బన్నీపై ఫైర్ అవుతున్న పవన్ ఫ్యాన్స్.. ఈ సారి కారణం ఏంటంటే!
మరోసారి పవన్ అభిమానులు అల్లు అర్జున్ పై ఫైర్ అవుతున్నారు. అకీరాకు బర్త్డే విషెస్ చెప్పకపోవటంపై బన్నీపై పవర్ స్టార్ అభిమానులు కోపంగా ఉన్నారు. దీంతో మరోసారి బన్నీ టార్గెట్ చేస్తూ సోషల్ మీడియాలో ట్రోలింగ్ మొదలు పెట్టారు పవర్ స్టార్ ఫ్యాన్స్.
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్కు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులకు మధ్య చాలా రోజులుగా యుద్ధం జరుగుతోంది. ఓ సినిమా వేడుకలో పవర్ స్టార్ అని చెప్పాలని పవన్ అభిమానులు గొడవ చేయటం దానికి బదులుగా బన్నీ చెప్పను బ్రదర్ అంటూ సమాధానం ఇవ్వటం అప్పట్లో పెద్ద చర్చకు దారితీసింది. దీంతో పవన్ అభిమానులు సోషల్ మీడియా వేదికగా బన్నీపై పెద్ద ఎత్తున విమర్శలు చేశారు. బన్నీ కూడా అలా విమర్శలు చేసేవారిపై ఘాటుగానే స్పందించాడు.
ఆ తరువాత పరిస్థితులను చక్కదిద్దేంకు బన్నీ ఎన్ని ప్రయత్నాలు చేసిన అది పెద్ద వర్క్ అవుట్ కాలేదు. అల్లు అర్జున్కు బన్నీ అభిమానులకు మధ్య దూరం పెరుగుతూనే వచ్చింది. తాజాగా మరోసారి వారిద్దరి మధ్య విబేధాలు తెర మీదకు వచ్చాయి. బుధవారం అల్లు అర్జున్తో పాటు అక్కినేని యంగ్ హీరో అఖిల్, పవర్ స్టార్ వారసుడు అకీరా నందన్లు కూడా పుట్టిన రోజు జరుపుకున్నారు. ఈ నేపథ్యంలో మెగా హీరోలు అందరూ ఈ ముగ్గురికి శుభాకాంక్షలు తెలియజేశారు.
అయితే బన్నీ మాత్రం తన అఖిల్కు ఒక్కడికే శుభాకాంక్షలు తెలిపాడు. దీంతో అకీరాకు కావాలనే బన్నీ విషెస్ చెప్పలేదని ఫీల్ అవుతున్నారు పవర్ స్టార్ ఫ్యాన్స్. అఖిల్ కు కూడా చెప్పకపోయి ఉంటే పెద్దగా పట్టించుకునే వారు కాదేమో. కానీ అఖిల్కు చెప్పి అకీరాకు చెప్పకపోవటంపై అభిమానులు ఓ రేంజ్లో ట్రోల్ చేస్తున్నారు. మరి ఈ విషయంలో బన్నీ ఎదైనా క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేస్తాడేమో చూడాలి.