Asianet News TeluguAsianet News Telugu

హైదరాబాదులో 150 మంది టెన్షన్: మర్కజ్ నుంచి వచ్చి గాయబ్

ఢిల్లీలో జరిగిన మర్కజ్  కు వెళ్లి తిరిగి వచ్చిన 150 మంది కోసం హైదరాబాదులో గాలింపు చర్యలు చేపట్టారు. మర్కజ్ వెళ్లి వచ్చిన ఆ 150 మంది ఎక్కడున్నారనే విషయం తెలియడం లేదు.

Coronavirus: Telangana govt searches for 150 men, returned from Markaz
Author
Hyderabad, First Published Apr 6, 2020, 2:53 PM IST

హైదరాబాద్: తెలంగాణ రాజధాని హైదరాబాదులో మర్కజ్ వెళ్లి వచ్చినవారి గురించి టెన్షన్ పట్టుకుంది. ఢిల్లీలోని నిజాముద్దీన్ ప్రాంతంలో జరిగిన మర్కజ్ కు వెళ్లి తిరిగి వచ్చినవారిలో 150 మంది ఆచూకీ దొరకడం లేదు. దీంతో వారిని పట్టుకోవడానికి తెలంగాణ ప్రభుత్వం రంగంలోకి దిగింది. 

గ్రేటర్ హైదరాబాదు నగర పాలక సంస్థ (జీహెచ్ఎంసీ) అదికారులు ఆరోగ్య శాఖాధికారులతో కలిసి గాలింపు చర్యలు చేపట్టారు. వారిని పట్టుకోవడానికి ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశారు. వారి ఆచూకీ కనిపెట్టడానికి తెలంగాణ ప్రభుత్వం మైనారిటీ సంఘాలతో చర్చలు జరుపుతోంది. 

మర్కజ్ లో పాల్గొన్నవారి వల్లనే పెద్ద యెత్తున దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి చెందుతున్న విషయం తెలిసిందే. అన్ని రాష్ట్రాల్లోనూ కరోనా వైరస్ బారిన పడినవాళ్లు ఎక్కువగా వారి నుంచే బయటపడుతున్నారు. దాంతో తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ తీసుకుని వారి కోసం గాలింపు చర్యలు చేపట్టింది.

ఇదిలావుంటే, తెలంగాణలోని గద్వాల జిల్లాలో గల ఐజలో తాజాగా నాలుగు కరోనా పాజిటివ్ కేసులు బయటపడ్డాయి. నలుగురికి కరోనా పాజిటివ్ ఉన్నట్లు నిర్ధారణ అయిందని జిల్లా వైద్య, ఆరోగ్యాధికారి (డీఎంహెచ్ఓ) చెప్పారు. ఆ నలుగురి కుటుంబ సభ్యులను కూడా క్వారంటైన్ కు పంపించినట్లు తెలిపారు. ఐజ మొత్తం శానిటైజ్ చేస్తున్నట్లు తెలిపారు.

తెలంగాణలోని నిజామాబాద్ ఉమ్మడి జిల్లాను కరోనా వైరస్ పాజిటివ్ కేసులు వణికిస్తున్నాయి. నిజామాబాద్ జిల్లాలో ఇప్పటి వరకు 27 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. నిజామాబాద్ నగరంలోనే 17 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 

కామారెడ్డిలో 8 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. మరో 43 మందికి లక్షణాలు కనిపించడంతో నమూనాలను పరీక్షలకు పంపించారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ఇప్పటి వరకు కరోనా వైరస్ బారిన పడి ఇద్దరు మరణించిన విషయం తెలిసిందే. బాన్సువాడలో కూడా కరోనా పాజిటివ్ కేసులు నమోద్యయాయి.

తెలంగాణలో ఇప్పటి వరకు 334 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. మొత్తం 11 మంది మృత్యువాత పడ్డారు. మర్కజ్ కు వెళ్లి వచ్చిన 297 మంది కరోనా బారిన పడినట్లు తేలింది. ఆస్పత్రుల్లో 289 మంది కరోనా బాధితులు చికిత్స పొందుతున్నారు.తెలంగాణలో ఇప్పటి వరకు 11 మంది మృతి చెందగా, 33 మంది డిశ్చార్జ్‌ అయ్యారు.

తెలంగాణలోని ఉమ్మడి వరంగల్ జిల్లాలో 25 కరోనా పాజిటివ్ కేసులు నిర్ధారణ అయ్యాయి. వారిని సికింద్రాబాదులోని గాంధీ ఆస్పత్రికి తరలించారు. వరంగల్ లోని ఎంజీఎం నుంచి వారిని గాంధీకి తరలించారు. ఎంజీఎంలో చికిత్స అందించిన నలుగురు పీజీ విద్యార్థులకు కరోనా లక్షణాలు ఉన్నట్లు అనుమానిస్తున్నారు. వారి శాంపిల్స్ ను పరీక్షల నిమిత్తం పంపించారు.  

వరంగల్ లో ఢిల్లీ వెళ్లని ఓ వ్యక్తికి కూడా కరోనా పాజిటివ్ వచ్చింది. తెలంగాణలో కరోనా మహమ్మారి పంజా విసురుతోంది. శుక్రవారం ఒక్కరోజే ఏకంగా 75 పాజిటివ్ కేసులు నమోదైనట్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. దీంతో మొత్తం కేసుల సంఖ్య ఒక్కసారిగా 229కి చేరుకుంది. 

Follow Us:
Download App:
  • android
  • ios