రాజ్కుంద్రాపై శిల్పాశెట్టి షాకింగ్ స్టేట్మెంట్.. భర్త ఏం చేస్తున్నాడో తెలియదంటూ చార్జిషీట్..
రాజ్కుంద్రా పోర్నోగ్రఫీ కేసులో అరెస్ట్ అయిన విషయం తెలిసిందే. ఈ కేసులో శిల్పాశెట్టిని సాక్షిగా ఛార్జిషీటులో చేర్చారు. అయితే తనకు తన భర్త ఏం చేస్తున్నాడో తెలియదని శిల్పా చార్జిషీటులో పేర్కొంది.
రాజ్కుంద్రాపై శిల్పాశెట్టి షాకింగ్ కామెంట్ చేసింది. అందరు అవాక్కమయ్యేలా చేసింది. ఆయన ఏం చేస్తున్నాడో తనకు తెలియదంటూ స్టేట్మెంట్ ఇచ్చింది. రాజ్కుంద్రా పోర్నోగ్రఫీ కేసులో అరెస్ట్ అయిన విషయం తెలిసిందే. ఈ కేసులో శిల్పాశెట్టిని సాక్షిగా ఛార్జిషీటులో చేర్చారు. అయితే తనకు తన భర్త ఏం చేస్తున్నాడో తెలియదని శిల్పా చార్జిషీటులో పేర్కొంది. తాను షూటింగ్లో ఎప్పుడూ బిజీగా ఉంటానని, దీంతో రాజ్కుంద్రా ఏం చేస్తుండేవాడో ఎప్పుడూ పెద్దగా పట్టించుకోలేదని పేర్కొంది శిల్పాశెట్టి.
హాట్ షాట్స్, బాలీఫేమ్ యాప్ల గురించి తనకు ఏం తెలియదని శిల్పాశెట్టి చెప్పిన స్టేట్మెంట్లని ముంబయి పోలీసులు రికార్డు చేశారు. ఈ కేసులో మొత్తంగా 1400 పేజీల చార్జిషృట్ని పోలీసులు ఫైర్ చేశారు. ఇదిలా ఉంటే పోర్నోగ్రఫీ కేసులో రాజ్కుంద్రా వ్యవహారం బయటపడిన అనంతరం హాట్ షాట్స్, బాలీఫేమ్ యాప్ని గూగుల్ ప్లే స్టోర్, ఆపిల్ యాప్ స్టోర్ నుంచి తొలగించారు. అయితే ఆ తర్వాత కూడా బాలీఫేమ్ యాప్ కనిపించడం గమనార్హం.
ముంబయి పోర్నో వీడియోల రాకెట్ కేసులో గత జులై19నుంచి రాజ్కుంద్రా జ్యుడీషియల్ కస్టడీలో ఉన్న సంగతి తెలిసిందే. వీరి బెయిల్ పిటిషన్ ఇంకా పెండింగులో ఉంది. ఇప్పటికే రెండు సార్లు ఆయన బెయిల్ కోసం పిటీషన్ పెట్టుకోగా, కోర్ట్ కొట్టివేస్తూ వస్తుంది. మరోవైపు భర్త రాజ్కుంద్రా చేసిన పనికి తలదించుకునే పరిస్థితి ఎదురైనా శిల్పాశెట్టి తాను జడ్జ్ గా చేస్తున్న డాన్స్ షోకి దూరంగా ఉన్నారు. కొన్ని రోజుల గ్యాప్ తర్వాత తిరిగి ఆమె షోకి జడ్జ్ గా వెళ్లారు. ఆ జ్ఞాపకాల నుంచి బయటపడేందుకు తాను తిరిగి కెరీర్పై దృష్టిపెట్టినట్టు తెలిపింది. మరోవైపు ఆమె రాజ్కుంద్రా ఇంటికి దూరంగా ఉంటున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి.