Asianet News TeluguAsianet News Telugu

అనుష్క వచ్చేసింది...ఇక ప్రభాస్ దే లేటు..!

ప్రభాస్, అనుష్కలు సోషల్ మీడియాపై అంత ఆసక్తి చూపించరు. ముఖ్యమైన సందర్భాలు, తమ చిత్రాల ప్రమోషన్స్ మినహా పెద్దగా సోషల్ మీడియాలో సందడి చేయరు. కాగా వీరిద్దరికీ అధికారిక ట్విట్టర్ అకౌంట్ లేదు. ఐతే అనుష్క ట్విట్టర్ లోకి ఎంట్రీ ఇచ్చారు. 

heroin anushka shetty enters in twitter ksr
Author
Hyderabad, First Published Oct 1, 2020, 8:28 AM IST

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ గా ఉన్న అనుష్క శెట్టి సోషల్ మీడియాలో అంత యాక్టీవ్ గా ఉండరు. చాల అరుదుగా సోషల్ మీడియా పోస్టులు పంచుకునే అనుష్క, తన ఫోటోలు కూడా షేర్ చేయరు. అలాగే అనుష్క సోషల్ మీడియా ప్లాట్ ఫార్మ్స్ అయిన ఫేస్ బుక్, ఇంస్టాగ్రామ్ వాడుతున్నారు కానీ ట్విట్టర్ అకౌంట్ లేదు. ట్విట్టర్ లో అనేక ఫ్యాన్ పేజ్ లు ఉన్నప్పటికీ అనుష్క మాత్రం అధికారిక ట్విట్టర్ ఖాతా తెరవలేదు. 

కాగా రేపు అనుష్క లేటెస్ట్ మూవీ నిశ్శబ్దం విడుదల వుంది. ఈ మూవీ ప్రమోషన్స్ కోసం అనుష్క ట్విట్టర్ ఎంట్రీ ఇవ్వడం జరిగింది. అందరికీ హాయ్...అందరూ బాగున్నారని భావిస్తున్నాను. ఇది నా అధికారిక ట్విట్టర్ అకౌంట్. లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఈ ట్విట్టర్ పేజీ ఫాలో అవ్వండి, అని ఓ సందేశం పోస్ట్ చేశారు. 

అనుష్క ట్విట్టర్ ఖాతా చెరిచిన గంటల వ్యవధిలో లక్షల మంది ఫాలోవర్స్ వచ్చి చేరారు. ఇప్పటికే అనుష్క ఫాలోవర్స్ సంఖ్య 8లక్షలు దాటిపోవడంతో పాటు 1 మిలియన్ కి చేరువైంది. కాగా హీరో ప్రభాస్ కూడా ట్విట్టర్ అకౌంట్ వాడరు. ఆయనకు ఇంస్టాగ్రామ్, ఫేస్ బుక్ ఖాతాలు మాత్రమే ఉండగా తన లేటెస్ట్ మూవీ అప్డేట్స్ వాటిద్వారానే పంచుకుంటారు. 

అనుష్క శెట్టి ట్విట్టర్ ఎంట్రీ ఇచ్చిన నేపథ్యంలో ప్రభాస్ కూడా ట్విట్టర్ లోకి ఎంటర్ అవుతారేమో చూడాలి. ఇక ప్రభాస్ రాధే శ్యామ్ షూటింగ్ కి సిద్ధం అవుతున్నారు. గత నెలలోనే రాధే శ్యామ్ షూటింగ్ మొదలు కానున్నట్లు దర్శకుడు రాధా కృష్ణ చెప్పడం జరిగింది. ఇటలీలో నెక్స్ట్ షెడ్యూల్ ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం అందుతుంది. 

Follow Us:
Download App:
  • android
  • ios