఈ ఏడాది జనవరిలోనే డీఏ, డీఆర్ 5 శాతం పాయింట్ల మేర పెరిగే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది.

Related Articles

Related image1
Jallikattu : రక్తచరిత్ర కాదు.. ఇది రక్తం మరిగే ఆట.. జల్లికట్టు గురించి తెలిస్తే గూస్ బంప్స్ గ్యారెంటీ !
Related image2
Ciel Tower : సామాన్యులకు అందనంత ఎత్తు.. ఈ హోటల్‌లో ఒక్క రోజు గడపాలంటే ఆస్తులు అమ్మాల్సిందేనా?
35
63 శాతానికి చేరుకోనున్న డీఏ
Image Credit : Gemini

63 శాతానికి చేరుకోనున్న డీఏ

కేంద్ర ప్రభుత్వం గతంలో జూలై 2025లో డీఏను 4 శాతం పెంచడంతో అది 54 శాతం నుంచి 58 శాతానికి చేరిన విషయం తెలిసిందే. తాజా అంచనాల ప్రకారం, జనవరిలో 5 శాతం పెంపునకు ఆమోదం లభిస్తే, మొత్తం డీఏ 61 శాతం నుండి 63 శాతం పరిధిలోకి చేరుకునే అవకాశం ఉంది. అయితే, దీనిపై తుది నిర్ణయం తీసుకోవడానికి డిసెంబర్ 2025 నెలకు సంబంధించిన AICPI-IW డేటా కీలకం కానుంది. త్వరలోనే ప్రభుత్వం అధికారిక ప్రకటన చేసే అవకాశం ఉంది.

45
8వ వేతన సంఘం ఎప్పటి నుండి అమలవుతుంది?
Image Credit : stockPhoto

8వ వేతన సంఘం ఎప్పటి నుండి అమలవుతుంది?

కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే అధికారికంగా 8వ వేతన సంఘాన్ని ఏర్పాటు చేసింది. ఈ కమిషన్ తన పనిని కూడా ప్రారంభించింది. ఈ కమిషన్‌కు మాజీ సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ రంజనా ప్రకాష్ దేశాయ్ అధ్యక్షత వహిస్తున్నారు. ప్రొఫెసర్ పులక్ ఘోష్ పార్ట్-టైమ్ మెంబర్‌గా, పంకజ్ జైన్ మెంబర్-సెక్రటరీగా నియమితులయ్యారు. కమిషన్ విధివిధానాలు కూడా ఖరారయ్యాయి.

ప్రభుత్వ అధికారిక టైమ్‌లైన్ ప్రకారం, ఈ కమిషన్ సిఫార్సులు 1 జనవరి 2026 నుండి అమలులోకి రావాల్సి ఉంది. అయితే, రిపోర్టు తయారీ, అమలు ప్రక్రియకు సుమారు రెండేళ్ల సమయం పట్టవచ్చని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అప్పటి వరకు ఉద్యోగుల వేతనాలు, పెన్షన్లు 7వ వేతన సంఘం నిబంధనల ప్రకారమే కొనసాగుతాయి. ఈ మధ్య కాలంలో పెరిగే డీఏ మాత్రమే ఉద్యోగులకు తక్షణ ఉపశమనాన్ని ఇస్తుంది.

55
50 లక్షల మంది ఉద్యోగులకు గుడ్ న్యూస్.. జీతాలు ఎంత పెరుగుతాయి?
Image Credit : stockPhoto

50 లక్షల మంది ఉద్యోగులకు గుడ్ న్యూస్.. జీతాలు ఎంత పెరుగుతాయి?

ఒకవేళ జనవరిలో అంచనా వేసినట్లుగా డీఏ పెంపు జరిగితే, దీని వల్ల 50 లక్షల మందికి పైగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, సుమారు 69 లక్షల మంది పెన్షనర్లు నేరుగా లబ్ధి పొందుతారు. వారి నెలవారీ ఆదాయంలో గణనీయమైన పెరుగుదల కనిపిస్తుంది. మార్కెట్లో ద్రవ్యోల్బణం, ధరల పెరుగుదల నేపథ్యంలో ఈ పెంపు ఉద్యోగుల గృహ బడ్జెట్‌ను అదుపులో ఉంచడానికి ఎంతగానో దోహదపడుతుంది.

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు జనవరిలో 5 శాతం డీఏ పెరిగితే, వారి జీతాల్లో స్పష్టమైన పెరుగుదల కనిపిస్తుంది. ఈ పెంపు ఉద్యోగి బేసిక్ పే ఆధారంగా ఉంటుంది. ఉదాహరణకు, ఒక ఉద్యోగి కనీస మూల వేతనం రూ. 18,000 అనుకుంటే, 5 శాతం డీఏ పెంపుతో వారి నెలవారీ జీతం రూ. 900 పెరుగుతుంది. అంటే ఏడాదికి రూ. 10,800 అదనంగా చేతికి అందుతాయి.

అదే విధంగా, ఒకవేళ ఉద్యోగి బేసిక్ పే రూ. 56,900 ఉంటే, వారికి నెలకు రూ. 2,845 చొప్పున, ఏడాదికి ఏకంగా రూ. 34,140 వరకు జీతం పెరిగే అవకాశం ఉంది. ఇవి అంచనాలు మాత్రమే.

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
వ్యాపారం
భారత దేశం
హైదరాబాద్
తెలంగాణ
ఆంధ్ర ప్రదేశ్
అమరావతి
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్

Latest Videos
Recommended Stories
Recommended image1
మ‌రో రంగంలోకి ముఖేష్ అంబానీ.. ధ‌ర‌ 10 రూపాయ‌ల‌ నుంచే ప్రారంభం
Recommended image2
Facts: చెక్‌పై రాసే మొత్తానికి చివర ‘Only’ ఎందుకు రాస్తారు.? అసలు కారణం ఏంటంటే
Recommended image3
7th vs 8th Pay Commission: 8వ పే కమిషన్‌తో మారనున్న జీతాలు.. మీ చేతికి ఎంత వస్తుందో తెలుసా?
Related Stories
Recommended image1
Jallikattu : రక్తచరిత్ర కాదు.. ఇది రక్తం మరిగే ఆట.. జల్లికట్టు గురించి తెలిస్తే గూస్ బంప్స్ గ్యారెంటీ !
Recommended image2
Ciel Tower : సామాన్యులకు అందనంత ఎత్తు.. ఈ హోటల్‌లో ఒక్క రోజు గడపాలంటే ఆస్తులు అమ్మాల్సిందేనా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved