యూపీఏ అధ్యక్షుడు రాహుల్ గాంధీ తెలంగాణ పర్యటన ఏమీ ఉద్దరించలేదని టీఆర్ఎస్ నేత దానం నాగేందర్ అభిప్రాయపడ్డారు. రాహుల్ గాంధీ పర్యటన అంతా కిరాయిగాళ్లతో షో చేయించినట్లు ఉందన్నారు. రాహుల్ గాంధీ వ్యాఖ్యలు చూస్తుంటే అవగాహన లేకుండా మాట్లాడారని మండిపడ్డారు.


హైదరాబాద్:
యూపీఏ అధ్యక్షుడు రాహుల్ గాంధీ తెలంగాణ పర్యటన ఏమీ ఉద్దరించలేదని టీఆర్ఎస్ నేత దానం నాగేందర్ అభిప్రాయపడ్డారు. రాహుల్ గాంధీ పర్యటన అంతా కిరాయిగాళ్లతో షో చేయించినట్లు ఉందన్నారు. రాహుల్ గాంధీ వ్యాఖ్యలు చూస్తుంటే అవగాహన లేకుండా మాట్లాడారని మండిపడ్డారు. 

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred

కాంగ్రెస్ లో సామాజిక న్యాయం ఉందా అంటూ ప్రశ్నించారు. సెటిటర్ల గురించి మాట్లాడే అర్హత కాంగ్రెస్ పార్టీకు లేదన్నారు. కుటుంబ పాలన గురించి రాహుల్ గాంధీ మాట్లాడటం విడ్డూరంగా ఉందన్నారు. కాంగ్రెస్ పార్టీలో ఇప్పటికే ఒక్కో కుటుంబం నుంచి ఇద్దరు టిక్కెట్ ఆశిస్తున్నారని తెలిపారు. రాబోయే ఎన్నికల్లో గ్రేటర్ హైదరాబాద్ లో కాంగ్రెస్ డిపాజిట్ గల్లంతవ్వడం ఖాయమన్నారు.