ఇల్లు అద్దెకిస్తే వ్యభిచారం, మట్కా.. ఖాళీ చేయమంటే చంపుతామని బెదిరిస్తూ.. వృద్ధురాలి ఆవేదన...
ఇంటిని అద్దెకిస్తే ఓ మహిళ అందులో వ్యభిచారం నిర్వహిస్తూ, అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్నారు. దీంతో వృద్ధురాలు పోలీసులను ఆశ్రయించింది.
నరసరావుపేట : ఆంధ్రప్రదేశ్ లోని నరసరావుపేటలో ఓ దారుణమైన ఘటన వెలుగు చూసింది ఓ వృద్ధురాలు ఇంటిని ఓ మహిళకు అద్దెకు ఇస్తే.. ఆ మహిళ ఇంట్లోనే వ్యభిచారం నిర్వహిస్తూ.. మట్కా వ్యాపారితో అక్రమ సంబంధం పెట్టుకుని ఇంటిని కబ్జా చేసింది. ఖాళీ చేయమని అడిగితే చంపేస్తామంటూ బెదిరిస్తోంది..దీంతో ఆ వృద్ధురాలు అధికారుల చుట్టూ తిరుగుతోంది. ఈ విషాద ఘటన నరసరావుపేట పట్నంలోని రామిరెడ్డిపేట 21వ వార్డులో వెలుగు చూసింది.
బాధితురాలి పేరు తిరుమల శెట్టి సుబ్బాయమ్మ. ఆమెకు ఓ పెంకుటిల్లు ఉంది. ప్రస్తుతం ఆమె పెద్ద కుమారుడి దగ్గర ఉంటుంది. తన పెంకుటింటిని అద్దెకిచ్చింది. చాలా కాలంగా ఓ మహిళ ఆ ఇంట్లో అద్దెకు ఉంటుంది. ఆమె ఓ గుట్కా వ్యాపారితో అక్రమ సంబంధం పెట్టుకుంది. ఆ తర్వాత ఇంట్లోనే మట్కా నిర్వహిస్తూ జల్సాలకు అలవాటు పడిన అతను రాజకీయ నేతల వద్ద పలుకుబడి పెంచుకున్నాడు.
రేపే వైఎస్ జయంతి.. ఇడుపులపాయకు వేర్వేరుగా చేరుకోనున్న జగన్, షర్మిల.. కారణమదేనా..?
ఈ పలుకుబడితో అసాంఘిక వ్యవహారాలకు పాల్పడుతున్నారు. ఆ బలంతోనే వృద్ధురాలు ఇంటికి అద్దె చెల్లించడం లేదు. ఏళ్ల తరబడి ఆ ఇంట్లోనే ఉంటూ అద్దె చెల్లించకపోవడంతో వృద్ధురాలు ఇబ్బంది పడుతోంది. తన వైద్యానికి అయ్యే ఖర్చులకి ఇంటి అద్దె మీద ఆధారపడే ఆమె డబ్బులు అడిగితే.. కట్టమని చెబుతున్నారు. ఇల్లు ఖాళీ చేయమని అడిగితే బెదిరిస్తున్నారు.
దీంతో ఏం చేయాలో తెలియక ఆమె పోలీసులను ఆశ్రయించింది. స్పందన కార్యక్రమంలో భాగంగా జిల్లా పోలీసు ఎస్పి రవిశంకర్ రెడ్డికి ఫిర్యాదు చేసింది. ఆమెను వారు వన్ టౌన్ పోలీస్ స్టేషన్కు పంపించారు. అయితే అక్కడి పోలీసులు ఆమె కేసును సివిల్ వ్యవహారమని పట్టించుకోలేదు. కోర్టుకు వెళ్లాల్సిందిగా తెలిపారు.
రెవెన్యూ డివిజన్ ఆఫీసులో అధికారులను సంప్రదిస్తే ఈ కేసు పోలీసుల దగ్గర తేల్చుకోవాలని చెబుతున్నారు. దీంతో ఏం చేయాలో పాలు పోనీ ఆమె తీవ్ర ఆవేదనలో ఉంది.. ఉన్నతాధికారులు ఈ విషయంలో తనను కనికరించాలని.. తన ఇంటిని ఖాళీ చేయించి అప్పగించాలని కోరుతోంది.