కరోనా వైరస్ ప్రభావంతో రోజాపువ్వులకు భలే గిరాకీ...
గత కొద్ది రోజులుగా చైనాలో ప్రబలిన కరోనా వైరస్ కారణంగా ప్రపంచ దేశాలు ఆ దేశం నుంచి వివిధ రకాల కాయగూరలు, పూలు, పండ్లను దిగుమతి చేసుకోవడానికి ఆలోచించేల చేస్తున్నాయి. దీంతో భారత్ నుంచి పూలు, పళ్ళు, కూరగాయల దిగుమతికి మక్కువ చూపిస్తున్నారు.
చెన్నై: ప్రపంచం మొత్తం నేడు కరోనా వైరస్ తో భయపడుతుంది. కానీ కరోనా వైరస్ వల్ల కృష్ణగిరి జిల్లా హోసూరు రైతుల దశ ఒక్కసారి తిరిగింది. గత కొద్ది రోజులుగా చైనాలో ప్రబలిన కరోనా వైరస్ కారణంగా ప్రపంచ దేశాలు ఆ దేశం నుంచి వివిధ రకాల కాయగూరలు, పూలు, పండ్లను దిగుమతి చేసుకోవడానికి ఆలోచించేల చేస్తున్నాయి.
దీంతో భారత్ నుంచి పూలు, పళ్ళు, కూరగాయల దిగుమతికి మక్కువ చూపిస్తున్నారు. ఇంకో విషయం ఏంటంటే లిటిల్ ఇంగ్లాండుగా పేరొందిన హోసూరు ప్రాంతంలో పండే పూలకు ఆర్డుర్లు భలే వెల్లువెత్తుతున్నాయి. దేశంలోని అతిపెద్ద పూల ఉత్పత్తి, ఎగుమతి కేంద్రమైన హోసూర్లో అంతర్జాతీయ పూల వేలం మార్కెట్ బడ్జెట్ సెషన్కు ముందే ఇక్కడ డిమాండ్ ఊపందుకుంది.
హోసూర్ గులాబీలు, కార్నెసియన్లు, గెర్బెరాస్, క్రిసాన్తిమమ్లను ఉత్పత్తి చేస్తుంది. పూల ఉత్పత్తిలో ఇరవై శాతం (ప్రధానంగా గులాబీలు క్రిసాన్తిమమ్స్) ఎగుమతులను లక్ష్యంగా పెట్టుకున్నాయి. మిగిలినవి దేశీయ మార్కెట్కు పంపిస్తారు. ముఖ్యంగా గ్రీన్హౌ్స, ఔట్ఫీల్డ్లో సుమారు 2000 ఎకరాలకు పైగా రోజా పంటను పండిస్తున్నారు. ప్రతిసంవత్సరం ఫిబ్రవరి 14న జరుపుకునే వాలైంటెన్స్డే కోసం దాదాపు ఒక కోటి పూలను ఎగుమతి చేస్తుంటారు.
also read ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నా ఎల్ఐసీ ఉద్యోగ సంఘాలు...ఎందుకు..?
కానీ ప్రస్తుతం బిజినెస్ ట్రెడర్స్, ఎగుమతి, దిగుమతి చేసుకునే వారికి పువ్వుల ధరను నిర్ణయించే అవకాశం ఉందని రైతుల ప్రతినిధులు అంటున్నారు. మార్కెట్ ఎగుమతి పరిమితం చేయబడిన కారణంగా సాగుదారులు ఎక్కువగా దేశీయ మార్కెట్పై ఆధారపడతారు అని హోసూర్ చిన్న రైతు సంఘం అధ్యక్షుడు బాలా శివప్రసాద్ చెప్పారు.
"చాలా కాలంగా మేము అంతర్జాతీయ పూల వేలం మార్కెట్ను చేస్తున్నాము. ఇక్కడ రైతులు పువ్వుల ధరను నిర్ణయిస్తారు. కానీ వారు నిర్ణయించనపుడు మధ్యవర్తులు, వ్యాపారులు పూల ధరలను నిర్ణయిస్తారు, రైతులకు వచ్చే లాభాలను కూడా తగ్గిస్తారు. ” “ప్రతి రోజు ఎకరానికి 150 నుండి 200 బంచ్ పువ్వులు పండిస్తారు. వీటిని ఏజెంట్లు తక్కువ ధరకు సేకరించి అధిక మార్జిన్లకు విక్రయిస్తారు.
వ్యాపారి / మధ్యవర్తులు ధరను నిర్ణయించడంతో రైతులకు ధరలపై బేరం చేయడానికి అవకాశం లేదు. దీనివల్ల రైతులు నెలకు ఆదాయం 40,000 నుండి 50,000 వరకు కోల్పోతారు ”అని ఆయన వివరించారు. ఈ మధ్యవర్తుల ఆధిపత్య వ్యవస్థ ప్రపంచ డిమాండ్కు అంచనా వేసిన స్థానిక డిమాండ్ ఆధారంగా వ్యాపారులు / ఏజెంట్లు నిర్ణయించిన ధరపై ఆధారపడి ఉంటుంది.
పరిస్థితుల ఆధారంగా ఢిల్లీ, బొంబాయిలలో పువ్వుల ధర ఎక్కువగా ఉంటుంది. అయితే స్థానిక వ్యాపారులు చెన్నైలో తక్కువ ధరలకు బేరం చేసి అతి తక్కువ ధరకు పూలను కొనుగోలు చేస్తారు”అని శివప్రసాద్ చెప్పారు. వీటిని సింగపూర్, మలేషియా, ఆస్ర్టేలియా, న్యూజిలాండ్ తదితర దేశాలకు ఎగుమతి చేస్తుంటారు. ఈ సంవత్సరం కూడా కోటి పూలను ఎగుమతి చేయాలని పూల ఎగుమతిదారులు, రైతులు లక్ష్యంగా నిర్ణయించుకున్నారు.
also read ఐటీ శ్లాబ్లపై కనిపించని క్లారిటీ...13 లక్షలు దాటితే...
దేశంలో ఐదు పూల వేలం మార్కెట్లు ఏర్పాటు చేశారు. రైతుల నుండి సరఫరా, ఇన్పుట్ లేకపోవడం వల్ల నలుగురు విఫలమయ్యారని శ్రీ శివప్రసాద్ చెప్పారు. బెంగళూరులో ఉన్నది హోసూర్ రైతులను అందిస్తుంది. ఆన్లైన్ అమ్మకాలలో పూల ఆర్డర్లు కొద్ది సెకన్ల సమయం అయిపోతాయి. కాకపోతే "షరతుల ప్రకారం కనీసం 1,000 పువ్వుల ఆర్డర్ చెయ్యాలి" అని మిస్టర్ శివ ప్రసాద్ వివరించారు.
వినియోగదారుడు / వ్యాపారి నేరుగా లాగిన్ చేసి ఆర్డర్లు ఇవ్వవచ్చు. ఇక్కడ రైతుల కమిటీ ధర నిర్ణయించబడుతుంది. ఆఫ్లైన్ ఆర్డర్లకు కూడా స్కోప్ ఉందని ఆయన చెప్పారు. ప్రస్తుతం ప్రతి గులాబి పువ్వు రూ.15 ధర పలుకుతోంది. ఈ సంవత్సరం మంచు ప్రభావం, ఎక్కువగా ఉండడం వల్ల దిగుబడి తగ్గిందని పలువురు పూల ఎగుమతిదారులు చెప్పారు.
రవాణా భారం నుండి రైతులకు ఉపశమనం కలిగించెందుకు పూల ఫార్మ్ గేట్ వద్ద పువ్వులు సేకరించడానికి పిక్-అప్ వాహనాలను ఉంటాయి. ప్రస్తుతం, రైతులు రవాణా ఖర్చులను దాదాపు 2,500 బెంగళూరు వేలం మార్కెట్ భరిస్తుంది. ఇది మార్కెటింగ్ సమస్యను మరియు ఉత్పత్తిదారులుగా రైతుల సంబంధిత సమస్యలను పరిష్కరిస్తుందని ఆయన చెప్పారు.
"సోమవారం రోజు రైతులు గులాబీలను వ్యాపారులకు 30 రూపాయలకు ఒక బంచ్ అమ్మితే, అది మదురై మరియు కోయంబత్తూర్లలో రూ.80 అమ్ముతారు" అని ఆయన చెప్పారు. హార్టికల్చర్ జాయింట్ డైరెక్టర్ టి.సి.కన్నన్ ప్రకారం, "పూల పెంపకందారులు తయారుచేసిన నివేదికను తిసుకొని దానిని వ్యవసాయ మార్కెటింగ్ కమిషనర్కు పంపారు,"