బీజేపీ, తెలంగాణ సీఎం కేసీఆర్, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అండతోనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వలసలు పెరిగాయని ఆరోపించారు. విజయవాడలో మీడియాతో మాట్లాడిన దేవినేని ఉమా పార్టీలు మారడం తప్పులేదన్నారు. కానీ పార్టీలు మారిన తర్వాత చంద్రబాబుపైనా, పార్టీపైనా బురద జల్లడం సరికాదని హితవు పలికారు. అవకాశవాద రాజకీయాల కోసం అవినీతి పరులతో చేతులు కలుపుతూ పార్టీలు మారుతున్నారని మండిపడ్డారు.