బ్యాంకుల విలీనం వల్ల ఒక్క ఉద్యోగం కూడా పోదని కేంద్ర విత్త మంత్రి నిర్మలా సీతారామన్ ఉద్యోగులకు భరోసా కల్పించారు. వివిధ రంగాలను ఆదుకునేందుకు బ్యాంకులకు మరింత మూలధనం అందజేస్తున్నట్లు తెలిపారు. రంగాలవారీగా సమస్యల పరిష్కారంపై దృష్టి కేంద్రీకరించామన్నారు. ఇక ఆటోమొబైల్ రంగ అభ్యర్థనల మేరకు జీఎస్టీ తగ్గించాలన్న విషయమై జీఎస్టీ కౌన్సిల్ తుది నిర్ణయం తీసుకుంటుందని, తనదేమీ లేదని తేల్చి చెప్పారు.