ప్రముఖ నిర్మాతపై రేప్ కేసు..ఆఫర్ ఇస్తానంటూ మభ్యపెట్టి
బాలీవుడ్కు చెందిన ప్రముఖ నిర్మాత భూషణ్ కుమార్పై అత్యాచారం కేసు నమోదు అయ్యింది. కొత్త ప్రాజెక్ట్లో ఉపాధి కల్పిస్తానని మాటిచ్చి.. తనపై లైంగిక దాడికి పాల్పడంటూ ఓ మహిళ ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు ఆయనపై కేసు నమోదు చేశారు.
దివంగత గుల్షన్ కుమార్ కుమారుడు, టి-సిరీస్ కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్ భూషణ్ కుమార్ పై అత్యాచారం కేసు నమోదైంది. భూషణ్ 30 ఏళ్ల మహిళపై అత్యాచారం చేశాడని ఆరోపణలు వచ్చాయి. అతను తన కంపెనీ ప్రాజెక్ట్ లో భాగంగా ఉద్యోగం నెపంతో ఆమెపై అత్యాచారం చేశాడని ఆరోపణ .2017 నుండి 2020 ఆగస్టు వరకు భూషణ్ కుమార్ తనను దాదాపు మూడేళ్ళకు పైగా వేధింపులకు గురిచేశాడని బాధితురాలు ఆరోపించింది.
ముంబై పోలీసు వర్గాల సమాచారం ప్రకారం, ఆమెను వేర్వేరు ప్రదేశాలకు తీసుకెళ్లి వేధింపులకు గురిచేసినట్లు మహిళ ఆరోపించింది . తన ఫోటో, వీడియో వైరల్ చేస్తామని నిందితుడు బెదిరించాడని బాధితురాలు ఆరోపించింది. ముంబైలోని అంధేరికి చెందిన డిఎన్ నగర్ పోలీసులు కేసు నమోదు చేశారు.
ఈ విషయంపై డీఎన్ నగర్ స్టేషన్ అధికారి స్పందిస్తూ.. ‘టీ సిరీస్ మేనేజింగ్ డైరెక్టర్, నిర్మాత భూషణ్ కుమార్పై శుక్రవారం ఉదయం పోలీస్ స్టేషన్లో కేసు నమోదు అయ్యింది. భూషణ్ తనపై అత్యాచారానికి పాల్పడ్డాడని.. లైంగికంగా వేధింపులకు గురి చేస్తున్నాడని ఓ మహిళ ఇచ్చిన ఫిర్యాదుతో ఆయనపై ఈ కేసు నమోదు చేశాం. ప్రస్తుతానికి ఎవర్నీ అరెస్టు చేయలేదు. దర్యాప్తు జరుగుతోంది’ అని తెలిపారు.
గతంలో మీటూ ఉద్యమం ద్వారా మోడల్ మెరీనా కున్వర్ కూడా భూషణ్ కుమార్ శారీరక వేధింపులకు పాల్పడ్డారని ఆరోపించిన సంగతి గుర్తుండే ఉండి ఉంటుంది. మెరీనా కున్వర్ ఓ టీవి ఛానెల్కిచ్చిన ఇంటర్వ్యూలో భూషన్ ఒక రోజు తనను కలవడానికి ప్రయత్నించారని చెప్పారు. తనతో తప్పుడు పనులు చేయడానికి ప్రయత్నించాడని పేర్కొంది. . తనతో ఏకాంతంగా గడిపితే మూడు సినిమాల్లో అవకాశాలిస్తానని భూషణ్ అన్నాడని ఓ నటి అప్పట్లో సంచలన వ్యాఖ్యలు చేశారు. అంతేకాకుండా భూషణ్ ఇచ్చిన ఆఫర్ని సున్నితంగా తిరస్కరించడంతో సినిమాల నుంచి తప్పించాడని ఆమె తెలిపారు. తన కాల్ వివరాలను మీకు సాక్ష్యంగా చూపిస్తానని తెలిపింది.తనపై వచ్చిన ఆరోపణలను భూషణ్ కుమార్ ఖండించారు. పబ్లిసిటీ కోసమే తనపై కావాలని ఆరోపణలు చేస్తున్నారని ప్రకటించారు.