Asianet News TeluguAsianet News Telugu

సమంత 'నో' అంటే.. సాయి పల్లవి 'సై' అంది

అయితే ఇప్పుడు ఆ సినిమాలో హీరోయిన్ పాత్రని సాయి పల్లవి చేయటానికి ఆసక్తి చూపుతున్నట్లు సమాచారం. ఈ మేరకు కథ విని, తన క్యారక్టరైజేషన్ పై డిస్కస్ చేసినట్లు మీడియా వర్గాల కథనం. 

Sai Pallavi in Ajay Bhupathi Maha Samudram
Author
Hyderabad, First Published Apr 11, 2020, 6:55 PM IST

ఒకరు వద్దనుకున్న ప్రాజెక్టులోకి మరొకరు ఎంటర్ కావటం పెద్ద వింతేమీ కాదు..కొత్త అసలే కాదు. అయితే అందరూ వద్దనుకుంటూ ప్రక్కకు వెళ్ళిపోతున్న  సినిమాకి సైన్ చేస్తే మాత్రం అంతా ఆశ్చర్యంగా చూస్తారు.  ఇప్పుడు మహా సముద్రం ప్రాజెక్టు విషయంలో అదే జరుగుతోంది. ఈ సినిమాని చాలా మంది హీరోలు చేయలేమన్నారు. హీరోయిన్స్ కూడా కాదన్నారు. హీరోల్లో బెల్లంకొండ శ్రీను నుంచి రవితేజ, నాగ చైతన్య దాకా ఉన్నారు. అలాగే హీరోయిన్స్ లో ప్రధానంగా సమంత పేరు వినిపించింది. అయితే ఇప్పుడు ఆ సినిమాలో హీరోయిన్ పాత్రని సాయి పల్లవి చేయటానికి ఆసక్తి చూపుతున్నట్లు సమాచారం. ఈ మేరకు కథ విని, తన క్యారక్టరైజేషన్ పై డిస్కస్ చేసినట్లు మీడియా వర్గాల కథనం. అయితే ఆమె ఇంకా ఏ డెసిషన్ చెప్పలేదట. 

అన్నీ అనుకున్నట్లు జరిగితే మహా సముద్రం చిత్రం ఆగస్టు నుంచి ప్రారంభం అవుతుంది. అలాగే ఈ సినిమాలో శర్వానంద్ హీరోగా చేస్తున్నారు. ఇక డైరెక్ట‌ర్ అజ‌య్ భూప‌తి.. తొలి చిత్రం `RX100`తో సెన్సేష‌న‌ల్ హిట్‌ను సొంతం చేసుకున్న ద‌ర్శ‌కుడు. ఈ యువ ద‌ర్శ‌కుడు రెండో సినిమాను స్టార్ట్ చేయ‌డానికి మాత్రం చాలా సమయమే పడుతోంది. రవితేజ‌తో, మ‌రో హీరోతో `మ‌హాసముద్రం` సినిమాను చేయాల‌నుకుని వెయిట్ చేసారు. కానీ రెమ్యున‌రేష‌న్ సమస్య కార‌ణంగా ఆ ర‌వితేజ ప్రాజెక్ట్ నుండి త‌ప్పుకోవ‌డంతో త‌న‌ని చీప్‌స్టార్ అని కామెంట్ చేసి వార్త‌ల్లో కూడా నిలిచాడు.

ఆ త‌ర్వాత కార్తికేయ‌, విశ్వ‌క్‌సేన్‌ల‌తో ఈ సినిమాను అజ‌య్ భూప‌తి తెర‌కెక్కిస్తాడ‌ని వార్త‌లు వినిపించాయి. అంతా సరే అనుకున్న త‌రుణంలో ఇదిగో ఈ వార్త వచ్చింది. ఇక ఈ సినిమాలో మరో హీరో కూడా ఉంటారట. ఆ పాత్రని సైతం ఫైనలైజ్ చేయాల్సి ఉంటుందని అంటున్నారు. కార్తికేయ ఆ పాత్రలో కనిపించే అవకాసం కూడా ఉందంటున్నారు. మరి ఈ మహాసముద్రం ప్రారంభానికి ముందే ఇన్ని ట్విస్ట్ లు ఎదుర్కొంటోంది. రిలీజ్ అయ్యాక ఎన్ని సెన్సేషన్స్ క్రియేట్ చేస్తుందో చూడాలి. 

Follow Us:
Download App:
  • android
  • ios