బాగా టెమ్ట్ చేస్తున్నారట... సాయి తేజలో టెన్షన్?
ఓటీటి ఫ్లాట్ ఫామ్స్ వారు పెద్ద సినిమాలని తమ డిజిటిల్ ప్లాట్ ఫామ్ లో స్టీమింగ్ చేసేందుకు విశ్వ ప్రయత్నం చేస్తున్నారు. నిర్మాతలతో, దర్శకులతో మీటింగ్ లు వేస్తున్నారు. నిర్మాతలకు ఫ్యాన్సీ ఆఫర్స్ ఇస్తున్నారు. అదే కోవలో ఇప్పుడు సాయి ధరమ్ తేజ సినిమాకు సైతం ఓ ఫ్యాన్సీ ఆఫర్ ఇచ్చారని మీడియాలో ప్రచారం జరుగుతోంది.
‘‘థియేటర్లో సినిమా చూస్తే వచ్చే అనుభూతి... ఓటీటీలో చూసినప్పుడు రాదనేది నిజం. ఓటీటీలో చూస్తే వచ్చే అనుభూతి థియేటర్లో అసలు రాదు. అయితే, ఈ కరోనా టైమ్లో ఓటీటీ సేఫ్! బయటకు వెళ్లకుండా ఇంట్లో సినిమాను చూడవచ్చు అని చాలా మంది భావిస్తున్నారు. ఈ నేపధ్యంలో ఓటీటి ఫ్లాట్ ఫామ్స్ వారు పెద్ద సినిమాలని తమ డిజిటిల్ ప్లాట్ ఫామ్ లో స్టీమింగ్ చేసేందుకు విశ్వ ప్రయత్నం చేస్తున్నారు. నిర్మాతలతో, దర్శకులతో మీటింగ్ లు వేస్తున్నారు. నిర్మాతలకు ఫ్యాన్సీ ఆఫర్స్ ఇస్తున్నారు. అదే కోవలో ఇప్పుడు సాయి ధరమ్ తేజ సినిమాకు సైతం ఓ ఫ్యాన్సీ ఆఫర్ ఇచ్చారని మీడియాలో ప్రచారం జరుగుతోంది.
వివరాల్లోకి వెళితే...సాయితేజ్ హీరోగా డెబ్యూ డైరెక్టర్ సుబ్బు దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘సోలో బ్రతుకే సో బెటర్’. నభా నటేశ్ హీరోయిన్గా నటించిన ఈ చిత్రాన్ని బి.వి.ఎస్.ఎన్.ప్రసాద్ నిర్మించారు. కరోనా వైరస్ ప్రభావం లేకుండా ఉండుంటే.. ఈ సినిమా మే 1న విడుదల కావాల్సింది. అయితే కోవిడ్ 19 ప్రభావంతో ఈ సినిమా విడుదల ఆగింది. ఇప్పటికింకా రిలీజ్ విషయమై క్లారిటీ రాలేదు.
అయితే ఈ లాక్డౌన్ సమయంలో చాలా సినిమాలు డైరెక్టర్ ఓటీటీ రిలీజ్లయ్యాయి. దాంతో ఇప్పుడు ఓ ప్రముఖ డిజిటల్ సంస్థ ‘సోలో బ్రతుకే సో బెటర్’ సినిమా కోసం నిర్మాతలకు పాతిక కోట్ల మేరకు ఆఫర్ ఇచ్చినట్లు ప్రచారం జరుగుతోంది. మరి నిర్మాతలు ఈ ఆఫర్కు ఓకే చెబుతారో లేక సినిమా థియేటర్స్ ఓపెన్ అయిన తర్వాతే ప్రేక్షకుల ముందుకు వస్తుందో చూడాలి. మరో ప్రక్క ఎక్కడ ఈ సినిమా డిజిటిల్ స్ట్రీమింగ్ ఒప్పుకుంటారో అని సాయి తేజ యమా టెన్షన్ పడుతున్నారట. ఎందుకంటే మిగతా యంగ్ హీరోలెవరూ తమ సినిమాలు ఓటీటికు ఇవ్వటానికి పెద్దగా ఆసక్తి చూపటం లేదు. ఓటీటికు వస్తే తమను ఓటీటి హీరో అంటారని భయపడుతున్నారు.
కెరీర్ ప్రారంభంలో మంచి సక్సెస్ లు అందుకున్నప్పటికీ సాయి ధరంతేజ్. ఆ తర్వాత వరుస ఫ్లాపులతో కూరుకుపోయాడు. అయితే ఈ మెగా మేనల్లుడికి చిత్రలహరి సినిమా హిట్టు అందించి బూస్ట్ ఇచ్చింది. ఆ తర్వాత వచ్చిన ప్రతి రోజు పండగే సినిమా భారీ విజయం నమోదు చేసింది. దాంతో సాయి ధరంతేజ్ కెరీర్ గాడిలో పడ్డారని ఫ్యాన్స్ ఆనందపడ్డారు. ఈ మెగా మేనల్లుడు తర్వాతి సినిమాగా సోలో బ్రతుకే సో అనే టైటిల్ తో నిర్మితమవుతోంది.