డ్రగ్స్ కేసు : దీపిక పేరు బయటపడడంపై కంగనా రనౌత్ చురకలు
డ్రగ్స్ కేసులో బాలీవుడ్ హీరోయిన్ దీపికా పదుకొణే పేరు బయటకు రావడంతో ఇందుకు సంబంధించిన వీడియోను పోస్ట్ చేసిన సినీనటి కంగనా రనౌత్ విమర్శలు గుప్పించింది.
బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్ పుత్ అనుమానాస్పద కేసులో డ్రగ్స్ కోణం బయటకు వచ్చిన సంగతి తెలిసిందే.. ఈ కేసులో రోజుకో కొత్త పేరు బయిటకు వస్తోంది. తాజాగా ఇప్పుడు ఈ లిస్టు నుంచి స్టార్ హీరోయిన్ దీపికా పదుకునే పేరు వినిపిస్తోంది. డ్రగ్స్ కేసులో బాలీవుడ్ హీరోయిన్ దీపికా పదుకొణే పేరు బయటకు రావడంతో ఇందుకు సంబంధించిన వీడియోను పోస్ట్ చేసిన సినీనటి కంగనా రనౌత్ విమర్శలు గుప్పించింది.
'డ్రగ్స్ వాడకం ఫలితమే డిప్రెషన్. క్లాస్గా కనబడుతున్న కొందరు స్టార్ల పిల్లలు వాళ్ల మేనేజర్లను మాల్ గురించి అడుగుతుంటారు' అని కంగన చురకలంటించింది. బాలీవుడ్లో డ్రగ్స్ వాడే వాళ్లతో పాటు దీపికా పదుకొణేను బాయ్కాట్ చేయాలంటూ ఆమె హ్యాష్ట్యాగ్ జోడించింది. కాగా, గతంలో దీపిక డిప్రెషన్లోకి వెళ్లి కోలుకుంది. ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ కంగనా ఈ ట్వీట్ చేసింది.
నిన్న ( సోమవారం) రోజున ఎన్సీబీ అధికారులు జయా సాహాను విచారించగా స్టార్ హీరోయిన్ దీపికా పడుకొనే పేరు తెరమీదకు వచ్చినట్లు ప్రముఖ మీడియాల్లో వార్తలు వస్తున్నాయి. జయ వాట్సాప్ చాట్ చేసిన దాన్ని బట్టి ఆమె దీపికా పర్సనల్ మేనేజర్ కరిష్మా డ్రగ్స్ గురించి చర్చించిందని ఎన్సీబీ అధికారుల దృష్టికి వచ్చింది.
అందులో ఉన్న కోడ్ భాషలో D అంటే దీపిక అని, K అంటే కరిష్మా అని అనుమానిస్తోంది ఎన్సీబీ అధికార బృందం. త్వరలోనే దీపిక పదుకొనే, శ్రద్ధాకపూర్లకు ఈ వారంలో విచారణకు హాజరు కావాల్సిందిగా సమన్లు జారీ చేయనున్నట్లు సమాచారం. అటు రకుల్ప్రీత్ సింగ్, సారా అలీఖాన్, డిజైనర్ సిమోన్ ఖంబాటాలకు ఈ వారంలోపు సమన్లు జారీ చేయనున్నట్లుగా ఎన్సీబీ డిప్యూటీ డైరెక్టర్ ఒకరు మీడియాకు వెల్లడించారు.