ఎయిర్పోర్ట్లోని రన్ వేపై ఓ వీధి కుక్క కనిపించడం కలకలం రేపింది. దీంతో ఎయిర్పోర్టులో ల్యాండ్ అవ్వాల్సిన విస్తారా ఎయిర్లైన్స్కు చెందిన విమానం వెనుదిరగాల్సి వచ్చింది.
ప్రతిపక్ష ఇండియా కూటమిలోని పార్టీల నేతల మధ్య పలు అంశాలపై భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్న సంగతి తెలిసిందే. తాజాగా కుల గణనకు సంబంధించి కాంగ్రెస్ పార్టీని సమాజ్వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ ప్రశ్నించడం.. ఇండియా కూటమిలో భాగమైన ఆ రెండు పార్టీల మధ్య విభేదాలను తెరమీదకు తెచ్చింది.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ తేదీ సమీపిస్తున్న కొద్ది రాజకీయ నాయకుల మధ్య విమర్శల దాడి మరింతగా పెరుగుతుంది. తాజాగా టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిపై ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.
దీపావళి పండగ వేళ పశ్చిమ లండన్లో నివాసం ఉంటున్న ఓ భారత సంతతి కుటుంబంలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది.
బీఆర్ఎస్ అభ్యర్థి, మంత్రి పువ్వాడ అజయ్ అఫిడవిట్ సరైన ఫార్మాట్లో లేదని మాజీ మంత్రి, కాంగ్రెస్ నేత తుమ్మల నాగేశ్వరరావు ఆరోపించారు. పువ్వాడ అఫిడవిట్ మార్చడంపై ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసినట్టుగా తుమ్మల చెప్పారు.
వైఎస్సార్ జిల్లాలోని ప్రొద్దుటూరు నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ ప్రవీణ్ కుమార్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు.
డిసెంబర్ 3న తెలంగాణ అంతా గులాబీమయం కాబోతున్నదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ అన్నారు. తెలంగాణలో ముచ్చటగా మూడోసారి గులాబీ జెండా ఎగరడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.
ఉత్తరాఖండ్లోని ఉత్తరకాశీ జిల్లాలో నిర్మాణంలో ఉన్న సొరంగం కొంతభాగం కూలిన ఘటనలో 40 మంది కార్మికులు అందులో చిక్కుకుపోయారు. దీంతో వారిని రక్షించేందుకు రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతుంది.
టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే.. తమ పార్టీ కార్యకర్తలపై నమోదైన కేసులన్నీ ఎత్తివేస్తామని అన్నారు.
టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిపై చెన్నూరు నియోజకవర్గ బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి బాల్క సుమన్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. రేవంత్ రెడ్డి నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడాలని హెచ్చరించారు.