VIDEO: విశాఖలో పట్టపగలే రెచ్చిపోయిన చెయిన్ స్నాచర్స్
విశాఖపట్నంలో పట్టపగలే అదీ నడిరోడ్డుపై దోపిడీదొంగలు రెచ్చిపోయారు. ఓ మహిళ మెడలోంచి భారీ బంగారు నగలను తస్కరించారు.
విశాఖపట్నం: గోపాలపట్నం లో పట్టపగలే నడిరోడ్డు పై దొంగల భీభత్సం సృష్టించారు. కారు లో కూర్చున్న ఓ మహిళ మెడలో ఉన్న సుమారు 11 తులాలు బంగారం తెంచుకొని దొంగలు పరారయ్యారు. విశాఖ గాజువాకకు చెందిన పెదగంట్యాడకు చెందిన గానుగుల వరలక్ష్మి తన భర్తతో కలిసి బంధువులు ఇంట్లో శుభకార్యానికి కారులో వెళ్లారు.
వీడియో
"
అయితే మోకాళ్ల నొప్పుల కారణంగా భార్యని కారులో వదిలి భర్త బంధువుల ఇంట్లోకి వెళ్ళారు. ఇదే అదునుగా భావించిన చైన్ స్పాచర్స ఒంటరిగా కారులో వున్న మహిళ మెడలో నుంచి బంగారం తెంచుకొని పారిపోయారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు దగ్గర్లో ఉన్న షాపులోని సిసి కెమేరా పుటేజీల ఆధారంగా దొంగలను గుర్తించే ప్రయత్నం చేస్తున్నారు.