అది నా కెరీర్లో అతి పెద్ద ప్రయోగం: తాప్సీ పన్ను
లాస్ట్ ఇయర్ సాండ్ కీ ఆంఖ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది తాప్సీ. తాజాగా ఈ సినిమా ఎక్స్పీరియన్స్ గురించి తన సోషల్ మీడియా పేజ్లో పోస్ట్ చేసిన ఈ బ్యూటీ ఆసక్తికర విషయాలను వెల్లడించింది. `నా కెరీర్లోనే నేను చేసిన అతిపెద్ద ప్రయోగం ఇది` అంటూ కామెంట్ చేసింది తాప్సీ.
సౌత్ సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన ఢిల్లీ బ్యూటీ తాప్సీ పన్ను. రాఘవేంద్ర రావు దర్శకత్వంలో తెరకెక్కిన ఝుమ్మంది నాథం సినిమాతో టాలీవుడ్కు పరిచయం అయ్యింది తాప్సీ. అయితే సౌత్లో పెద్దగా సక్సెస్ దక్కకపోవటంతో బాలీవుడ్ బాట పట్టిన ఈ బ్యూటీ అక్కడ మంచి విజయాలు సాధించింది. పర్ఫామెన్స్ ఓరియంటెడ్ సినిమాతో ఆకట్టుకున్న ఈ బ్యూటీ గత ఏడాది తన కెరీర్లోనే బిగ్గెస్ట్ ప్రయోగం చేసింది.
లాస్ట్ ఇయర్ సాండ్ కీ ఆంఖ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది తాప్సీ. తాజాగా ఈ సినిమా ఎక్స్పీరియన్స్ గురించి తన సోషల్ మీడియా పేజ్లో పోస్ట్ చేసిన ఈ బ్యూటీ ఆసక్తికర విషయాలను వెల్లడించింది. `నా కెరీర్లోనే నేను చేసిన అతిపెద్ద ప్రయోగం ఇది. డైరెక్టర్గా తుషార్ హీరానందాని తొలి ప్రయత్నం, తొలిసారి నిర్మాతగా నిధి పార్మర్హిరా, ఇక కెరీర్లోనే మొదటిసారి ఇద్దరు నటీమణులు తమ వయసుకు మించిన పాత్రల్లో కనిపించారు. ఈ సినిమాలో ఎంతోమంది మొదటిసారిగా బాలీవుడ్ స్క్రీన్పై తమ అదృష్టాన్నీ పరీక్షించుకున్నారు. ఈ సినిమాతో నాకెన్నో మధురమైన ఙ్ఞాపకాలు ఉన్నాయి` సినిమా ఎక్స్పీరియన్స్ను షేర్ చేసుకుంది.
పలు రాష్ట్ర స్థాయి, జాతీయ స్థాయి పోటిల్లో పాల్గొన్న భారత మాజీ మహిళా షూటర్లు చంద్రో తోమర్, ప్రకాశీ తోమర్ల జీవిత కథ ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించరు. ఈ సినిమాలో ప్రకాశి తోమర్ పాత్రలో తాప్సీ నటించగా, చంద్రో తోమర్గా భూమి ఫడ్నేకర నటించింది. 2019 అక్టోబర్ రిలీజ్ అయిన ఈ సినిమా కమర్షియల్ గా విజయం సాధించటంతో పాటు విమర్శకుల ప్రశంసలు కూడా అందుకుంది.