అనసూయని నవదీప్ ఎక్కడికో తీసుకెళ్దామనుకున్నాడట! చాటింగ్ వైరల్
సెక్సీ బ్యూటీ అనసూయ తాజాగా నటుడు నవదీప్తో సోషల్ మీడియాలో చాట్ చేసింది. ఈ సందర్భంగా వీరిద్దరి మధ్య చోటు చేసుకున్న చాటింగ్ ఇప్పుడు వైరల్ అవుతుంది.
హాట్ యాంకర్ అనసూయ.. టెలివిజన్లో చాలా పాపులర్. ఆమె క్రేజ్ మామూలుగా ఉండదని చెప్పొచ్చు. ఆమె నిత్యం సోషల్ మీడియాలో అభిమానులతో చాట్ చేస్తుంది నెటిజన్ల కామెంట్లకి బలవుతుంటుంది. తాజాగా ఈ సెక్సీ బ్యూటీ నటుడు నవదీప్తో సోషల్ మీడియాలో చాట్ చేసింది. ఈ సందర్భంగా వీరిద్దరి మధ్య చోటు చేసుకున్న చాటింగ్ ఇప్పుడు వైరల్ అవుతుంది.
నవదీప్ ఇటీవల ఐదు రోజుల పాటు హిమాలయాలకు ట్రిప్ వెళ్లాడు. 14 మంది వెళ్ళారు. హిమాలయాల్లో బైక్లపై జర్నీ చేశారు. ఆ విశేషాలన్ తన ఇన్స్టాగ్రామ్ ద్వారా లైవ్ చాటింగ్లో అభిమానులతో పంచుకున్నారు. ఇది చూసి అనసూయ మధ్యలో దూరింది. తనకి హిమాలయాలంటే ఇష్టమని చెప్పింది. అందుకు నవదీప్ స్పందిస్తూ, `మిమ్మల్నీ ఎక్కడికో తీసుకెళ్దామనుకుంటా. కానీ మీరు రారు` అని పంచ్ వేశాడు. దీంతో అనసూయ ఒక్క సారిగా షాక్కి గురయ్యింది. ఇది లైవా? అంటూ నవదీప్ని అడిగింది. ఆ తర్వాత దాన్ని మరో రకంగా కవర్ చేసింది. మీరిప్పుడు హైదరాబాద్ లోనే ఉన్నారా? అంటూ తన సంభాషణ కంటిన్యూ చేసింది. దీంతో వీరిద్దరి ఈ సంభాషణ నెట్టింట వైరల్ అవుతోంది.
నవదీప్ చాట్ చూసి అనసూయ భర్త కూడా తాను ఇలా తిరిగేవాడినని, పెళ్ళి చేసుకోవడం వల్ల ఇంట్లోనే ఉండిపోవాల్సి వస్తుందన్నాడట. అందుకు అనసూయ కూడా ఆమె భర్తకి కౌంటర్ ఇస్తూ `మ్యారేజ్ చేసుకుని బాధపడుతున్నావా? ఏంటీ?` అని ప్రశ్నించిందట. దీనికి నవదీప్ స్పందిస్తూ `బ్యాచ్లర్గా ఉండి ఉంటే నాలాగే తిరిగేవాడేమో`అని సెటైర్ వేశాడు.
నవదీప్ ట్రిప్ విషయాల ఎప్పుడూ తనకు చెబుతుంటారని, అవి ఇన్స్పైర్ చేస్తుంటాయని అనసూయ చెప్పింది. ప్రస్తుతం ఆమె జీ5లతో ఓ వెబ్ ఫిల్ చేస్తుందట. అయితే నవదీప్ అనసూయ కోసం ఓ స్పెషల్ రెడీ చేస్తున్నారట. త్వరలోనే అది ఇస్తానని చెప్పాడు. దీంతో హాట్ భామ అనసూయ తెగ సంబరపడింది. దాని కోసం వెయిట్ చేస్తానని తెలిపింది. ఈ చాటింగ్ వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతుంది.