నలుగరు మయన్మార్ దేశస్థుల అరెస్ట్
హైదరాబాద్ లో శరణార్థులుగా వలస వచ్చిన మయన్మార్ దేశానికి చెందిన నలుగురుని రాచకొండ కమిషనరేట్ పరిధిలోని బాలాపూర్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
బాలాపూర్:
హైదరాబాద్ లో శరణార్థులుగా వలస వచ్చిన మయన్మార్ దేశానికి చెందిన నలుగురుని రాచకొండ కమిషనరేట్ పరిధిలోని బాలాపూర్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. స్థానికంగా ఉండే ఓ వ్యక్తి శరణార్థులకు తప్పుడు ధృవపత్రావలతో ఆధార్ కార్డు, ఓటర్ ఐడీ కార్డు ఏర్పాటు చేశాడు.
నకిలీ పత్రాలను గుర్తించిన పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు అదుపులోకి తీసుకున్న వారిలో స్థానికుడితో పాటు ముగ్గురు మయన్మార్ దేశానికి చెందిన యువకులతోపాటు ఓ మహిళను అదుపులోకి తీసుకున్నారు. తప్పుడు పత్రాలు సమర్పించిన నిందితడిపై వివిధ సెక్షన్లు కింద కేసు నమోదు చేశారు.