భారతదేశ వ్యాప్తంగా ముంబై, ఢిల్లీ, బెంగళూరు, హైదరాబాద్, ఇండోర్, విజయవాడ, హౌసూర్ నగరాలు సహా తొమ్మిది రాష్ట్రాల పరిధిలోని 15 నగరాల్లో టాటా పవర్ 85 విద్యుత్ వాహనాల చార్జింగ్ స్టేషన్లను ఏర్పాటు చేసింది. వచ్చే ఏడాదిలోపు 500 చార్జింగ్ స్టేషన్ల ఏర్పాటుకు ప్రణాళికలు రూపొందించింది. చమురు సంస్థలతో ఇందుకు భాగస్వామ్య ఒప్పందాలు కూడా కుదుర్చుకుంది.